UP: వరకట్న దాహానికి మరో అబల బలి.. భార్యను చంపిన కానిస్టేబుల్
- వరకట్న దాహానికి మరో అబల బలి
- యూపీలో భార్యను చంపిన కానిస్టేబుల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాత్రియుగం నుంచి రాకెట్ యుగానికి వచ్చాం. కాలాలు.. పరిస్థితులు మారాయి. ఒకప్పుడు అజ్ఞానంతో దారుణాలకు ఒడిగట్టేవారు. ఇప్పుడు విజ్ఞానం పెరిగింది.. సంపద పెరిగింది. ఇలాంటి తరుణంలో క్రైమ్ రేట్ తగ్గాల్సింది పోయి.. క్రమక్రమంగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ మధ్య వరకట్న పిశాచి దేశాన్ని వెంటాడుతోంది. రోజూ ఎక్కడొక చోట వరకట్న దాహానికి అబల బలైపోతుంది. ఇటీవలే నోయిడాలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది. అలాగే రాజస్థాన్లో మూడేళ్ల కుమార్తెతో సహా లెక్చరర్ సజీవదహనం అయ్యారు. తాజాగా ఇదే తరహాలో యూపీలో మరో అబల ప్రాణాలు కోల్పోయింది.
ఇది కూడా చదవండి: Modi-Trump: టారిఫ్ ఉద్రిక్తతలు.. ట్రంప్ ఫోన్ కాల్స్ పట్టించుకోని మోడీ.. ఎన్ని సార్లు చేశారంటే..!
Also Read
- Ketan Agarwal Case: కేతన్ను లోయలోకి తోసేముందు చేతన్ ఏమన్నాడో తెలుసా.. వెలుగులోకి కొత్త విషయాలు
- Bengaluru: కన్నడ నటి ఇంట్లో వ్యాపారవేత్త మృతి.. మిస్టరీగా మారిన కేసు
- Ketan Agarwal Case: సియా-చేతన్ను కలిపిన ‘దీపావళి’.. ఆరోజు ఏం జరిగిందంటే..!
- Ketan Agarwal Case: కేఫ్లో గంటపాటు ప్రియుడితో కలిసి హత్యకు కుట్ర.. వెలుగులోకి వీడియోలు
దేవేంద్ర-పరుల్(32) భార్యాభర్తలు. దేవేంద్ర పోలీస్ శాఖలో కానిస్టేబుల్గా పని చేస్తున్నాడు. పరుల్ నర్సు శిక్షణ పొందింది. ఇటీవలే రాంపూర్ నుంచి బరేలీకి దేవేంద్ర బదిలీ అయ్యాడు. అయితే అదనపు కట్నం తీసుకురావాలంటూ పరుల్ను దేవేంద్ర హింసిస్తున్నాడు. సెలవుపై ప్రస్తుతం దేవేంద్ర ఇంట్లోనే ఉంటున్నాడు. అయితే నారంగ్పూర్ గ్రామంలో ఉండగా మళ్లీ కట్నం కోసం గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో పరుల్కు దేవేంద్ర, బంధువులు నిప్పంటించారు. దీంతో తీవ్రగాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండడంతో ఢిల్లీకి తరలించారు. చికిత్స పొందుతూ పరుల్ ప్రాణాలు కోల్పోయింది. దీంతో అమ్రోహా జిల్లా పోలీసులు ఆరుగురు కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు. కానిస్టేబుల్ దేవేంద్ర సహా కుటుంబ సభ్యులపై కేసు బుక్ చేశారు.
ఇది కూడా చదవండి: Modi-Rabuka: ఎవరో మీతో సంతోషంగా లేరు.. మోడీతో ఫిజీ ప్రధాని వ్యాఖ్య
కట్నం డిమాండ్ తీర్చకపోవడంతో దేవేంద్ర, అతడి బంధువులు పరుల్ను సజీవ దహనం చేసేందుకు ప్రయత్నించారని పోలీసులు తెలిపారు. పరుల్ సోదరుడి ఫిర్యాదు మేరకు భర్త దేవేంద్ర, అతని తల్లి, సోను, గజేష్, జితేంద్ర, సంతోష్ అనే నలుగురు మగ బంధువులపై గృహ హింస, హత్యాయత్నం వంటి కేసులు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆరుగురు నిందితులంతా పరారీలో ఉన్నారని.. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు.
మంగళవారం తెల్లవారుజామున పొరుగువారు తమకు ఫోన్ చేసి చెప్పారని పరుల్ తల్లి అనిత తెలిపింది. కుమార్తె దగ్గరకు రాగానే నొప్పితో విలవిలలాడుతోందని చెప్పింది. తీవ్రగాయాలతోనే సమీపంలోని ఆస్పత్రికి తరలించామని.. అనంతరం ఢిల్లీకి తీసుకెళ్లాల్సి వచ్చిందని పేర్కొంది. ప్రాణాలతో పోరాడుతో ప్రాణాలు కోల్పోయిందని కన్నీరు మున్నీరు అయింది. 13 ఏళ్ల క్రితం దేవేంద్రకు ఇచ్చి వివాహం చేశామని.. ఇద్దరు కవల పిల్లలు ఉన్నారని చెప్పింది.
- Tags
- dowry
- husband
- UP
- UP woman burnt
తాజావార్తలు
-
Denmark: డెన్మార్క్లో అజాన్పై బ్యాన్.. ఇస్లామీకీకరణపై ఆందోళన..
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
YouTube vs Instagram: డబ్బు సంపాదించాలంటే ఇన్స్టా బెస్ట్ ఆ? యూట్యూబ్ బెస్ట్ ఆ? ఈ లెక్కలు చూస్తే షాకవుతారు!
-
Ketan Agarwal Case: కేతన్ను లోయలోకి తోసేముందు చేతన్ ఏమన్నాడో తెలుసా.. వెలుగులోకి కొత్త విషయాలు
-
Ketan Agarwal Case: కేతన్-సియా కేసులో కొత్త ట్విస్ట్.. బ్లాక్మెయిల్ కోణంలో దర్యాప్తు..
ట్రెండింగ్
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!