Pawankalyan : పిఠాపురంలో ‘కమిటీ కుర్రోళ్ళు’ హంగామా.. దుమ్ములేపిన నిహారిక
- నిహారిక నిర్మాతగా రూపొందిన 'కమిటీ కుర్రోళ్ళు'
- 11 మంది నూతన నటీనటులతో తెరకెక్కిన కమిటీ కుర్రోళ్ళు
- ఆగస్టు 9న వరల్డ్ వైడ్ థియేట్రికల్ రిలీజ్
పిఠాపురంను దేశం యావత్తు తిరిగి చూసేలా చేసిన వ్యక్తి జనసేనాని అధినేత, ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. దీంతో సినీ రంగానికి చెందినవారు కూడా పిఠాపురం వైపు దృష్టి సారిస్తున్నారు. అందులో భాగంగా సినిమా ఈవెంట్స్ను అక్కడ నిర్వహిస్తున్నారు. తాజాగా పిఠాపురం నియోజకవర్గానికి నిహారిక కొణిదెల వెళ్లి హంగామా చేశారు. బాబాయ్ పవన్ ప్రాతినిధ్యం వహిస్తోన్న నియోజకవర్గానికి మెగా డాటర్ వెళ్లటం హాట్ టాపిక్గా మారింది.
Also Read: Ram Pothineni: డబుల్ ఇస్మార్ట్ ట్రైలర్ టాక్..పూరి హిట్ కొడతాడా లేదా..?
Also Read
- Bellamkonda Sreenivas: ఒక ఇంటివాడు కాబోతున్న బెల్లంకొండ శ్రీనివాస్.. మెగాస్టార్కు తొలి ఆహ్వానం!
- Rajnikanth173 : సస్పెన్స్ వీడింది.. రజనీకాంత్ను డైరెక్ట్ చేయబోయే దర్శకుడు ఎవరంటే ?
- Star Directors : బ్రేక్ తీసుకుంటోన్న స్టార్ డైరెక్టర్స్.. కారణాలు ఏంటో?
- Michael Jackson Biopic: ఇండియాలో ‘మైఖేల్’ మేనియా.. లక్ష దాటిన టికెట్ల అమ్మకాలు
నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్పై రూపొందిన ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమాకు యదు వంశీ దర్శకుడు. అంతా కొత్త వారితో చేస్తున్న ఈ చిత్రం ఇప్పటికీ అందరిలోనూ అంచనాలు పెంచేసింది. ఇది వరకు రిలీజ్ చేసిన టీజర్, సాంగ్స్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆగస్ట్ 9న సినిమా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్లో వేగం పెంచారు. అందులో భాగంగా పిఠాపురంలో ‘కమిటీ కుర్రోళ్ళు’ టీమ్ ఆంధ్రప్రదేశ్లో విజయవాడ నుంచి వైజాగ్ ప్రాంతాలకు వెళ్లి అక్కడ సందడి చేసింది. అందులో భాగంగా పిఠాపురంకు చిత్ర యూనిట్ వెళ్లింది. అక్కడ కుక్కుటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించింది. అక్కడి ప్రజలతో కాసేపు ముచ్చటించింది.
Also Read: Mahesh Babu: రీరిలీజ్ లో కూడా రికార్డు క్రియేట్ చేస్తున్న మహేశ్ సినిమా.. కలెక్షన్స్ ఎంతంటే..?
ఫ్రెండ్ షిప్, లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్గా మంచి డైలాగ్స్తో ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమా రూపొందింది. మూవీ టీజర్, ట్రైలర్, సాంగ్స్ చూస్తుంటే మన సమాజంలో జరిగే నిజ ఘటనల ఆధారంగా, మనం మన స్నేహితులతో ఎలా ఉంటామో అలాంటి సన్నివేశాలను పొందుపరుస్తూ సినిమాను రూపొందించారని స్పష్టమవుతుంది. స్నేహం గొప్పదనాన్ని తెలియజెప్పేలా ఉండే ఈ సినిమాను చూడాలనే ఆసక్తి అందరిలోనూ ఏర్పడింది. దీంతో ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. సోమవారం హైదరాబాద్లో కమిటీ కుర్రోళ్ళు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరగనుంది. ఆగస్ట్ 9న రిలీజ్ కాబోతున్న కమిటీ కుర్రోళ్ళు చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో వంశీ నందిపాటి విడుదల చేస్తున్నారు.
Mana #CommitteeKurrollu kudaa PITAPURAM thaaluke andi babu!! 💥💥
9th August Theatres ki vasthunnaru! Kaludhaam 🥁#CKonAUG9 🍿@IamNiharikaK @SRDSTUDIOS_ @yadhuvamsi92 @eduroluraju @anudeepdev @anwaraliedit @manyam73 @urs_jdmaster @connect2vamsi @tseriessouth @Ticket_Factory pic.twitter.com/PLzZZjARvZ
— Pink Elephant Pictures (@PinkElephant_P) August 4, 2024
తాజావార్తలు
-
Bellamkonda Sreenivas: ఒక ఇంటివాడు కాబోతున్న బెల్లంకొండ శ్రీనివాస్.. మెగాస్టార్కు తొలి ఆహ్వానం!
-
Rajnikanth173 : సస్పెన్స్ వీడింది.. రజనీకాంత్ను డైరెక్ట్ చేయబోయే దర్శకుడు ఎవరంటే ?
-
Ravindra Jadeja: ఆమె చెప్పిందే నిజమైంది.. ఈ అవార్డు నా ప్రియమైన మంత్రికి అంకితం!
-
Chidambaram: పోలింగ్ ప్రారంభంలోనే ఓటేసిన పి.చిదంబరం
-
Star Directors : బ్రేక్ తీసుకుంటోన్న స్టార్ డైరెక్టర్స్.. కారణాలు ఏంటో?
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?