Electoral Bonds: ఎలక్టోరల్ బాండ్స్తో బీజేపీ రూ. 6,986 కోట్లు.. తర్వాత స్థానంలో ఉన్న పార్టీలు ఇవే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Electoral Bonds: ఎలక్టోరల్ బాండ్స్కి సంబంధించి తాజాగా ఈసీ ఈ రోజు కొత్త సమాచారాన్ని విడుదల చేసింది. 2018లో ప్రవేశపెట్టిన ఈ బాండ్ల ద్వారా అధికార బీజేపీకి గరిష్టంగా రూ. 6986.5 కోట్ల నిధులు అందాయి. ఆ తర్వాత స్థానంలో పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ (రూ. 1,397 కోట్లు), కాంగ్రెస్ (రూ. 1,334 కోట్లు), BRS (రూ. 1,322 కోట్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ ఎలక్టోరల్ బాండ్ల విషయంలో అగ్రకొనుగోలుదారుగా ఉన్న ఫ్యూచర్ గేమింగ్, హోటల్ సర్వీసెస్ ద్వారా తమిళనాడు అధికార పార్టీ డీఎంకేకి రూ. 509 కోట్ల విరాళం అందినట్లు ఎన్నికల సంఘం డేటా ఆదివారం వెల్లడించింది. ఈ ఎలక్టోరల్ బాండ్ల కొనుగోలులో అగ్రస్థానంలో ఈ కంపెనీ ఉంది. ఒకే కంపెనీ నుంచి ఒకే పార్టీకి ఇంత మొత్తంలో నిధులు రావడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
Read Also: Manoj Sharma: ‘‘12th ఫెయిల్’’ రియల్ హీరోకి IGగా ప్రమోషన్..
Also Read
- CM Vijay: సీఎం విజయ్కు మరో షాక్.. సుప్రీంకోర్టులో పిల్
- Explained: జోక్గా మొదలై ఉద్యమంగా మారిందా?.. కోటికి పైగా ఫాలోవర్స్తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ‘Cockroach Janata Party’
- Vande Mataram in Madrasas: మదర్సాలలో వందేమాతరం తప్పనిసరి.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
- Petrol Diesel Price Hike: పెట్రోల్-డీజిల్ ధరలపై భారీ హెచ్చరికలు.. మరోసారి పెరుగుతాయా?
ఒడిశాలో అధికార పార్టీ బీజేడీకి రూ. 944.5 కోట్లు, డీఎంకేకి రూ. 656.5 కోట్లు, వైస్సార్సీపీకి రూ. 442.8 కోట్ల నిధులు అందాయి. జేడీఎస్కి రూ. 89.5 కోట్ల విలువైన బాండ్లను అందుకుంది. లాటరీ కింగ్ శాంటియాగో మార్టిన్కి చెందిన ఫ్యూచర్ గేమింగ్ రూ. 1368 కోట్లతో ఎలక్టోరల్ బాండ్లను అత్యధికంగా కొనుగోలు చేసింది. ఇందులో 37 శాతం డీఎంకే పార్టీకి నిధులు వెళ్లాయి. దాతల గుర్తింపు వెల్లడించిన కొద్ది పార్టీల్లో డీఎంకే ఉంది. అయితే, బీజేపీ, కాంగ్రెస్, టీఎంసీ, ఆప్ వంటి ప్రధాన పార్టీలు ఎన్నికల కమిషన్కి వివరాలను వెల్లడించలేదు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం వీటిని బహిరంగపరచాల్సి ఉంది. ఈ బాండ్ల ద్వారా టీడీపీకి రూ. 181.35 కోట్లు, శివసేనకు రూ. 60.4 కోట్లు, ఆర్జేడీకి రూ. 56 కోట్లు, సమాజ్వాదీ పార్టీకి రూ. 14.05 కోట్లు, అకాలీదళ్కి రూ. 7.26 కోట్లు, ఏఐడీఎంకేకీ రూ. 6.05 కోట్లు, నేషనల్ కాన్ఫరెన్స్కి రూ. 50 లక్షలు అందాయి. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా నిధులు స్వీకరించబోమని సీపీఎం ప్రకటించింది.
- Tags
- bjp
- DMK
- EC
- Electoral Bonds
- Supreme Court
తాజావార్తలు
-
PEDDI Ki Aawaz: నమస్తే భోపాల్.. దసరా మైదాన్లో ‘పెద్ది’ దిగుతున్నాడు!
-
CM Vijay: సీఎం విజయ్కు మరో షాక్.. సుప్రీంకోర్టులో పిల్
-
Drishyam 3 OTT Partner: ‘దృశ్యం 3’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. భారీ ధరకు డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ!
-
UPSC Exam Calendar 2027: UPSC పరీక్షల క్యాలెండర్ 2027 విడుదల.. కీలక పరీక్షల తేదీలు ప్రకటించిన కమిషన్
-
Rohit Sharma-ODI WC: 2027 వరల్డ్కప్లో రోహిత్ శర్మ ఆడటం కష్టమేనా?.. బీసీసీఐకి బిగ్ టెన్షన్!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!