Gurpatwant Singh Pannun: హిందువులను బెదిరించిన ఖలిస్తాన్ ఉగ్రవాది.. యాక్షన్ మొదలెట్టిన కేంద్రం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gurpatwant Singh Pannun: ఖలిస్తాన్ ఉగ్రవాది, సిక్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్జే) ఉగ్రసంస్థ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూపై కేంద్రం యాక్షన్ మొదలు పెట్టింది. ఇటీవల కెనడాలోని హిందువులు పారిపోవాలని హెచ్చరించాడు. గతంలో కూడా ఇలాగే ప్రధాని నరేంద్రమోడీ, మంత్రులు అమిత్ షా, జై శంకర్ ని హెచ్చరిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో కేంద్రం కూడా గట్టి చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది.
ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ ఇటీవల కెనడాలో హత్యకు గురైన సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పుడు ఇండియా, కెనడాల మధ్య తీవ్ర దౌత్యవివాదం చెలరేగుతోంది. భారత్ కూడా ఇటు కెనడాకు బుద్ది చెప్పడంతో పాటు ఖలిస్తానీ ఉగ్రవాదులపై గట్టి చర్యలు తీసుకుంటోంది. తాజాగా గురుపత్వంత్ సింగ్ పన్నూకి పంజాబ్, చండీగఢ్ ప్రాంతాల్లో ఉన్న ఇళ్లు, భూములను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) స్వాధీనం చేసుకుంది. అమృత్సర్ లో అతనికి చెందిన భూమిని జప్తు చేసింది.
అమృత్సర్ జిల్లా శివార్లలో అతని పూర్వీకులకు ఉన్న భూమిని స్వాధీనం చేసుకున్నారు. పన్నూకు ఉన్న అన్ని ఆస్తుల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటోంది. పంజాబ్లో పన్నన్పై మూడు దేశద్రోహం సహా 22 క్రిమినల్ కేసులు ఉన్నాయి.
Also Read
- Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
- UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
- UPI Charges: మళ్లీ క్యాష్ ఎకానమీ వైపు భారత్? రిటైలర్ల ఆందోళన
- Cooking Oil Prices: పండగల వేళ సామాన్యుడికి ఊరట.. వంటనూనెలపై దిగుమతి కేంద్రం కీలక అడుగు!
Read Also: Srikanth Iyengar: ఏం పీకుతాడో చూస్తా.. బూతులతో రెచ్చిపోయిన శ్రీకాంత్ అయ్యంగార్
కెనడా-ఇండియా దౌత్యవివాదం చెలరేగిన తర్వాత.. పన్నూ ఓ వీడియోలో మాట్లాడుతూ.. ఇండో కెనడియన్ హిందువులారా, మీరు కెనడా, కెనడా రాజ్యాంగంపై విధేయత చూపించడం లేదు. మీరు కెనడాను వదిలి భారత్ వెళ్లిపోవాలి అని హెచ్చరించాడు. ఖలిస్తాన్ అనుకూల సిక్కులు ఎప్పుడూ కెనడాకు విధేయులుగా ఉన్నారు. వారు ఎల్లప్పుడు కెనడా పక్షాన, అక్కడి చట్టాలను, రాజ్యాంగాన్ని సమర్థిస్తున్నారు అని అన్నాడు.
కేంద్రం హోం మంత్రిత్వ శాఖ 2020లో పన్నూను ఉగ్రవాదిగా ప్రకటించింది. అతని కోసం ఇంటర్పోల్ రెడ్ నోటీసులు జారీ చేసింది. అయితే భారత అభ్యర్థనను ఇంటర్పోల్ రెండు సార్లు తిరస్కరించింది. పన్నూ విదేశాల్లో ఉంటూ ఖలిస్తాన్ ఉద్యమం, భారత వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నాడు. కెనడాలో ఖలిస్తాన్ రెఫరెండం నిర్వహించడంలో కీలకంగా ఉన్నాడు. ఇదే కాకుండా పాక్ గూఢాచర సంస్థ ఐఎస్ఐతో అతనికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.
తాజావార్తలు
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
-
ED Raids : అమెరికన్లకు ఫేక్ కాల్స్.. భారత్లో ఈడీ మెరుపు దాడులు.!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!