Vijayendra prasad: ‘రజాకార్ ఫైల్స్’ మూవీ రావడం ఖాయమా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘కశ్మీర్ ఫైల్స్’ మూవీ వచ్చిన దగ్గర నుండి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్… హైదరాబాద్ స్వాతంత్రోద్యమంతో ముడిపడిన రజాకార్ల ఆగడాలు సైతం వెండితెరపైకి ఎక్కాలని భావిస్తున్నారు. ‘కశ్మీర్ ఫైల్స్’ మూవీని నిర్మించిన అభిషేక్ అగర్వాల్ ఇప్పుడు ‘ఢిల్లీ ఫైల్స్’ పేరుతో ఇందిరాగాంధీ మరణానంతరం జరిగిన శిక్కుల ఉచకోత మీద మరో సినిమాను నిర్మిస్తున్నారు. దీనికి వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.

Also Read
- Censor Issues : జననాయగన్కు సెన్సార్ బోర్డ్ లైన్ క్లియర్.. ఇక టాక్సిక్ పరిస్థితి ఏంటి?
- Snakranthi Fight : అనిల్ రావిపూడికి పోటీగా పొంగల్ రేస్ లో 'వీరాధి వీరులు'
- Anirudh Wedding: అనిరుధ్, కావ్య మారన్ పెళ్లి వార్తల్లో నిజమెంత? 'జైలర్ 2' తర్వాత పెళ్లి అంటూ జోరుగా ప్రచారం..
- Allu Arjun : అల్లుఅర్జున్ 'రాకా' 2027లో రావడం కూడా కష్టమేనా.?
ఇదిలా ఉంటే… తాజాగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి కోటాలో ప్రముఖ రచయిత, దర్శకుడు విజయేంద్ర ప్రసాద్ ను పెద్దల సభకు ఎంపిక చేసింది. రాజ్యసభ సభ్యుడిగా ఆయన పేరును కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఆదివారం ఆ పార్టీ తెలంగాణ ఇన్ ఛార్జ్ తరుణ్ చుగ్ తో పాటు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ కలిశారు. విజయేంద్ర ప్రసాద్ కు అభినందనలు తెలిపారు. ఇదే సమయంలో బండి సంజయ్ మనసులో ఉన్న ‘రజాకార్ ఫైల్స్’ మూవీ ముచ్చట కూడా వారి మధ్య వచ్చినట్టు తెలుస్తోంది. ఎందుకంటే… గతంలో రజాకార్ల ఆగడాలు, అకృత్యాల నేపథ్యంలో విజయేంద్ర ప్రసాద్ ‘రాజన్న’ చిత్రం తెరకెక్కించారు. ఇప్పుడు ఆ కథను మరింత శక్తివంతంగా సినిమాగా తీయాల్సిన అవసరం ఉందని బండి సంజయ్ కోరినట్టు తెలుస్తోంది.
మరి ‘రజాకార్ ఫైల్స్’కు విజయేంద్ర ప్రసాద్ కేవలం కథను అందిస్తారా లేకపోతే ఆయనే దర్శకత్వ బాధ్యతలూ వహిస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ విజయేంద్ర ప్రసాద్ ఈ ప్రాజెక్ట్ లో ఇన్ వాల్వ్ అయితే… ఈ మూవీని ‘కశ్మీర్ ఫైల్స్’ తీసిన అభిషేక్ అగర్వాలే నిర్మిస్తారని అంటున్నారు. చారిత్రక నేపథ్యం ఉన్న ఇలాంటి సినిమాను తీయడానికి చాలానే సమయం పడుతుంది. అతి త్వరలోనే దీనిని ప్రారంభించినా, వచ్చే వేసవి కాలం నాటికి కానీ సిద్ధం కాదు. అయితే… ఈ మధ్యలో తెలంగాణలో శాసన సభ ఎన్నికలు వస్తే… ఈ సినిమాను ట్రంప్ కార్డ్ గా బండి సంజయ్ వినియోగించాలనుకుంటున్నారని, అందువల్ల ‘రజాకార్ ఫైల్స్’ను జనవరి లేదా ఫిబ్రవరి నాటికే విడుదలకు సిద్ధం చేస్తే బాగుంటుందని విజయేంద్ర ప్రసాద్ తో చెప్పారని అంటున్నారు. మరి ఈ విషయమై విజయేంద్ర ప్రసాద్ లేదా అభిషేక్ అగర్వాల్ అధికారికంగా ప్రకటిస్తేనే… నిజానిజాలు ఏమిటనేది తేటతెల్లమవుతాయి.
తాజావార్తలు
-
Visakhapatnam Earthquake: విశాఖలో భూప్రకంపనలు.. ప్రాణభయంతో బయటకు పరుగులు తీసిన జనం!
-
Hyderabad: ఫిలింనగర్లో ఫెరారీ స్పోర్ట్స్ కారు బీభత్సం..
-
Shreyas Iyer: “అందుకే జట్టు నుంచి వైభవ్ సూర్యవంశీని తీసేశాం”.. క్లారిటీ ఇచ్చిన కెప్టెన్ శ్రేయస్
-
Astrology: శ్రావణ మాసానికి ముందే శని వక్రగతి.. ఈ 5 రాశుల వారికి సంవత్సరాంతం వరకు ధన యోగం!
-
FIFA World Cup 2026: ఆకాశాన్నంటిన ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ టిక్కెట్ల ధరలు.. 32 ఏళ్లలో 10 రెట్లు పెరిగినయ్
ట్రెండింగ్
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!