Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Essential Food Items Price Hike: రక్షాబంధన్ నుంచి జన్మాష్టమి, గణేష్ చవితి, దీపావళి వరకు వరుస పండుగలు రానున్న వేళ సామాన్య ప్రజలకు ధరల పెరుగుదల పెద్ద ఆందోళనగా మారింది. వినియోగదారుల వ్యవహారాల శాఖ ధరల పర్యవేక్షణ వ్యవస్థ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం గత ఐదు నెలల్లో 16 ప్రధాన నిత్యావసర ఆహార వస్తువుల్లో 15 వస్తువుల ధరలు పెరిగాయి. అంటే దాదాపు 99 శాతం రేషన్ వస్తువులు గతంతో పోలిస్తే అధిక ధరలకు లభిస్తున్నాయి. దీంతో ప్రతి కుటుంబం నెలవారీ ఆహార వ్యయం గణనీయంగా పెరిగే పరిస్థితి ఏర్పడింది.
పప్పుధాన్యాల ధరల్లో భారీ పెరుగుదల
గత ఐదు నెలల్లో పప్పుధాన్యాల ధరలే అత్యధికంగా పెరిగాయి. ముఖ్యంగా కందిపప్పు కిలోకు సుమారు రూ.6 పెరిగి రూ.123.46కు చేరుకుంది. శనగపప్పు ధర కిలోకు రూ.86.66, మినపప్పు ధర రూ.121.51గా నమోదైంది. దీంతో మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాల వంటింటి ఖర్చు మరింత పెరిగింది.
Also Read
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
- Sheikh Hasina: విద్యార్థి ఉద్యమం కాదు, రెజిమ్ ఛేంజ్ కుట్ర.. 2 ఏళ్ల తర్వాత మౌనం వీడిన షేక్ హసీనా..
వంట నూనె, పాల ధరలూ పెరిగాయి
వంట నూనెల ధరలు కూడా వినియోగదారులకు భారంగా మారాయి. ఆవ నూనె ధర లీటరుకు రూ.7.56 పెరిగి రూ.196.44కు చేరింది. అలాగే సోయాబీన్, పొద్దుతిరుగుడు, పామాయిల్ ధరలు కూడా 4 నుంచి 4.5 శాతం వరకు పెరిగాయి. మరోవైపు పాల ధర లీటరుకు రూ.3 పెరగడం కుటుంబాల నెలవారీ ఖర్చుపై అదనపు భారం మోపుతోంది.
చక్కెర కూడా ఖరీదే.. పిండి మాత్రం స్థిరం
పండుగల సీజన్లో స్వీట్లకు డిమాండ్ అధికంగా ఉండటంతో పాటు చెరకు నుంచి ఇథనాల్ ఉత్పత్తి పెరగడం వల్ల చక్కెర ధర కిలోకు రూ.2.25 పెరిగి రూ.49.33కు చేరింది. అయితే గోధుమల నిల్వలు తగినంతగా ఉండటంతో పిండి ధర కిలోకు రూ.37.35 వద్ద దాదాపు స్థిరంగానే కొనసాగుతోంది. ఇది వినియోగదారులకు కొంత ఉపశమనంగా చెప్పవచ్చు.
ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలు ఇవే
ధరల పెరుగుదలకు దేశీయ, అంతర్జాతీయ పరిస్థితులే కారణమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది బలహీనమైన, అనిశ్చిత రుతుపవనాల కారణంగా ఖరీఫ్ సీజన్లో పప్పుధాన్యాల సాగు విస్తీర్ణం గత ఏడాదితో పోలిస్తే 7 శాతం తగ్గింది. దీంతో ఉత్పత్తి తగ్గే అవకాశం ఉందనే అంచనాలు మార్కెట్లో ధరలను పెంచుతున్నాయి. ఇక పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచ సరఫరా గొలుసులను ప్రభావితం చేశాయి. భారతదేశం పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకునే పామాయిల్, సోయాబీన్ నూనెల ధరలు అంతర్జాతీయ మార్కెట్లో పెరగడంతో దేశీయ మార్కెట్పై కూడా ప్రభావం పడింది.
పండుగల డిమాండ్ కూడా ప్రభావం చూపుతోంది
రక్షాబంధన్, గణేష్ చవితి, దీపావళి వంటి పండుగలను దృష్టిలో పెట్టుకుని హల్వాయిలు, ప్రాసెసర్లు, రిటైలర్లు ముందుగానే భారీగా నిల్వలు కొనుగోలు చేస్తున్నారు. దీంతో మార్కెట్లో డిమాండ్ ఒక్కసారిగా పెరిగి ధరలపై మరింత ఒత్తిడి ఏర్పడింది.
ముందు రోజుల్లో పరిస్థితి ఎలా ఉండొచ్చు?
అంతర్జాతీయంగా ముడి చమురు, దిగుమతి చేసుకునే వంట నూనెల ధరలు తగ్గితేనే దేశీయ మార్కెట్లో ఉపశమనం లభించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. అలాగే రుతుపవనాల రెండో దశ కూడా అనుకూలంగా లేకపోతే పప్పుధాన్యాలు, వంట నూనెల ధరలు పండుగల కాలంలో మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. దీంతో రాబోయే నెలల్లో సామాన్యుడి వంటగది బడ్జెట్పై ఒత్తిడి మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!