Zelensky: భారత్పై ఆంక్షలు విధించడంలో తప్పులేదు.. ఉక్రెయిన్ అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు
- భారత్పై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సంచలన వ్యాఖ్యలు..
- భారత్పై ఆంక్షలు విధించడం సరైన నిర్ణయమేనని కామెంట్స్..
- రష్యాతో వ్యాపారం చేసే అందరిపై టారీఫ్స్ విధించాలి: జెలెన్స్కీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Zelensky: భారత్పై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాస్కో-కీవ్ మధ్య సంధి కుదిర్చేందుకు భారత్ దౌత్య ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అతడి నుంచి ఇలాంటి కామెంట్స్ రావడం గమనార్హం. రష్యాతో వ్యాపార లావాదేవీలు చేస్తున్న దేశాలపై టారిఫ్లు విధించడం సరైన చర్యే అని వెల్లడించారు. అయితే, ఇటీవల షాంఘై సహకార సంస్థ సదస్సులో భారత ప్రధాని మోడీ తియాంజెన్లో చైనా అధినేత జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్తో కలిసి వేదిక పంచుకోవడంపై జెలెన్స్కీ స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also: Kollywood : ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్.. కన్ఫమ్ చేసిన స్టార్ హీరో
Also Read
- Germany: జర్మనీలో దుండగుడు కాల్పులు.. ఐదుగురు మృతి
- Trump-Iran: ఇరాన్ చర్చలు కోరింది.. రేపు దోహాలో కీలక భేటీ అంటూ ట్రంప్ ప్రకటన
- France Heatwave: ఫ్రాన్స్ను హడలెత్తిస్తోన్న ఎండలు.. వెయ్యికి చేరిన మృతులు
- China: జిన్పింగ్కు సొంత సైన్యంపైనే నమ్మకం లేదా? చైనా పార్లమెంట్ నుంచి ఆరుగురు టాప్ మిలిటరీ కమాండర్ల అవుట్!
అయితే, అలాస్కాలో డొనాల్డ్ ట్రంప్- పుతిన్ మధ్య జరిగిన చర్చలు విఫలం కావడంతో.. రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించడానికి అగ్రరాజ్యం అమెరికా రెడీ అవుతుంది. ఈ నేపథ్యంలో జెలెన్స్కీ ఇలాంటి ప్రకటన చేయడం గమనార్హం. నేషనల్ ఎకనామిక్ కౌన్సిల్ డైరెక్టర్ కెవిన్ హస్సెట్ట్ మాస్కోపై మరిన్ని ఆంక్షలు విధిస్తారని తెలిపారు. ఉక్రెయిన్పై రష్యా చేస్తున్న యుద్ధానికి సహకరించే వారిపై కూడా ఈ ఆంక్షలు అమలు చేస్తామన్నారు.
కాగా, ఇటీవల కాలంలో ఉక్రెయిన్తో యుద్ధాన్ని ముగించాలని భారత్ కూడా అనేక ప్రయత్నాలు చేస్తోంది. ప్రధాని మోడీ అటు పుతిన్, ఇటు జెలెన్స్కీతో సుధీర్ఘంగా చర్చలు జరుపుతున్నారు. గత నెల రెండో వారంలో పుతిన్తో సమావేశానికి ముందు కీవ్ అధినేతతోనూ మాట్లాడారు. ఉక్రెయిన్కు సంబంధించిన కీలక అంశాలపై చర్చించినట్లు సమాచారం. అయితే, ఈ వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించడంపై భారత్ చూస్తుంటే.. ఇప్పుడు ఇండియాపైనే జెలెన్స్కీ విమర్శలు చేయడం గమనార్హం.
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!