Sheikh Hasina: విద్యార్థి ఉద్యమం కాదు, రెజిమ్ ఛేంజ్ కుట్ర.. 2 ఏళ్ల తర్వాత మౌనం వీడిన షేక్ హసీనా..
- రెండేళ్ల తర్వాత తొలి బహిరంగ ప్రసంగం చేసిన షేక్ హసీనా.
- తన ప్రభుత్వాన్ని కుట్రతో కూల్చారని ఆరోపణ.
- కోటా ఉద్యమాన్ని ప్రభుత్వ మార్పు ఉద్యమంగా మార్చారని వ్యాఖ్య.
- మహ్మద్ యూనస్పై తీవ్ర విమర్శలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా రెండేళ్ల తర్వాత తొలిసారిగా మౌనం వీడారు. తొలిసారిగా బహిరంగంగా ఆమె మాట్లాడారు. 2024 ఆగస్టు 5న బంగ్లాదేశ్ విడిచి భారత్ వచ్చిన ఆమె న్యూఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రసంగించారు. ఈ ప్రసంగం సందర్భంగా ఆమె చాలా సార్లు కన్నీరు పెట్టుకున్నారు. షేక్ హసీనా తర్వాత పాలనాధికారం చేపట్టిన తాత్కాలిక పాలకుడు మహ్మద్ యూనస్పై తీవ్ర ఆరోపణలు చేుశారు. తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు ముందే పక్కా ప్రణాళికను రూపొందించినట్లు ఆరోపించారు. ఈ కుట్ర నిజాన్ని మహ్మద్ యూనసే స్వయంగా బయటపెట్టారని అన్నారు.
బంగ్లాదేశ్లో జరిగిందిన విద్యార్థుల స్వచ్ఛంద ఉద్యమం కాదని, ముందే రూపొందించిన ప్రభుత్వ మార్పు(రెజిమ్ ఛేంజ్) కుట్ర అని ఆరోపించారు. రిజర్వేషన్ కోటా ఉద్యమాన్ని తనను అధికారంలో నుంచి తొలగించేందుకు ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమంగా మార్చి తనను అధికారంలో నుంచి తొలగించే ఉద్యమంగా మార్చారని ఆరోపించారు. ఉద్యమం మొదటి నుంచే శాంతియుతంగా లేదని హసీనా పేర్కొన్నారు. ప్రభుత్వం హైకోర్టు కోటా తీర్పుపై అప్పీల్ చేసిందని, విద్యార్థి నాయకులతో చర్చలకు సిద్ధమైందని కూడా ఆమె చెప్పారు. కొన్ని గుంపులు ఈ ఉద్యమాన్ని హింసాత్మకంగా మార్చి, ఎన్నికైన ప్రభుత్వాన్ని గద్దె దించారని ఆరోపించారు.
Also Read
- Jinping: భారీ బృందంతో ఢిల్లీకి వస్తున్న చైనా అధ్యక్షుడు.. బ్రిక్స్లో పాల్గొననున్న జిన్పింగ్
- Jaishankar-Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్తో జైశంకర్ భేటీ.. రెండు దేశాల సంబంధాలపై చర్చ
- Makkah: ఉద్రిక్తతల వేళ మక్కా ఒప్పందంలోకి ఇరాన్కు ఆహ్వానం! ఏదో జరుగుతోంది!
- Iran-US Tensions Escalate: అమెరికా ఆర్థిక ఆంక్షలకు మద్దతిస్తే ‘యుద్ధ చర్య’గానే చూస్తాం.. దేశాలకు ఇరాన్ హెచ్చరిక
2024 అల్లర్ల సమయంలో 450కి పైగా పోలీస్ స్టేషన్లకు నిప్పు పెట్టారని, ప్రభుత్వ కార్యాలయాలపై దాడులు చేశారని, పలువురు పోలీస్ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని ఆమె ఆరోపించారు. తన ప్రసంగంలో 1975లో తన కుటుంబ సభ్యుల హత్యను గుర్తు చేసుకుంటూ హసీనా భావోద్వేగానికి గురయ్యారు. తన తండ్రి షేక్ ముజిబుర్ రెహ్మాన్తో పాటు 1971విమోచన పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు నివాళలర్పించారు.
ఇప్పుడున్న బంగ్లాదేశ్ తాము సృష్టించింది కాదని, గత రెండేళ్లుగా బంగ్లాదేశ్లో కష్టాలు పెరిగాయని అన్నారు. తాను దేశానికి దూరంగా ఉన్నా, ప్రజలకు ఎన్నడూ దూరంగా లేనని, తన కుటుంబం బంగ్లాదేశ్ కోసం పోరాడిందని చెప్పారు. మహ్మద్ యూనస్ పోలీసుల్ని చంపిన హంతకులకు క్షమాభిక్ష ప్రసాదించారని చెప్పారు. బంగ్లాదేశ్లో మైనారిటీ వర్గాలపై దాడులు, న్యాయమూర్తులపై దాడులు చేశారని ఆమె అన్నారు.
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!