Supreme Court: సుప్రీంకోర్టులో తెలంగాణ బీజేపీకి చుక్కెదురు.. సీఎం రేవంత్ రెడ్డిపై వేసిన పిటిషన్ కొట్టివేత
- సుప్రీంకోర్టులో తెలంగాణ బీజేపీకి చుక్కెదురు
- సీఎం రేవంత్ రెడ్డిపై వేసిన పిటిషన్ కొట్టివేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సుప్రీంకోర్టులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఊరట లభించింది. సీఎం పై తెలంగాణ బిజెపి వేసిన పరువు నష్టం దావా పిటిషన్ ను చీఫ్ జస్టిస్ ధర్మాసనం డిస్మిస్ చేసింది. కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బి ఆర్ గవాయ్ కీలక వాఖ్యలు చేశారు. రాజకీయ పోరాటాలకు కోర్టును వేదిక చేసుకోవద్దని, కోర్టులు ఈ విషయాన్ని పదే పదే చెప్తూనే ఉన్నాయన్నారు చీఫ్ జస్టిస్. రాజకీయాలను రాజకీయంగానే ఎదుర్కోవాలి అని స్పష్టం చేశారాయన. కేసు డిస్మిస్ చేశాక, బిజెపి తరపున న్యాయవాది వాదనలు పొడిగించే ప్రయత్నం చేశారు. దాంతో సీరియస్ అయిన ధర్మాసనం 10 లక్షలు జరిమానా విధిస్తామని హెచ్చరించింది.
Also Read:Ponnam Prabhakar: తెలంగాణ రైతాంగం పట్ల కేంద్రం వివక్ష.. రైతులు ఉద్యమించే వరకు చూస్తోంది
Also Read
- V.D. Satheesan: "సతీశన్ అనే నేను".. దశాబ్దం తర్వాత కేరళంలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం..
- AP Crime: ఏపీలో దారుణం.. మైనర్ బాలికపై రెండేళ్లుగా అత్యాచారం.. నలుగురిపై కేసు నమోదు
- Pakistan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను గద్దె దించేందుకు అమెరికా కుట్ర.. బయటపడ్డ సంచలన రహస్యాలు!
- Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్..
తెలంగాణ బిజెపి సుప్రీం కోర్టును ఎందుకు ఆశ్రయించింది.
తెలంగాణ ముఖ్యమంత్రి పై ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలపై నమోదైన పరువు నష్టం దావాను హైకోర్టు రద్దు చేయడంతో తెలంగాణ బీజేపీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తెలంగాణ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ బీజేపీ వేసిన పిటిషన్పై చీఫ్ జస్టిస్ ధర్మాసనం విచారణ జరిపింది. 2024 లోక్సభ ఎన్నికల ప్రచారంలో మే 4 న కొత్తగూడెంలో జరిగిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బీజేపీ ప్రతిష్ఠను దెబ్బతీశాయని ఆరోపిస్తూ ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు గతేడాది ఫిర్యాదు చేశారు.
Also Read:SBI Recruitment 2025: గెట్ రెడీ.. ఎస్బీఐలో 6,589 పోస్టులు.. ప్రిలిమ్స్ పరీక్ష తేదీలు విడుదల
బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దవుతాయని రేవంత్రెడ్డి మాట్లాడారని తన కంప్లైంట్ లో పేర్కొన్నారు. హైదరాబాద్ ట్రయల్ కోర్టు 2023 ఆగస్టులో ఐపీసీ సెక్షన్లతో పాటు ప్రజాప్రతినిధుల చట్టం 1951లోని సెక్షన్ 125 కింద కేసు కొనసాగుతుందని ఆదేశించింది. దాంతో సీఎం రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించి, రాజకీయ ప్రసంగాలు తరచుగా అతిశయోక్తులతో నిండినవేనని, వాటిని పరువు నష్టంగా పరిగణించడం తగదని వాదించారు. ఆగస్టు 1 న హైకోర్టు రేవంత్రెడ్డి వాదనను సమర్థిస్తూ ట్రయల్ కోర్టు ఆదేశాలను రద్దు చేసింది.
తాజావార్తలు
-
JR NTR : అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రాకుండానే థియేటర్ వద్ద భారీ కటౌట్.. పాలాభిషేకాలతో ఫ్యాన్స్ రచ్చ
-
Samsung Galaxy M47 5G, F70 Pro 5G: సామ్ సంగ్ మిడ్-రేంజ్ 5G ఫోన్లు విడుదలకు సిద్ధం.. 8GB ర్యామ్
-
Kalki Avatar: కలియుగం ముగింపుకు కౌంట్డౌన్ మొదలైందా? పురాణాలు చెప్పిన భయంకర నిజాలు ఇవే!
-
Rashmika Mandanna: కృతి హాట్నెస్పై రష్మిక బోల్డ్ కామెంట్స్..షాక్ అయిన ఫ్యాన్స్
-
KERALA CM VDS: కేరళ కాంగ్రెస్ చరిత్రలోనే కొత్త శకానికి నాంది.. సీఎంగా VDS ప్రమాణం.. ఇంతకీ ఎవరీ సతీశన్?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..