High blood pressure: అధిక రక్తపోటును నిర్లక్ష్యం చేస్తున్నారా.? చాలా ప్రమాదం..
- మనదేశంలో ముప్పై శాతం జనాభాకు అధిక రక్తపోటు
- తమకు సమస్య ఉందని గుర్తించని సగం మంది ప్రజలు
- అధికరక్తపోటుతో చాలా ప్రమాదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మనదేశంలో ముప్పై శాతం జనాభా అధిక రక్తపోటుతో బాధ పడుతున్నారు. అధిక రక్తపోటు ఉన్నవారిలో దాదాపు సగం మంది ప్రజలకు తమకు అధిక రక్తపోటు ఉన్నట్టు తెలియదు. తెలిసిన వారిలో దాదాపు సగం మంది ప్రజలకు చికిత్స సరిపడా తీసుకోక పోవడం వల్ల అది అదుపులోకి రావడం లేదు. మారుతున్న ఆహారపు అలవాట్లతో దేశంలోని యువత ఫాస్ట్ ఫుడ్ కు అలవాటు పడిపోతున్నారు. టేస్టీగా ఉండే జంక్ ఫుడ్ తెలియకుండానే సైలెంట్ కిల్లర్ లా తన పనిని తాను చేసుకుంటూ పోతుంది. అధిక రక్తపోటు అనేది గుండె, నరాలు, మూత్రపిండాలు, ఇతర ముఖ్యమైన అవయవాలను కాలక్రమేణా దెబ్బతీసే పరిస్థితి. వైద్యులు దీనిని తరచుగా ‘సైలెంట్ కిల్లర్’ అని పిలుస్తారు, ఎందుకంటే శరీరానికి గణనీయమైన నష్టం జరిగే వరకు నిర్దిష్ట లక్షణాలు కనిపించవు. నేటి ఒత్తిడితో కూడిన జీవనశైలి అధిక రక్తపోటుకు ప్రధాన కారణమని వైద్యలు చెబుతున్నారు.
READ MORE: Leopard: చిరుత మళ్లీ వచ్చింది.. పచ్చర్లలో మహిళ, తిరుమలలో చిన్నారిని చంపింది ఒక్కటే
Also Read
- Arthritis Pain in Monsoon: వర్షాకాలంలో కీళ్ల నొప్పితో ఇబ్బందా..? నిపుణులు సూచించిన 5 చిట్కాలు మీ కోసం..
- Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ "పన్నీర్ టిక్కా"ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!
- Kitchen Tips: వెల్లుల్లి తొక్క తీయడానికి ఇబ్బంది పడుతున్నారా? ఈ ఈజీ టిఫ్తో సెకన్లలో పని పూర్తి!
- WHO Cancer Report 2026: ఏడాదికి కోటి మంది మృతి..! క్యాన్సర్పై WHO షాకింగ్ నివేదిక..
అధిక రక్తపోటు జాబితాలో యువకులు కూడా ఉన్నట్లు ఓ నివేదికలో తేలింది. అధిక రక్తపోటును ముందుగానే గుర్తించడం చాలా ముఖ్యం. లక్షణాలు లేకపోయినా, సాధారణ ఆరోగ్య పరీక్షల ద్వారా అధిక రక్తపోటు స్థాయిలను ముందుగానే గుర్తించవచ్చు. ముఖ్యంగా యువకులు తమ రక్తపోటును పర్యవేక్షించడంలో జాగ్రత్తగా ఉండాలి. హై బీపీని ముందుగానే గుర్తించి సరైన చికిత్స తీసుకుంటే కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. ఫలితంగా గుండె జబ్బులు, స్ట్రోక్, కిడ్నీ ఫెయిల్యూర్ వంటి సమస్యల బారిన పడకుండా ఉండొచ్చు. అధిక రక్తపోటును నిర్లక్ష్యం చేస్తే, అది తీవ్రమైన పరిణామాలను కలిగిస్తుంది. సుదీర్ఘమైన అధిక రక్తపోటు సిరలు గట్టిగా, మందంగా మారడానికి కారణమవుతుంది. ఇది అథెరోస్క్లెరోసిస్ అనే పరిస్థితికి దారితీస్తుంది. ఇది గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. అంతేకాకుండా మూత్రపిండాలను కూడా దెబ్బతీస్తుంది. అంతేకాకుండా కళ్లకు సమస్యలను తీసుకువస్తుంది. శాశ్వతంగా గుడ్డి వాళ్లుగా మారే అవకాశం కూడా ఉంది.
తాజావార్తలు
-
Hantavirus: ప్రపంచాన్ని కలవరపెడుతున్న కొత్త వైరస్.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి!
-
China Thanks India: చైనా నావికుల ప్రాణాలను కాపాడిన ఉపకారాన్ని ఎప్పటికీ మరచిపోలేం.. భారత సైన్యానికి చైనా కృతజ్ఞతలు
-
National Flag Day: నేడు జాతీయ జెండా దినోత్సవం.. తిరంగా గురించి ఈ విషయాలు ఎంత మందికి తెలుసు?
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్ను ఏమనొద్దు.. బీసీసీఐకి జింబాబ్వే కెప్టెన్ రిక్వెస్ట్!
-
LIC Smart Pension Plan: ఒక్కసారి పెట్టుబడి.. జీవితాంతం పింఛన్.. స్మార్ట్ పెన్షన్ ప్లాన్ పూర్తి వివరాలు
ట్రెండింగ్
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
OLED డిస్ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్టాప్లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!
-
Best Camera Phones: DSLRకు పోటీగా ఫొటోగ్రఫీ అనుభవం..! బెస్ట్ కెమెరా ఫోన్ల లిస్ట్ ఇదిగో..!
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!