Air Raid Sirens In Delhi: భారత్- పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తత కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రజలను అప్రమత్తం చేసేందుకు మాక్ డ్రిల్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దేశ రాజధాని ఢిల్లీలో కూడా మరి కాసేపట్లో ఎయిర్ రైడ్స్ సైరన్ల రిహార్సల్స్ చేస్తున్నారు. డైరక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ ఆధ్వర్యంలో సైరన్ రిహార్సల్స్ చేయనున్నారు. వైమానిక దాడుల సందర్భంగా ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఈ సైరన్లు మోగనున్నాయి. సుమారు 15 నుంచి 20 నిముషాల పాటు ఈ సైరన్లు మోగనున్నాయని తెలిపారు. అయితే, ఢిల్లీ వాసులు భయాందోళనలు గురికావొద్దని ఢిల్లీ సర్కార్ కోరింది.
Read Also: Rashmika : ఉగ్రవాదాన్ని నిర్మూలించాల్సిందే.. ఆర్మీకి రష్మిక మద్దతు
అయితే, కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం సంయక్తంగా ఎయిర్ రైడ్స్ సైరన్ల “రిహార్సల్స్” చేపడుతున్నాయి. ఈ సందర్బంగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు పోలీసులు.. దాడుల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండటానికే ఈ రిహార్సల్స్ చేస్తున్నట్లు వెల్లడించారు.