India-Canada: భారత్ లేదా కెనడా అని తేల్చుకోవాల్సి వస్తే.. మేం వారి వెంటే, అమెరికా అధికారి కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India-Canada: ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కెనడా, భారతదేశాల మధ్య దౌత్యవివాదానికి కారణమైంది. ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో ఈ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని వ్యాఖ్యానించారు. కెనడా, భారత సీనియర్ దౌత్యవేత్తను బహిష్కరించింది. అయితే ఇందుకు స్ట్రాంగ్ గానే భారత్ కూడా స్పందించింది. కెనడియన్ దౌత్యవేత్తను భారత్ ఐదురోజుల్లో దేశం వదిలిపెట్టి వెళ్లాలని ఆదేశించింది. కెనడా వ్యాఖ్యలు అసంబద్ధ, ప్రేరేపిత వ్యాఖ్యలుగా అభివర్ణించింది. కెనడా తీవ్రవాదులకు స్వర్గధామంగా మారిందని ఆరోపించింది.
ఇదిలా ఉంటే ఈ వివాదంలో అమెరికాకు ఎటూ పాలుపోవడం లేదు. రెండు దేశాలు కూడా కీలకమే కావడంతో ఆచితూచి స్పందిస్తోంది. ఇదిలా ఉంటే అమెరికా మాజీ పెంటగాన్ అధికారి కీలక వ్యాఖ్యలు చేశారు. జస్టిన్ ట్రూడో చేసిన వ్యాఖ్యలు భారత్ కంటే కెనడాకే ఎక్కువ ప్రమాదం అని పెంటగాన్ మాజీ అధికారి మైఖెల్ రూబిన్ అన్నారు. భారత్ లేదా కెనడాల్లో ఎంచుకోవాల్సి వస్తే, అమెరికా భారత్ కే ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. కెనడా కన్నా అమెరికాకు భారత్ వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమని తెలిపారు.
Also Read
- IIT Deaths: ఐఐటీల్లో ఈ చావులు వెనుక ఉన్న కారణాలేంటి? విద్యార్థులను బలి తీసుకుంటుంది ఎవరు?
- NEET Counselling 2026: NEET కౌన్సెలింగ్ తొలి విడతలో సీటు రాకపోవడంతో.. 21 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య
- High Court Slams FDA: ‘మీరేమైన దేవుడు అనుకుంటున్నారా..?’ ఎఫ్డీఏకు హైకోర్టు షాక్..!
- India’s New Time Rule: ISTపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా కొత్త టైమ్ రూల్స్.. ఎప్పటినుంచంటే?
Read Also: India At UN: పీఓకేని ఖాళీ చేయండి, ఉగ్రవాదాన్ని ఆపండి.. పాక్పై ధ్వజం
కెనడా, భారత్ పై పోరాటానికి దిగడం ‘‘ఏనుగుపై చీమ పోరాడినట్లే’’ అని ఆయన అన్నారు. ట్రూడో పెద్ద తప్పు చేశాడని తాను భావిస్తున్నట్లు రూబిన్ వెల్లడించారు. భారత్ పై చేసిన ఆరోపణలకు కెనడా వద్ద ఆధారాలు లేవని, ఒక ఉగ్రవాదికి ప్రభుత్వం ఎందుకు ఆశ్రయిం ఇచ్చిందని ప్రశ్నించారు. హర్దీప్ నిజ్జర్ ఒక ఉగ్రవాది అయినందు వల్ల మేం భారత్ వైపే ఉంటామని అన్నారు.
నిజ్జర్ కేవలం ప్లంబర్ మాత్రమే కాదని, అనేక దాడులకు పాల్పడిన అతని చేతులు రక్తంతో తడిచాయని, ఒసామా బిన్ లాడెన్ ఒక ఇంజనీర్ కంటే ఎక్కువ అని అన్నారు. మనం మాట్లాడుతున్నది సీమాంతర అణిచివేత గురించి కాదని, సీమాంతర ఉగ్రవాదం గురించి అని అన్నారు. భారత్ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, చైనాను ఎదుర్కొనే విసయంలో భారత్ కీలకమని అని స్పష్టం చేశారు. ప్రధాని హోదాలో జస్టిన్ ట్రూడో ఎక్కువ కాలం కొనసాగకపోవచ్చు, అతను వెళ్లిపోయిన తర్వాత మేం కెనడాతో మా బంధాన్ని పునరుద్ధరించుకుంటామని వెల్లడించారు.
తాజావార్తలు
-
IIT Deaths: ఐఐటీల్లో ఈ చావులు వెనుక ఉన్న కారణాలేంటి? విద్యార్థులను బలి తీసుకుంటుంది ఎవరు?
-
NEET Counselling 2026: NEET కౌన్సెలింగ్ తొలి విడతలో సీటు రాకపోవడంతో.. 21 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య
-
Laikey Laikaa: రాషా థడానీ ఇంటెన్స్ రొమాంటిక్ యాక్షన్ ఆగిపోలేదు.. వాలెంటైన్స్ డేకు వస్తోంది..
-
China: వేలాది కుటుంబాల కన్నీటి వేదన..నిజాలను సమాధి చేసే పాలన.. చైనా నిజస్వరూపం ఇదే!
-
TVS, Vida, Zelio, Bounce: బడ్జెట్లో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్.. రూ.36,000కే చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్..!
ట్రెండింగ్
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!