India-Canada: భారత్ లేదా కెనడా అని తేల్చుకోవాల్సి వస్తే.. మేం వారి వెంటే, అమెరికా అధికారి కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India-Canada: ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కెనడా, భారతదేశాల మధ్య దౌత్యవివాదానికి కారణమైంది. ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో ఈ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని వ్యాఖ్యానించారు. కెనడా, భారత సీనియర్ దౌత్యవేత్తను బహిష్కరించింది. అయితే ఇందుకు స్ట్రాంగ్ గానే భారత్ కూడా స్పందించింది. కెనడియన్ దౌత్యవేత్తను భారత్ ఐదురోజుల్లో దేశం వదిలిపెట్టి వెళ్లాలని ఆదేశించింది. కెనడా వ్యాఖ్యలు అసంబద్ధ, ప్రేరేపిత వ్యాఖ్యలుగా అభివర్ణించింది. కెనడా తీవ్రవాదులకు స్వర్గధామంగా మారిందని ఆరోపించింది.
ఇదిలా ఉంటే ఈ వివాదంలో అమెరికాకు ఎటూ పాలుపోవడం లేదు. రెండు దేశాలు కూడా కీలకమే కావడంతో ఆచితూచి స్పందిస్తోంది. ఇదిలా ఉంటే అమెరికా మాజీ పెంటగాన్ అధికారి కీలక వ్యాఖ్యలు చేశారు. జస్టిన్ ట్రూడో చేసిన వ్యాఖ్యలు భారత్ కంటే కెనడాకే ఎక్కువ ప్రమాదం అని పెంటగాన్ మాజీ అధికారి మైఖెల్ రూబిన్ అన్నారు. భారత్ లేదా కెనడాల్లో ఎంచుకోవాల్సి వస్తే, అమెరికా భారత్ కే ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. కెనడా కన్నా అమెరికాకు భారత్ వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమని తెలిపారు.
Also Read
- Chhattisgarh Congress: ఛత్తీస్గఢ్లోని కాంగ్రెస్ ఆఫీస్లో వింతైన ఘటన.. నల్లాలు దొంగిలించి.. నేలపై 'లవ్ యూ' నోట్!
- Bhojshala Case: "భోజ్శాల ఆలయం కాదు".. హైకోర్టు తీర్పుపై కాంగ్రెస్ నేత వ్యాఖ్యలు..
- Bangladesh: ‘‘గంగా నది’’పైనే భారత సంబంధాలు ఆధారపడుతాయి..
- VD Satheesan Oath Ceremony: రేపే కేరళంలో కొలువుదీరనున్న కొత్త సర్కార్.. చీఫ్ గెస్ట్లు వీరే!
Read Also: India At UN: పీఓకేని ఖాళీ చేయండి, ఉగ్రవాదాన్ని ఆపండి.. పాక్పై ధ్వజం
కెనడా, భారత్ పై పోరాటానికి దిగడం ‘‘ఏనుగుపై చీమ పోరాడినట్లే’’ అని ఆయన అన్నారు. ట్రూడో పెద్ద తప్పు చేశాడని తాను భావిస్తున్నట్లు రూబిన్ వెల్లడించారు. భారత్ పై చేసిన ఆరోపణలకు కెనడా వద్ద ఆధారాలు లేవని, ఒక ఉగ్రవాదికి ప్రభుత్వం ఎందుకు ఆశ్రయిం ఇచ్చిందని ప్రశ్నించారు. హర్దీప్ నిజ్జర్ ఒక ఉగ్రవాది అయినందు వల్ల మేం భారత్ వైపే ఉంటామని అన్నారు.
నిజ్జర్ కేవలం ప్లంబర్ మాత్రమే కాదని, అనేక దాడులకు పాల్పడిన అతని చేతులు రక్తంతో తడిచాయని, ఒసామా బిన్ లాడెన్ ఒక ఇంజనీర్ కంటే ఎక్కువ అని అన్నారు. మనం మాట్లాడుతున్నది సీమాంతర అణిచివేత గురించి కాదని, సీమాంతర ఉగ్రవాదం గురించి అని అన్నారు. భారత్ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, చైనాను ఎదుర్కొనే విసయంలో భారత్ కీలకమని అని స్పష్టం చేశారు. ప్రధాని హోదాలో జస్టిన్ ట్రూడో ఎక్కువ కాలం కొనసాగకపోవచ్చు, అతను వెళ్లిపోయిన తర్వాత మేం కెనడాతో మా బంధాన్ని పునరుద్ధరించుకుంటామని వెల్లడించారు.
తాజావార్తలు
-
Virat Kohli: అరుదైన రికార్డు సాధించిన విరాట్ కోహ్లీ.. చరిత్ర పుటల్లో ఒకే ఒక్కడుగా..
-
US-Iran War: ఇరాన్కు అమెరికా 5 షరతులు.. యురేనియం ఇవ్వాలని డిమాండ్..
-
Satish Kilaru: ‘పెద్ది’లో సుకుమార్ ఇన్వాల్వ్మెంట్..? లాస్ట్ డే డైరెక్టర్ బుచ్చిబాబు చాలా ఎమోషనల్ అయ్యారు!
-
AP Government: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. జూన్ 12 నుంచి ప్రారంభం..
-
PBKS Vs RCB: కోహ్లీ, వెంకటేశ్ అయ్యర్ వీర విహారం.. భారీ స్కోర్ సాధించిన ఆర్సీబీ..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..