Jaishankar: యూరప్ అహంకారంపై భారత్ దెబ్బ.. జైశంకర్ సమాధానంతో సైలెంట్..
- రష్యన్ ఆయిల్పై జైశంకర్ సమాధానం..
- యూరప్కు మరోసారి భంగపాటు..
- గెలికి మరీ తన్నించుకున్న యూరప్ జర్నలిస్టులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jaishankar: భారత విదేశాంగ మంత్రి జైశంకర్తో పరువు తీయించుకోవడం యూరప్ జర్నలిస్టులు, యూరప్ నేతలకు అలవాటుగా మారింది. గెలికి మరీ తన్నించుకోవడం అంటే వారికి సరదాగా ఉంటుంది కావచ్చు. భారత్ ఒకప్పటి భారత్ కాదని ఇంకా యూరప్ దేశాలు, నాయకులు గుర్తించలేకపోతున్నారు. టాప్-5లో ఒక ఆర్థిక వ్యవస్థ అని, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ అని గుర్తించలేకపోతున్నారు. తమ పైత్యాన్ని జైశంకర్ ముందు చూపించాలని ప్రయత్నించి మరోసారి భంగపడ్డారు.
రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడాన్ని ప్రశ్నించిన యూరప్ దేశాలకు గట్టి సమాధానం ఇచ్చారు. ఈ ప్రశ్న అడిగే నైతిక హక్కు యూరప్ దేశాలకు లేదని స్పష్టం చేశారు. యూరప్లో తయారైన ఆయుధాలను భారత్పై దాడులకు ఉపయోగించారని, కానీ భారత్ ఆయుధాలు ఎప్పుడూ యూరప్ లోని ఏ దేశానికి ముప్పుగా మారలేదని ఆయన వ్యాఖ్యానించారు. ఫిన్లాండ్లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న జైశంకర్ ‘‘ ఎమర్జింగ్ పవర్స్ అండ్ ది జియోపాలిటికల్ కాంపిటీషన్’’ అనే అంశంపై మాట్లాడారు.
Also Read
- Congress 1000 Days: కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ ఛార్జ్షీట్..!
- Ram Mandir Trust First CEO: రామ మందిర ట్రస్ట్ సీఈవో రేసులో ఆ నలుగురు.. తొలి CEOపై తుది నిర్ణయం రేపే..
- Mahua Moitra: ఎంపీ మహువా మొయిత్రా భద్రతపై కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు.. కారణమిదే!
- Nitin Nabin: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన నితిన్ నబిన్
ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యా ముడి చమురును కొనుగోలు చేయాలన్న భారతదేశ నిర్ణయం, దాని అందుబాటు ధర, లభ్యతపై ఆధారపడి ఉందని అన్నారు. ప్రపంచ మార్కెట్లను స్థిరీకరించడంలో సహాయపడటానికి, 2022లో కొనుగోళ్లను కొనసాగించమని అమెరికానే భారతదేశాన్ని ప్రోత్సహించిందని ఆయన తెలిపారు. రష్యా పట్ల భారత్కు మితిమీరిన సానుభూతితో ఎందుకు ఉందని ఒక విలేకరి ప్రశ్నించడంతో జైశంకర్ ఇలా ఘాటుగా బదులిచ్చారు. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత భారత దేశ సంప్రదాయ సరఫరాదారులైన మిడిల్ ఈస్ట్ నుంచి యూరప్ చమురు కొనుగోలు ప్రారంభించడంతో, భారత్ రష్యా చమురు వైపు మొగ్గు చూపిందని పేర్కొన్నారు. ఈ సమాధానంలో యూరప్ అహంకారంపై మరోసారి జైశంకర్ దెబ్బకొట్టారు.
యూరప్పై విమర్శలు చేస్తూ.. దశాబ్ధాలుగా యూరప్ తయారీ ఆయుధాలను భారత్కు వ్యతిరేకంగా ఉపయోగించారని, భారత్ మాత్రం ఎన్నడూ కూడా యూరప్ భద్రతకు ప్రమాదంగా మారలేదనే విషయాన్ని గుర్తుచేశారు. పాకిస్తాన్ సైన్యంలో ఉన్న జర్మనీ, ఫ్రాన్స్, స్వీడన్ వంటి యూరప్ దేశాల ఆయుధాలను, యుద్ధ విమానాలు, జలంతార్గాముల్ని జైశంకర్ పరోక్షంగా ఎత్తిచూపారు. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి రష్యన్ ఆయిల్ కొనుగోలును జైశంకర్ సమర్ధిస్తున్నారు.
తాజావార్తలు
-
Pawan Kalyan Birthday: అమలాపురం గడ్డ పవన్ అభిమానుల అడ్డా.. పవర్ స్టార్ పుట్టినరోజు మాకు పండుగే!
-
Emmy Awards 2026: ఈ నెలలోనే 78వ ఎమ్మీ అవార్డ్స్ .. ఎక్కువ నామినేషన్లు అందుకున్న షోలు ఇవే!
-
Congress 1000 Days: కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ ఛార్జ్షీట్..!
-
YS Jagan: ‘నాన్నా.. మిమ్మల్ని ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటాను’.. వైఎస్ జగన్ భావోద్వేగ ట్వీట్!
-
Devaraaya: శ్రీకృష్ణదేవరాయలుగా కిచ్చా సుదీప్.. ‘దేవరాయ’ ఫస్ట్ లుక్ అదిరిపోయిందిగా!
ట్రెండింగ్
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!