Rashmika : పాకిస్థాన్ మీద ఇండియా సాగిస్తున్న యుద్ధానికి దేశ ప్రజల నుంచి భారీ మద్దతు లభిస్తోంది. ఈ సందర్భంగా చాలా మంది సెలబ్రిటీలు ఆర్మీకి సపోర్టుగా పోస్టులు పెడుతున్నారు. తాజాగా హీరోయిన్ రష్మిక కూడా మద్దతు తెలుపుతూ పోస్టు పెట్టింది. టెర్రరిజానికి వ్యతిరేకంగా పోరాడటం మన హక్కు అంటూ తెలిపింది. చాలా మంది అమాయక పౌరులను చంపితే కచ్చితంగా న్యాయం చేయాల్సిందే అంటూ చెప్తోంది. టెర్రరిస్టల దాడిలో అమాయకులు చనిపోతే.. కచ్చితంగా దానికి బదులు తీర్చుకోవాలని.. అది మన దేశ బాధ్యత అంటూ రాసుకొచ్చింది. శాంతిని కోరుకోవడం అంటే టెర్రరిజాన్ని ఒప్పుకోవడం కాదు. ఇలాంటి సమయంలో మన దేశాన్ని కాదు.. ఆ టెర్రరిజం గ్రూపులను ప్రశ్నించండి అంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది.
Read Also : PM Modi: సరిహద్దు రాష్ట్రాల సీఎంలకు ప్రధాని మోడీ ఫోన్..
ఆమె పెట్టిన పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. చాలా మంది సెలబ్రిటీలు కనీసం స్పందించట్లేదు. కానీ రష్మిక లాంటి వారు డైరెక్ట్ గా టెర్రరిస్టుల దాడులను ఖండిస్తూ ఇండియన్ ఆర్మీకి మద్దతు ప్రకటించడంపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఇక రష్మిక విషయానికి వస్తే వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. త్వరలోనే విజయ్ తో సినిమా చేస్తోంది. అలాగే బాలీవుడ్ లో రెండు సినిమాలను లైన్ లో పెట్టింది. రీసెంట్ గా పుష్ప-2, యానిమల్, చావా సినిమాలతో పాన్ ఇండియా హిట్లు అందుకుంది ఈ భామ.
Read Also : Allu Arjun : అల్లు అర్జున్ -అట్లీ మూవీ లిస్ట్ లోకి.. మరో హీరోయిన్