Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao: ప్రాజెక్టులకు అన్ని రకాల అనుమతులు లభించిన తర్వాత వాటిని సమీక్షించి రద్దు చేసిన చరిత్ర దేశంలో ఎక్కడా లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత తన్నీరు హరీశ్ రావు వ్యాఖ్యానించారు. కేసీఆర్ హయాంలో సాధించిన తెలంగాణ ప్రాజెక్టుల అనుమతులను రద్దు చేసే దిశగా గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు (GRMB) అజెండా రూపొందుతుంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దానికి పరోక్షంగా సహకరిస్తున్నారని ఆరోపించారు. ఒక ఉద్యమకారుడిగా ఈ పరిణామాలను చూస్తుంటే తనకు కడుపు రగులుతోందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 2022 ఆగస్టు 25న ఎంతో కష్టపడి సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు అనుమతులు సాధించిందని హరీశ్ రావు గుర్తుచేశారు. అయితే ఇప్పుడు ఆ సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు ఉరి వేసేందుకు పెద్ద ఎత్తున కుట్ర జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కర్ణాటకలో ముగ్గురు ముఖ్యమంత్రుల భేటీ సందర్భంగా 47 టీఎంసీల సమ్మక్క సాగర్ ప్రాజెక్టును వదులుకోవాలని ఆంధ్రప్రదేశ్ కోరగా, తెలంగాణ ప్రభుత్వం దానికి అంగీకరించిందన్నారు. సమ్మక్క సాగర్ ప్రాజెక్టు నీళ్లు వాస్తవానికి ప్రస్తుత ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత నియోజకవర్గమైన హుజూర్ నగర్కు వెళ్తాయని, అయినా కూడా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. తాము ఈ అంశాన్ని లేవనెత్తిన రెండు రోజులకే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్రానికి లేఖ రాయడం వారి దివాలాకోరుతనానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు.
తెలంగాణ ప్రాజెక్టులకు సంబంధించిన ఏడు అనుమతులను రివ్యూ చేస్తామని కేంద్రం చెబుతున్నప్పటికీ బీజేపీ నేతలు ఏమాత్రం స్పందించకపోవడాన్ని హరీశ్రావు తప్పుబట్టారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి భయపడి కేంద్ర మంత్రులు పెదవులు మూసుకుంటున్నారని, దీనిపై బీజేపీ వెంటనే స్పందించకపోతే తెలంగాణ ప్రయోజనాల కోసం మరో ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. తెలంగాణలో ప్రస్తుతం చంద్రబాబు బంటు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టే జీఆర్ఎంబీ అజెండాలో ఇలాంటి ప్రతిపాదనలు వస్తున్నాయని, ఒకవేళ కేసీఆర్ సీఎంగా ఉంటే ఆంధ్రప్రదేశ్ లేదా కేంద్రానికి ఇంత ధైర్యం వచ్చేదా అని ప్రశ్నించారు. ఏపీ మూలాలు ఉన్న అధికారులు తెలంగాణ ఇరిగేషన్ శాఖలో బాధ్యతలు వహిస్తుండటం వల్లే ఇలా జరుగుతోందని ఆరోపించారు. జీఆర్ఎంబీ సమావేశ అజెండా నుంచి గోదావరి, బనకచర్ల అంశాలను తొలగించాలని, ఈ అజెండాను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై పార్లమెంట్లో ఉన్న కాంగ్రెస్ ఎంపీలు గళం విప్పాలని కోరారు. ఇరిగేషన్ విషయంలో ప్రభుత్వం రిట్, సూట్ పిటిషన్ల పేరుతో ఏడాది కాలంగా సమయం వృథా చేసిందని విమర్శించారు. రేవంత్ రెడ్డి లోపాయికారీ ఒప్పందాలతో గోదావరి, బనకచర్ల ప్రాజెక్టులకు ఒప్పుకున్నారని ఆరోపించారు. గోదావరి జలాల్లో తెలంగాణకు చట్టబద్ధంగా 960 టీఎంసీల నీటి కేటాయింపులు ఉన్నప్పటికీ, రాష్ట్ర హక్కులు కాలరాస్తుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చూస్తూ బొమ్మలాగా కూర్చున్నారని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!