Tollywood Producers :దిగివచ్చేందుకు సిద్దమైన ఫెడరేషన్..ఛాంబర్లో నిర్మాతల అత్యవసర సమావేశం?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు సినీ పరిశ్రమలో గత రెండు వారాలుగా కొనసాగుతున్న సినీ కార్మికుల సమ్మె సంచలనంగా మారింది. తమ వేతనాలను 30 శాతం పెంచాలని డిమాండ్ చేస్తూ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ షూటింగ్లను నిలిపివేసి నిరసన తెలుపుతోంది. ఈ వివాదం తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్తో పాటు 72 మంది యాక్టివ్ నిర్మాతలు పాల్గొననున్నారు.
Also Read : Suriya 46: సూర్య సినిమాలో బాలీవుడ్ హీరో.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు
Also Read
- Johnny Master - Sekhar Master: టాలీవుడ్లో కలకలం.. జానీ మాస్టర్ - శేఖర్ మాస్టర్ వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం! వీడియో వైరల్
- Bhagyashri Borse: భాగ్యశ్రీ బోర్సే డ్రీమ్ రోల్ ఇదేనట.. రాజమౌళి పేరు చెప్పి షాకిచ్చిన హీరోయిన్!
- Tollywood Directors: కథలు రెడీ.. హీరోలే మిస్సింగ్! టాలీవుడ్ హిట్ డైరెక్టర్లకు కొత్త టెన్షన్..
- Maa Inti Bangaram: 100 కోట్ల క్లబ్లో 'మా ఇంటి బంగారం'.. తెలుగు సినీ చరిత్రలో సమంత రేర్ ఫీట్..
తెలుగు సినీ కార్మికులు 30 శాతం వేతన పెంపు, రోజువారీ వేతన చెల్లింపులు జరగాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 4, 2025 నుంచి షూటింగ్లను బంద్ చేశారు. ఫెడరేషన్ నాయకులు అనిల్ వల్లభనేని, అమ్మిరాజు కానుమిల్లి, టీవీ అలెగ్జాండర్లు నిర్మాతలు 30 శాతం వేతన పెంపునకు లిఖితపూర్వక హామీ ఇస్తేనే షూటింగ్లకు కార్మికులు హాజరవుతారని స్పష్టం చేశారు. ఈ నిర్ణయంతో టాలీవుడ్లో చిత్రీకరణలు పూర్తిగా ఆగిపోయాయి, పలు పెద్ద సినిమాలకు ఆటంకం ఏర్పడింది. నిర్మాతలు ఈ డిమాండ్ను ఆమోదయోగ్యం కాదని, ప్రస్తుతం అందిస్తున్న వేతనాలు కనీస వేతనాల కంటే ఎక్కువగానే ఉన్నాయని వాదిస్తున్నారు.
Also Read : V.N Adithya: ఎవడికిరా నష్టం.. అడుక్కు తినాల్సి వస్తుంది జాగ్రత్త.. సినీ సమ్మెపై దర్శకుడు సంచలనం
నిర్మాతల ప్రతిపాదనల్లో ముఖ్యమైన ఫ్లెక్సిబుల్ కాల్ షీట్ విషయంలో ఫెడరేషన్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. 9 గంటల నుంచి 9 గంటల వరకు చేస్తే తమకు అభ్యంతరం లేదంటున్న ఫెడరేషన్, నిర్మాతలు ప్రతిపాదించిన వేతన పెంపు కొద్దిగా మార్చి 20 శాతం ఇప్పుడు ఇచ్చి ప్రతి సంవత్సరం పది పది శాతం చొప్పున పెంచాల్సిందిగా కోరినట్టు సమాచారం. ప్రస్తుతం చిరంజీవి ఇంట్లో ఫెడరేషన్ నాయకులు ఉండగా దాదాపు 50 మంది సభ్యులు కూడా సమావేశం అయినట్టు తెలుస్తోంది. ఇక ఫెడరేషన్ సానుకూలంగా స్పందించిన క్రమంలో వీటిపై ఛాంబర్ లో అత్యవసర చర్చలు జరిపేందుకు సిద్ధమయ్యారు నిర్మాతలు.
ఫిలిం ఛాంబర్లో నిర్మాతల మండలి అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్ నేతృత్వంలో 72 మంది యాక్టివ్ నిర్మాతలు పాల్గొననున్నారు. ఈ సమావేశానికి అల్లు అరవింద్, దిల్ రాజు, సురేష్ బాబు, మైత్రీ రవి, నాగ వంశీ, శివలెంక కృష్ణ ప్రసాద్, రాధామోహన్, ఠాగూర్ మధు, బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్, డి.వి.వి. దానయ్య వంటి ప్రముఖ నిర్మాతలు హాజరవుతున్నారు.
తాజావార్తలు
-
Johnny Master – Sekhar Master: టాలీవుడ్లో కలకలం.. జానీ మాస్టర్ – శేఖర్ మాస్టర్ వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం! వీడియో వైరల్
-
Khamenei Funeral: ఖమేనీ అంత్యక్రియల్లో “మాస్క్ మ్యాన్”.. ఎవరనేది తెలిసింది
-
Jagadish Reddy: సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి కౌంటర్
-
Jagga Reddy : బీఆర్ఎస్ నేతలకు జగ్గారెడ్డి సవాల్.. కేసీఆర్, హరీష్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి.!
-
Bhagyashri Borse: భాగ్యశ్రీ బోర్సే డ్రీమ్ రోల్ ఇదేనట.. రాజమౌళి పేరు చెప్పి షాకిచ్చిన హీరోయిన్!
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..