India-Canada: భారత్ లేదా కెనడా అని తేల్చుకోవాల్సి వస్తే.. మేం వారి వెంటే, అమెరికా అధికారి కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India-Canada: ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కెనడా, భారతదేశాల మధ్య దౌత్యవివాదానికి కారణమైంది. ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో ఈ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని వ్యాఖ్యానించారు. కెనడా, భారత సీనియర్ దౌత్యవేత్తను బహిష్కరించింది. అయితే ఇందుకు స్ట్రాంగ్ గానే భారత్ కూడా స్పందించింది. కెనడియన్ దౌత్యవేత్తను భారత్ ఐదురోజుల్లో దేశం వదిలిపెట్టి వెళ్లాలని ఆదేశించింది. కెనడా వ్యాఖ్యలు అసంబద్ధ, ప్రేరేపిత వ్యాఖ్యలుగా అభివర్ణించింది. కెనడా తీవ్రవాదులకు స్వర్గధామంగా మారిందని ఆరోపించింది.
ఇదిలా ఉంటే ఈ వివాదంలో అమెరికాకు ఎటూ పాలుపోవడం లేదు. రెండు దేశాలు కూడా కీలకమే కావడంతో ఆచితూచి స్పందిస్తోంది. ఇదిలా ఉంటే అమెరికా మాజీ పెంటగాన్ అధికారి కీలక వ్యాఖ్యలు చేశారు. జస్టిన్ ట్రూడో చేసిన వ్యాఖ్యలు భారత్ కంటే కెనడాకే ఎక్కువ ప్రమాదం అని పెంటగాన్ మాజీ అధికారి మైఖెల్ రూబిన్ అన్నారు. భారత్ లేదా కెనడాల్లో ఎంచుకోవాల్సి వస్తే, అమెరికా భారత్ కే ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. కెనడా కన్నా అమెరికాకు భారత్ వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమని తెలిపారు.
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
Read Also: India At UN: పీఓకేని ఖాళీ చేయండి, ఉగ్రవాదాన్ని ఆపండి.. పాక్పై ధ్వజం
కెనడా, భారత్ పై పోరాటానికి దిగడం ‘‘ఏనుగుపై చీమ పోరాడినట్లే’’ అని ఆయన అన్నారు. ట్రూడో పెద్ద తప్పు చేశాడని తాను భావిస్తున్నట్లు రూబిన్ వెల్లడించారు. భారత్ పై చేసిన ఆరోపణలకు కెనడా వద్ద ఆధారాలు లేవని, ఒక ఉగ్రవాదికి ప్రభుత్వం ఎందుకు ఆశ్రయిం ఇచ్చిందని ప్రశ్నించారు. హర్దీప్ నిజ్జర్ ఒక ఉగ్రవాది అయినందు వల్ల మేం భారత్ వైపే ఉంటామని అన్నారు.
నిజ్జర్ కేవలం ప్లంబర్ మాత్రమే కాదని, అనేక దాడులకు పాల్పడిన అతని చేతులు రక్తంతో తడిచాయని, ఒసామా బిన్ లాడెన్ ఒక ఇంజనీర్ కంటే ఎక్కువ అని అన్నారు. మనం మాట్లాడుతున్నది సీమాంతర అణిచివేత గురించి కాదని, సీమాంతర ఉగ్రవాదం గురించి అని అన్నారు. భారత్ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, చైనాను ఎదుర్కొనే విసయంలో భారత్ కీలకమని అని స్పష్టం చేశారు. ప్రధాని హోదాలో జస్టిన్ ట్రూడో ఎక్కువ కాలం కొనసాగకపోవచ్చు, అతను వెళ్లిపోయిన తర్వాత మేం కెనడాతో మా బంధాన్ని పునరుద్ధరించుకుంటామని వెల్లడించారు.
తాజావార్తలు
-
Apple iPhone 18 Pro Sale: iPhone 18 Pro కొనుగోలు కోసం రాత్రి నుంచే భారీ క్యూ.. Apple స్టోర్ వద్ద కస్టమర్ల సందడి
-
Astrology: సెప్టెంబర్ 18 శుక్రవారం దినఫలాలు.. ఈ రాశివాళ్లకు గుడ్ న్యూస్.. కానీ, ఈ పరిహారం చెల్లించాలి..!
-
Udaya Bhanu : చూపులు,మాటలు నచ్చక యాక్టింగ్ నుండి యాంకరింగ్
-
Udaya Bhanu : నా పర్సనల్ లైఫ్ రచ్చకెక్కి ఛానళ్ల దాకా ఎందుకు వెళ్లిందంటే.. అసలు నిజాన్ని బయటపెట్టిన ఉదయభాను!
-
Udaya Bhanu: బంగారు తాళిబొట్టు పార్శిల్.. ‘నా శ్రీమతి’ అంటూ లెటర్స్.. భయంతో పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన స్టార్ యాంకర్!
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!