తెలుగు సినీ పరిశ్రమలో గత రెండు వారాలుగా కొనసాగుతున్న సినీ కార్మికుల సమ్మె సంచలనంగా మారింది. తమ వేతనాలను 30 శాతం పెంచాలని డిమాండ్ చేస్తూ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ షూటింగ్లను నిలిపివేసి నిరసన తెలుపుతోంది. ఈ వివాదం తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్తో పాటు 72 మంది యాక్టివ్ నిర్మాతలు పాల్గొననున్నారు.…
TG Vishwa Prasad: ప్రస్తుతం సినీ నిర్మాతలు ఫిలిం ఫెడరేషన్ మధ్య వేతనాల పెంపు గురించి చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే సినీ నిర్మాతల్లో ఒకరైన విశ్వప్రసాద్ మన తెలుగు సినీ కార్మికులలో టాలెంట్ లేదు అని అర్థం వచ్చేలా మాట్లాడడంతో ఫిలిం ఫెడరేషన్ దానిపై అభ్యంతరం వ్యక్తం చేసింది నిర్మాతలలో పలువురు కూడా దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన నేపద్యంలో టీజీ విశ్వప్రసాద్ అధికారికంగా స్పందించారు.