High blood pressure: అధిక రక్తపోటును నిర్లక్ష్యం చేస్తున్నారా.? చాలా ప్రమాదం..
- మనదేశంలో ముప్పై శాతం జనాభాకు అధిక రక్తపోటు
- తమకు సమస్య ఉందని గుర్తించని సగం మంది ప్రజలు
- అధికరక్తపోటుతో చాలా ప్రమాదం
మనదేశంలో ముప్పై శాతం జనాభా అధిక రక్తపోటుతో బాధ పడుతున్నారు. అధిక రక్తపోటు ఉన్నవారిలో దాదాపు సగం మంది ప్రజలకు తమకు అధిక రక్తపోటు ఉన్నట్టు తెలియదు. తెలిసిన వారిలో దాదాపు సగం మంది ప్రజలకు చికిత్స సరిపడా తీసుకోక పోవడం వల్ల అది అదుపులోకి రావడం లేదు. మారుతున్న ఆహారపు అలవాట్లతో దేశంలోని యువత ఫాస్ట్ ఫుడ్ కు అలవాటు పడిపోతున్నారు. టేస్టీగా ఉండే జంక్ ఫుడ్ తెలియకుండానే సైలెంట్ కిల్లర్ లా తన పనిని తాను చేసుకుంటూ పోతుంది. అధిక రక్తపోటు అనేది గుండె, నరాలు, మూత్రపిండాలు, ఇతర ముఖ్యమైన అవయవాలను కాలక్రమేణా దెబ్బతీసే పరిస్థితి. వైద్యులు దీనిని తరచుగా ‘సైలెంట్ కిల్లర్’ అని పిలుస్తారు, ఎందుకంటే శరీరానికి గణనీయమైన నష్టం జరిగే వరకు నిర్దిష్ట లక్షణాలు కనిపించవు. నేటి ఒత్తిడితో కూడిన జీవనశైలి అధిక రక్తపోటుకు ప్రధాన కారణమని వైద్యలు చెబుతున్నారు.
READ MORE: Leopard: చిరుత మళ్లీ వచ్చింది.. పచ్చర్లలో మహిళ, తిరుమలలో చిన్నారిని చంపింది ఒక్కటే
Also Read
- Food poisoning: బిర్యానీ, వాటర్మిలన్ కలిపి తింటే ప్రమాదమా..? శరీరంలో ఏం జరుగుతుంది?
- Sugarcane Juice Side Effects: వేసవిలో చెరకు రసం తాగుతున్నారా? అయితే జాగ్రత్త..!
- Kidney Stones Rising in Summer: వేసవిలో కిడ్నీల్లో పెరిగిపోతున్న రాళ్లు.. ఇలా చెక్ పెట్టండి..!
- Ragi Puri: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. రాగి పిండితో మెత్తటి పూరీలు.. ఇలా చేస్తే లొట్టలేయాల్సిందే!
అధిక రక్తపోటు జాబితాలో యువకులు కూడా ఉన్నట్లు ఓ నివేదికలో తేలింది. అధిక రక్తపోటును ముందుగానే గుర్తించడం చాలా ముఖ్యం. లక్షణాలు లేకపోయినా, సాధారణ ఆరోగ్య పరీక్షల ద్వారా అధిక రక్తపోటు స్థాయిలను ముందుగానే గుర్తించవచ్చు. ముఖ్యంగా యువకులు తమ రక్తపోటును పర్యవేక్షించడంలో జాగ్రత్తగా ఉండాలి. హై బీపీని ముందుగానే గుర్తించి సరైన చికిత్స తీసుకుంటే కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. ఫలితంగా గుండె జబ్బులు, స్ట్రోక్, కిడ్నీ ఫెయిల్యూర్ వంటి సమస్యల బారిన పడకుండా ఉండొచ్చు. అధిక రక్తపోటును నిర్లక్ష్యం చేస్తే, అది తీవ్రమైన పరిణామాలను కలిగిస్తుంది. సుదీర్ఘమైన అధిక రక్తపోటు సిరలు గట్టిగా, మందంగా మారడానికి కారణమవుతుంది. ఇది అథెరోస్క్లెరోసిస్ అనే పరిస్థితికి దారితీస్తుంది. ఇది గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. అంతేకాకుండా మూత్రపిండాలను కూడా దెబ్బతీస్తుంది. అంతేకాకుండా కళ్లకు సమస్యలను తీసుకువస్తుంది. శాశ్వతంగా గుడ్డి వాళ్లుగా మారే అవకాశం కూడా ఉంది.
తాజావార్తలు
-
Dacoit: ఓటీటీలోకి అడివి శేష్ ‘డెకాయిట్’.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
-
Ali Pervaiz Malik: పాక్ మంత్రి షాకింగ్ వ్యాఖ్యలు.. మా దగ్గర ఒక్క రోజుకు కూడా పెట్రోల్ లేదు.. భారత్తో మనం పోల్చుకోలేము
-
Aadarsha-kutumbam: వెంకీ మామ ‘ఆదర్శ కుటుంబం’లో వీరమల్లు బ్యూటీ..
-
Woman Assaulted in Train: కదిలే ట్రైన్లో దారుణం.. విశాఖ ఎక్స్ప్రెస్లో వివాహితపై అత్యాచారం..
-
Riyan Parag: వరుస వివాదాల్లో రాజస్థాన్ రాయల్స్.. డ్రెస్సింగ్ రూమ్లో రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డ కెప్టెన్..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో