నాలుగు దశాబ్దాల క్రితం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదల వాయిదా పడుతూ వచ్చి ఇటీవల విడుదలైన సినిమా ‘ప్రతిబింబాలు’. అక్కినేని నాగేశ్వరరావు హీరోగా జయసుధ, తులసి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు కెయస్. ప్రకాశరావు, సింగీతం శ్రీనివాసరావు దర్శకులు. ఈ సినిమాను జాగర్లమూడి రాధాకృష్ణ నిర్మించగా రాచర్ల రాజేశ్వర్ విడుదల చేశారు. ఈ సినిమా శతదినోత్సవ వేడుకలను బుధవారం చిత్తూరు జిల్లా అరగొండ కృష్ణటాకీస్ లో నిర్వహించారు. ఈ శతదినోత్సవానికి కారకులైన ఇ. శంకర్ రెడ్డికి, విడుదలకు సహకరించిన రాజేశ్వర్, కడప మణిబాబు, చెన్నై ఇబ్రహీం ఖాన్ కు, థియేటర్ యాజమాన్యానికి అక్కినేని వంశాభిమానులకు నిర్మాత రాధాకృష్ణమూర్తి కృతజ్ఞతలు తెలిపారు.