Rahul Gandhi: భారతదేశానికి ఒకే నాయకుడు ఉండాలన్నదే బీజేపీ ఆలోచన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బీజేపీపై విరుచుకుపడ్డారు. ఆయన పోటీ చేస్తున్న వయనాడ్ లోక్సభ స్థానంలో సోమవారం ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ టార్గెట్గా విమర్శలు గుప్పించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దేశంలో ఒకే నాయకుడు ఉండాలనే ఆలోచన చేస్తుందని ఆరోపించారు. ఇది దేశ ప్రజలను అవమానించడమే అని మండిపడ్డారు. భారతదేశం ఒక పూలదండ లాంటిదని, దీంట్లో ప్రతీ పువ్వు గౌరవించబడాలని, అప్పుడే మొత్తం పూల గుత్తికి అందం వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.
Read Also: Sridhar Babu: కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 5 గ్యారంటీలను అమలు చేస్తాం..
Also Read
- Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
- Gas Pipeline: భారత్ మాస్టర్ ప్లాన్.. సముద్రగర్భంలో భారీ గ్యాస్ పైప్లైన్..
- Kamal Haasan: పొదుపు మంత్రంపై కమల్హాసన్ కీలక వ్యాఖ్యలు
- 1991 India Gold Crisis: రాత్రికి రాత్రి బ్రిటన్కు 47,000 కిలోల బంగారం తరలింపు.. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే!
భారతదేశానికి ఒకే నాయకుడు ఉండాలనే ఆలోచన ప్రతీ ఒక్క యువ భారతీయుడిని అవమానించడమే అవుతుందని అన్నారు. భారతదేశంలో ఎక్కువ నాయకులు ఎందుకు ఉండలేకపోతున్నారనిర ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రశిస్తూ.. దీనికి కాంగ్రెస్, బీజేపీ మధ్య ఈ ఆలోచనా విధానమే ప్రధాన తేడా అని అన్నారు. దేశంలోని ప్రజల మాట వినాలని, వారి విశ్వాసాలను, భాష, మతం, సంస్కృతిని ప్రేమించాలని, గౌరవించాలని కాంగ్రెస్ కోరుకుంటోందని అన్నారు. కానీ బీజేపీ అధిష్టానం మాత్రం ఏదో రకమైన ఆంక్షలు విధించాలని భావిస్తోందని ఆరోపించారు.
ఆర్ఎస్ఎస్ భావజాలంతో బ్రిటీష్ వారి నుంచి మనకు స్వేచ్ఛ లభించలేదని, భారతదేశాన్ని ప్రజలంతా భావించాలని మేము కోరుకుంటున్నామని రాహుల్ గాంధీ అన్నారు. వయనాడ్ నుంచి మరోసారి ఆయన ఎంపీ బరిలో నిలుచున్నారు. నామినేషన్ తర్వాత ఆయన రెండోసారి నియోజకవర్గంలో పర్యటించారు. 2019 లోక్సభ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 4,31,770 ఓట్ల తేడాతో విజయం సాధించారు. కేరళలోని 20 స్థానాలకు ఏప్రిల్ 26న పోలింగ్ జరగనుంది.
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..