Rajouri terror attack: పీఓకే నుంచి రాజౌరి ఉగ్రదాడి.. లష్కర్ తీవ్రవాది సజ్జిద్ జుట్ హస్తం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajouri terror attack: జమ్మూ కాశ్మీర్ లో ఏడు నుంచి తొమ్మిది మంది ఉగ్రవాదులను గుర్తించేందుకు భద్రతాబలగాలు పెద్ద ఎత్తున గాలింపు చేపట్టాయి. హెలికాప్టర్లు, డ్రోన్లతో సరిహద్దుల్లోని అడవులను స్కాన్ చేస్తున్నాయి. శుక్రవారం జరిగిన రాజౌరీ ఎన్ కౌంటర్ లో ఐదుగురు జవాన్లు మరణించడంతో ప్రతీకారం తీర్చుకునేందుకు సైన్యం ఉగ్రవాదుల కోసం వెతుకుతోంది. ఇప్పటికే రాజౌరీతో పాటు బారాముల్లాలో ఎన్ కౌంటర్లు జరుగుతున్నాయి.
ఈ ఉగ్రదాడుల వెనక నిషేధిత లష్కరేతోయిబా ఉగ్రసంస్థ ఇంటెలిజెన్స్ తేల్చింది. రాజౌరీ-పూంచ్ సెక్టార్లో స్థానికుల మద్దతుతో రెండు గ్రూపుల లష్కరేతోయిబా ఉగ్రవాదులు ఉండే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. తాజాగా శుక్రవారం రాజౌరీలో 9 పారా కమాండోలపై దాడిని బట్టి చూస్తే .. ఈ ప్రాంతంలో ఇద్దరు పాకిస్తానీలతో పాటు ఐదుగురు ఉగ్రవాదులతో కూడిన బృందం ఉండవచ్చని భద్రతా సంస్థలు భావిస్తున్నాయి.
Also Read
- Attack On Ship: ఉక్రెయిన్ ఒడెసా పోర్టులో కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయులు మృతి..
- JP Nadda - CJP Leaders: నడ్డాతో సీజేపీ నాయకుల భేటీ.. సీజేపీ డిమాండ్స్ ఇవే!
- West Bengal: సెప్టెంబర్ 1 నుంచి బెంగాల్లో కొత్త రూల్.. మాతృ భాషకు పట్టం కట్టిన సీఎం సువేందు అధికారి!
- Abhijeet Dipke: ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజీత్ దీప్కే అరెస్ట్..
Read Also: The Kerala Story : ‘ది కేరళ స్టోరీ’ సినిమాకు ఫస్ట్ డే మైండ్ బ్లోయింగ్ కలెక్షన్స్
పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతంలోని కోట్లీ నుంచి జమ్మూ రియాసి నివాసి అయిన రియాజ్ అహ్మద్ అలియాస్ ఖాసీమ్ తో పాటు లష్కర్ కమాండర్ హబీబుల్లా మాలిక్ అలియాస్ సజ్జిద్ జుట్ అలియాస్ సజ్జిద్ లాంగ్డా ఈ ఉగ్రదాడులను ఆపరేట్ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం లాహోర్ లోని మురిద్కే ప్రాంతంలోని లష్కరేతోయిబా ప్రధాన కార్యాలయం నుంచి పథక రచన చేస్తున్నారని భద్రతా సంస్థల వద్ద సమాచారం ఉంది. దీంతో పాటు పూంచ్ లోని మెందార్ నివాసి రఫీక్ నాయ్ అలియస్ సుల్తాన్ కూడా ప్రస్తుతం పాకిస్తాన్ లోనే ఉన్నాడు. దక్షిణ కాశ్మీర్ లో రిక్రూట్మెంట్, ఆయుధాల స్మగ్లింగ్, టెర్రర్ ఫైనాన్స్ వంటి ఉగ్రవాద కార్యకలాపాలకు వీరు పాల్పడుతున్నారు.
ఈ ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్-పీఓకే సరిహద్దుల్లోని అటవీ ప్రాంతాలను సురక్షిత స్థావరాలుగా మార్చుకుంటున్నారు. సజ్జిద్ జట్ మాడ్యూల్ 2021లో భాటా ధురియన్ అటవీ ప్రాంతంలో భారత ఆర్మీ దళాలపై దాడి చేసింది. ఈ ఉగ్రదాడిలోొ 9 మంది భారత జవాన్లు మరణించారు. ఇదిలా ఉంటే తాజాగా ఉగ్రదాడులు, ఎన్కౌంటర్ల నేపథ్యంలో ఆర్మీ కమాండర్లు, ఉన్నతాధికారులు ఈ రోజు శ్రీనగర్ వెళ్తున్నారు.
తాజావార్తలు
-
New Airport: మారబోతున్న ఉత్తర తెలంగాణ రూపురేఖలు.. రూ. 496.86 కోట్లతో ఆ విమానాశ్రయానికి ఆమోదం..
-
Naga Chaitanya : నాగార్జున నైజం బయటపెట్టిన నాగచైతన్య.. ‘లెనిన్’ సక్సెస్ మీట్లో సంచలన వ్యాఖ్యలు!
-
Indian IPL Player: బిగ్షాక్.. ఆ IPL స్టార్ ఆటగాడిని వెంటనే అరెస్ట్ చేయండి.. హైకోర్టు ఆదేశం..
-
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్ కేసులో కొత్త మలుపు.. మద్యం మత్తే.. ఆత్మహత్యాయత్నం కాదంటున్న పోలీసులు!
-
Attack On Ship: ఉక్రెయిన్ ఒడెసా పోర్టులో కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయులు మృతి..
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!