Tollywood Producers :దిగివచ్చేందుకు సిద్దమైన ఫెడరేషన్..ఛాంబర్లో నిర్మాతల అత్యవసర సమావేశం?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు సినీ పరిశ్రమలో గత రెండు వారాలుగా కొనసాగుతున్న సినీ కార్మికుల సమ్మె సంచలనంగా మారింది. తమ వేతనాలను 30 శాతం పెంచాలని డిమాండ్ చేస్తూ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ షూటింగ్లను నిలిపివేసి నిరసన తెలుపుతోంది. ఈ వివాదం తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్తో పాటు 72 మంది యాక్టివ్ నిర్మాతలు పాల్గొననున్నారు.
Also Read : Suriya 46: సూర్య సినిమాలో బాలీవుడ్ హీరో.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు
Also Read
- Anand Deverakonda: వైష్ణవి చైతన్యతో రిలేషన్.. అసలు విషయం చెప్పేసిన ఆనంద్ దేవరకొండ!
- Varanasi Movie: 'వారణాసి' అంతకుమించి.. టాలీవుడ్ చరిత్రలో సరికొత్త రికార్డులు!
- స్టార్ హీరో లేడు.. భారీ ప్రమోషన్ లేదు.. రూ.2 కోట్ల బడ్జెట్తో రూ.130 కోట్లు వసూళ్లు.. Hanuman Ansh ఫుల్ స్టోరీ ఇదే!
- Sandeep Reddy Vanga: ‘అప్పుడే అర్థమైంది..’ ఆనంద్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సందీప్ రెడ్డి వంగా
తెలుగు సినీ కార్మికులు 30 శాతం వేతన పెంపు, రోజువారీ వేతన చెల్లింపులు జరగాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 4, 2025 నుంచి షూటింగ్లను బంద్ చేశారు. ఫెడరేషన్ నాయకులు అనిల్ వల్లభనేని, అమ్మిరాజు కానుమిల్లి, టీవీ అలెగ్జాండర్లు నిర్మాతలు 30 శాతం వేతన పెంపునకు లిఖితపూర్వక హామీ ఇస్తేనే షూటింగ్లకు కార్మికులు హాజరవుతారని స్పష్టం చేశారు. ఈ నిర్ణయంతో టాలీవుడ్లో చిత్రీకరణలు పూర్తిగా ఆగిపోయాయి, పలు పెద్ద సినిమాలకు ఆటంకం ఏర్పడింది. నిర్మాతలు ఈ డిమాండ్ను ఆమోదయోగ్యం కాదని, ప్రస్తుతం అందిస్తున్న వేతనాలు కనీస వేతనాల కంటే ఎక్కువగానే ఉన్నాయని వాదిస్తున్నారు.
Also Read : V.N Adithya: ఎవడికిరా నష్టం.. అడుక్కు తినాల్సి వస్తుంది జాగ్రత్త.. సినీ సమ్మెపై దర్శకుడు సంచలనం
నిర్మాతల ప్రతిపాదనల్లో ముఖ్యమైన ఫ్లెక్సిబుల్ కాల్ షీట్ విషయంలో ఫెడరేషన్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. 9 గంటల నుంచి 9 గంటల వరకు చేస్తే తమకు అభ్యంతరం లేదంటున్న ఫెడరేషన్, నిర్మాతలు ప్రతిపాదించిన వేతన పెంపు కొద్దిగా మార్చి 20 శాతం ఇప్పుడు ఇచ్చి ప్రతి సంవత్సరం పది పది శాతం చొప్పున పెంచాల్సిందిగా కోరినట్టు సమాచారం. ప్రస్తుతం చిరంజీవి ఇంట్లో ఫెడరేషన్ నాయకులు ఉండగా దాదాపు 50 మంది సభ్యులు కూడా సమావేశం అయినట్టు తెలుస్తోంది. ఇక ఫెడరేషన్ సానుకూలంగా స్పందించిన క్రమంలో వీటిపై ఛాంబర్ లో అత్యవసర చర్చలు జరిపేందుకు సిద్ధమయ్యారు నిర్మాతలు.
ఫిలిం ఛాంబర్లో నిర్మాతల మండలి అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్ నేతృత్వంలో 72 మంది యాక్టివ్ నిర్మాతలు పాల్గొననున్నారు. ఈ సమావేశానికి అల్లు అరవింద్, దిల్ రాజు, సురేష్ బాబు, మైత్రీ రవి, నాగ వంశీ, శివలెంక కృష్ణ ప్రసాద్, రాధామోహన్, ఠాగూర్ మధు, బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్, డి.వి.వి. దానయ్య వంటి ప్రముఖ నిర్మాతలు హాజరవుతున్నారు.
తాజావార్తలు
-
Free Electricity: గుడ్న్యూస్.. ఉచిత విద్యుత్ ప్రకటించిన మంత్రి నారా లోకేష్!
-
Duleep Trophy Final: దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్ జోన్ భారీ ఆధిక్యం.. 336 పరుగులకే సౌత్ జోన్ ఆలౌట్!
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఐటీ రంగాన్ని ఊపేస్తున్న GPT-6 Astra.. బీటెక్ ఫ్రెషర్లకు ఏఐ బిగ్ అలర్ట్..
-
Anand Deverakonda: వైష్ణవి చైతన్యతో రిలేషన్.. అసలు విషయం చెప్పేసిన ఆనంద్ దేవరకొండ!
ట్రెండింగ్
-
ఒక్క ఛార్జ్తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!
-
2.5K డిస్ప్లే, 8200mAh బ్యాటరీతో Infinix Xpad 30 Pro టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
నేడే Apple Surprise and Shine Event.. ఫోల్డబుల్ iPhoneతో పాటు iPhone 18 Pro, కొత్త Apple Watchలు.. ఇంకా ఏం రాబోతున్నాయంటే?
-
IPL Team Owners: ఆస్ట్రేలియా క్రికెట్లో కీలక పరిణామం.. ఐపీఎల్ టీమ్ ఓనర్లకు పండగే ఇగ!