Gurpatwant Singh Pannun: హిందువులను బెదిరించిన ఖలిస్తాన్ ఉగ్రవాది.. యాక్షన్ మొదలెట్టిన కేంద్రం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gurpatwant Singh Pannun: ఖలిస్తాన్ ఉగ్రవాది, సిక్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్జే) ఉగ్రసంస్థ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూపై కేంద్రం యాక్షన్ మొదలు పెట్టింది. ఇటీవల కెనడాలోని హిందువులు పారిపోవాలని హెచ్చరించాడు. గతంలో కూడా ఇలాగే ప్రధాని నరేంద్రమోడీ, మంత్రులు అమిత్ షా, జై శంకర్ ని హెచ్చరిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో కేంద్రం కూడా గట్టి చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది.
ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ ఇటీవల కెనడాలో హత్యకు గురైన సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పుడు ఇండియా, కెనడాల మధ్య తీవ్ర దౌత్యవివాదం చెలరేగుతోంది. భారత్ కూడా ఇటు కెనడాకు బుద్ది చెప్పడంతో పాటు ఖలిస్తానీ ఉగ్రవాదులపై గట్టి చర్యలు తీసుకుంటోంది. తాజాగా గురుపత్వంత్ సింగ్ పన్నూకి పంజాబ్, చండీగఢ్ ప్రాంతాల్లో ఉన్న ఇళ్లు, భూములను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) స్వాధీనం చేసుకుంది. అమృత్సర్ లో అతనికి చెందిన భూమిని జప్తు చేసింది.
అమృత్సర్ జిల్లా శివార్లలో అతని పూర్వీకులకు ఉన్న భూమిని స్వాధీనం చేసుకున్నారు. పన్నూకు ఉన్న అన్ని ఆస్తుల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటోంది. పంజాబ్లో పన్నన్పై మూడు దేశద్రోహం సహా 22 క్రిమినల్ కేసులు ఉన్నాయి.
Also Read
- Union Budget: అక్టోబర్ 12 నుంచి కేంద్ర బడ్జెట్ కసరత్తు.. కీలక అంశాలపై ఫోకస్
- Central Employees: కేంద్ర ఉద్యోగుల జీతాల్లో ఊహించని మార్పు.. 3 శాతం ఉన్న ఇంక్రిమెంట్ 6 శాతానికి..?
- PM Modi: ఉజ్బెకిస్థాన్కు చేరుకున్న మోడీ.. అధ్యక్షుడు మిర్జియోయెవ్ ఘన స్వాగతం
- Reservation row: కేంద్ర మంత్రుల మధ్య మాటల యుద్ధం.. మంట పెట్టిన ‘‘రిజర్వేషన్’’ అంశం..
Read Also: Srikanth Iyengar: ఏం పీకుతాడో చూస్తా.. బూతులతో రెచ్చిపోయిన శ్రీకాంత్ అయ్యంగార్
కెనడా-ఇండియా దౌత్యవివాదం చెలరేగిన తర్వాత.. పన్నూ ఓ వీడియోలో మాట్లాడుతూ.. ఇండో కెనడియన్ హిందువులారా, మీరు కెనడా, కెనడా రాజ్యాంగంపై విధేయత చూపించడం లేదు. మీరు కెనడాను వదిలి భారత్ వెళ్లిపోవాలి అని హెచ్చరించాడు. ఖలిస్తాన్ అనుకూల సిక్కులు ఎప్పుడూ కెనడాకు విధేయులుగా ఉన్నారు. వారు ఎల్లప్పుడు కెనడా పక్షాన, అక్కడి చట్టాలను, రాజ్యాంగాన్ని సమర్థిస్తున్నారు అని అన్నాడు.
కేంద్రం హోం మంత్రిత్వ శాఖ 2020లో పన్నూను ఉగ్రవాదిగా ప్రకటించింది. అతని కోసం ఇంటర్పోల్ రెడ్ నోటీసులు జారీ చేసింది. అయితే భారత అభ్యర్థనను ఇంటర్పోల్ రెండు సార్లు తిరస్కరించింది. పన్నూ విదేశాల్లో ఉంటూ ఖలిస్తాన్ ఉద్యమం, భారత వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నాడు. కెనడాలో ఖలిస్తాన్ రెఫరెండం నిర్వహించడంలో కీలకంగా ఉన్నాడు. ఇదే కాకుండా పాక్ గూఢాచర సంస్థ ఐఎస్ఐతో అతనికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.
తాజావార్తలు
-
Bank Locker Swept: వరదల్లో కొట్టుకుపోయిన బ్యాంకు లాకర్.. రూ. లక్షల్లో డబ్బు.. ఎగబడిన జనం
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
NBK111 vs King100: బాలయ్య vs నాగ్.. క్రిస్మస్ బాక్సాఫీస్పై మరో బిగ్ క్లాష్!
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభాలు!
-
Irummudi: ‘బాహుబలి’, ‘పుష్ప’ సినిమాలను వెనక్కి నెట్టిన రవితేజ ‘ఇరుముడి’!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!