సౌదీ అరేబియా యువరాజు, ప్రధానమంత్రి అయిన హెచ్ఆర్హెచ్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్కు ప్రధాని మోడీ ఫోన్ చేశారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంఘర్షణపై ఇరువురి మధ్య సంభాషణ జరిగింది.
Jaishankar: మిడిల్ ఈస్ట్ సంక్షోభం నేపథ్యంలో ఈరోజు(బుధవారం) ఢిల్లీలో ఆల్ పార్టీ సమావేశం జరిగింది. ఇరాన్ యుద్ధం సమయంలో భారత్ అనుసరిస్తున్న విదేశాంగ విధానం, చమురు సంక్షోభం రాకుండా తీసుకుంటున్న చర్యలపై కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్షాలకు తెలియజేసింది.
Modi-Trump: అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ యుద్ధం ప్రారంభమై నాలుగో వారానికి చేరింది. ఇప్పటికీ ఇరాన్పై యూఎస్, ఇజ్రాయిల్ దాడులు చేస్తూనే ఉన్నాయి. ఇరాన్ ప్రతీకార దాడుల్ని ఆపడం లేదు, ఇజ్రాయిల్, గల్ఫ్ దేశాలపై అటాక్స్ చేస్తోంది. అయితే, యుద్ధం ప్రారంభమై ఇన్ని రోజులు గడిచిన తర్వాత, మంగళవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ , భారత ప్రధాని నరేంద్రమోడీకి ఫోన్ చేశారు. ‘‘హార్ముజ్ జలసంధి’’, ఇరాన్ యుద్ధంపై ఇరువురు నేతలు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే,…
BV Raghavulu: భారత ప్రధాని నరేంద్ర మోడీపై సెటైర్లు వేశారు సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు.. కేంద్ర ప్రభుత్వ విదేశాంగ విధానంపై తీవ్ర విమర్శలు గుప్పించిన ఆయన.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వైఖరి దేశ ప్రయోజనాలకు అనుకూలంగా లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులను వెంటనే నిలిపివేయాలని రాఘవులు డిమాండ్ చేశారు. చర్చలు జరుపుతున్నామని చెబుతూ అకస్మాత్తుగా దాడులు చేయడం అనైతికమని పేర్కొన్నారు. యుద్ధాన్ని ఆపే పరిస్థితి లేదని, మారణకాండ కొనసాగుతుందని…
PM Modi: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్ చేరుకున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. సాధారణంగా దేశాధినేతలు వచ్చినప్పుడు ఉండే ప్రోటోకాల్ను పక్కన పెట్టి, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు తన భార్య సారాతో కలిసి స్వయంగా విమానాశ్రయానికి వచ్చి భారత ప్రధాని నరేంద్ర మోడీకి స్వాగతం పలికారు. అనంతరం విమానాశ్రయంలో ప్రధాని మోడీకి గార్డ్ ఆఫ్ హానర్ లభించింది. READ…
India-China: భారత అభ్యంతరాల నేపథ్యంలో సోమవారం చైనా ‘‘షక్స్గామ్’’ వ్యాలీపై కీలక ప్రకటన చేసింది. ఇది తమ భూభాగంలోని భాగమని చైనా చెప్పింది. ఈ ప్రాంతంలో చైనా చేపడుతున్న మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ‘‘నిందకు అతీతమైనవి’’గా చెప్పింది. షక్స్గామ్ వ్యాలీలో చైనా చేపడుతున్న పనుల గురించి భారత్ శుక్రవారం విమర్శించింది.
Core-5: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త కూటమి ఏర్పాటుకు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రపంచ శక్తులతో కలిసి ‘‘కోర్-5’’ లేదా ‘‘C5’’ పేరుతో కొత్త గ్రూప్ ఏర్పాట్లుపై ఆలోచిస్తున్నట్లు పలు వార్తలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా, భారత్, రష్యా, చైనా, జపాన్ దేశాలతో కూటమి కట్టాలని ట్రంప్ అనుకుంటున్నారు. ప్రస్తుతం, యూరప్ ఆధిపత్యం ఎక్కువగా ఉన్న G7 దేశాలను కాదని కొత్త కూటమిని ఏర్పాటుపై చర్చలు ఊపందుకున్నాయి. ఇప్పటి వరకు ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన రానప్పటికీ,…
Bangladesh map Controversy: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధిపతి మొహమ్మద్ యూనస్ తాజా చర్య భారతీయుల ఆగ్రహానికి గురి చేసింది. కొందరు ఇండియన్స్ ఈ చర్యను కండకావరమే అని పేర్కొంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. అసలు ఏం జరిగిందంటే.. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధిపతి మొహమ్మద్ యూనస్ – పాకిస్థాన్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ ఛైర్మన్ జనరల్ సాహిర్ షంషాద్ మీర్జాకు వివాదాస్పద మ్యాప్ను అందజేశారు. ఈ మ్యాప్లో భారతదేశంలోని అస్సాం,…
PM Modi Invited to Peace Summit by Trump: ప్రధాని మోడీకి ట్రంప్ నుంచి ఆహ్వానం లభించింది.. అక్టోబర్ 13, సోమవారం షర్మెల్ షేక్లో జరగనున్న శాంతి శిఖరాగ్ర సమావేశానికి హాజరు కావాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దేల్ ఫత్తా అల్-సిసి నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఆహ్వానం అందినట్లు సమాచారం. శనివారం చివరి నిమిషంలో ఈ ఆహ్వానం అందిందని ది ఇండియన్ ఎక్స్ప్రెస్ పేర్కొంది.
Taliban minister: 2021లో ఆఫ్ఘానిస్తాన్లో తాలిబాన్లు అధికారాన్ని చేపట్టిన తర్వాత, తొలిసారిగా తాలిబాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకీ భారతదేశంలో పర్యటిస్తున్నారు. ఆయన విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్తో శుక్రవారం భేటీ అయ్యారు. రెండు దేశాలు సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని చర్చించాయి.