India-Canada: భారత్ లేదా కెనడా అని తేల్చుకోవాల్సి వస్తే.. మేం వారి వెంటే, అమెరికా అధికారి కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India-Canada: ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కెనడా, భారతదేశాల మధ్య దౌత్యవివాదానికి కారణమైంది. ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో ఈ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని వ్యాఖ్యానించారు. కెనడా, భారత సీనియర్ దౌత్యవేత్తను బహిష్కరించింది. అయితే ఇందుకు స్ట్రాంగ్ గానే భారత్ కూడా స్పందించింది. కెనడియన్ దౌత్యవేత్తను భారత్ ఐదురోజుల్లో దేశం వదిలిపెట్టి వెళ్లాలని ఆదేశించింది. కెనడా వ్యాఖ్యలు అసంబద్ధ, ప్రేరేపిత వ్యాఖ్యలుగా అభివర్ణించింది. కెనడా తీవ్రవాదులకు స్వర్గధామంగా మారిందని ఆరోపించింది.
ఇదిలా ఉంటే ఈ వివాదంలో అమెరికాకు ఎటూ పాలుపోవడం లేదు. రెండు దేశాలు కూడా కీలకమే కావడంతో ఆచితూచి స్పందిస్తోంది. ఇదిలా ఉంటే అమెరికా మాజీ పెంటగాన్ అధికారి కీలక వ్యాఖ్యలు చేశారు. జస్టిన్ ట్రూడో చేసిన వ్యాఖ్యలు భారత్ కంటే కెనడాకే ఎక్కువ ప్రమాదం అని పెంటగాన్ మాజీ అధికారి మైఖెల్ రూబిన్ అన్నారు. భారత్ లేదా కెనడాల్లో ఎంచుకోవాల్సి వస్తే, అమెరికా భారత్ కే ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. కెనడా కన్నా అమెరికాకు భారత్ వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమని తెలిపారు.
Also Read
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
- PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
- NCERT: 9వ తరగతి సిలబస్లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
- Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
Read Also: India At UN: పీఓకేని ఖాళీ చేయండి, ఉగ్రవాదాన్ని ఆపండి.. పాక్పై ధ్వజం
కెనడా, భారత్ పై పోరాటానికి దిగడం ‘‘ఏనుగుపై చీమ పోరాడినట్లే’’ అని ఆయన అన్నారు. ట్రూడో పెద్ద తప్పు చేశాడని తాను భావిస్తున్నట్లు రూబిన్ వెల్లడించారు. భారత్ పై చేసిన ఆరోపణలకు కెనడా వద్ద ఆధారాలు లేవని, ఒక ఉగ్రవాదికి ప్రభుత్వం ఎందుకు ఆశ్రయిం ఇచ్చిందని ప్రశ్నించారు. హర్దీప్ నిజ్జర్ ఒక ఉగ్రవాది అయినందు వల్ల మేం భారత్ వైపే ఉంటామని అన్నారు.
నిజ్జర్ కేవలం ప్లంబర్ మాత్రమే కాదని, అనేక దాడులకు పాల్పడిన అతని చేతులు రక్తంతో తడిచాయని, ఒసామా బిన్ లాడెన్ ఒక ఇంజనీర్ కంటే ఎక్కువ అని అన్నారు. మనం మాట్లాడుతున్నది సీమాంతర అణిచివేత గురించి కాదని, సీమాంతర ఉగ్రవాదం గురించి అని అన్నారు. భారత్ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, చైనాను ఎదుర్కొనే విసయంలో భారత్ కీలకమని అని స్పష్టం చేశారు. ప్రధాని హోదాలో జస్టిన్ ట్రూడో ఎక్కువ కాలం కొనసాగకపోవచ్చు, అతను వెళ్లిపోయిన తర్వాత మేం కెనడాతో మా బంధాన్ని పునరుద్ధరించుకుంటామని వెల్లడించారు.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!