Modi-Trump: టారిఫ్ ఉద్రిక్తతలు.. ట్రంప్ ఫోన్ కాల్స్ పట్టించుకోని మోడీ.. ఎన్ని సార్లు చేశారంటే..!
- భారత్-అమెరికా మధ్య టారిఫ్ ఉద్రిక్తతలు
- ట్రంప్ ఫోన్ కాల్స్ పట్టించుకోని మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్-అమెరికా మధ్య టారిఫ్ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. నేటి నుంచి భారత్పై 50 శాతం సుంకాలు అమలవుతున్నాయి. దీంతో రెండు దేశాల మధ్య వాణిజ్య యుద్ధ వాతావరణం నెలకొంది. తొలుత భారత్పై 25 శాతం సుంకం విధించగా.. అనంతరం రష్యాతో సంబంధాలు పెట్టుకున్నందుకు జరిమానాగా మరో 25 శాతం సుంకం విధించారు. ఇలా మొత్తంగా భారత్పై 50 శాతం సుంకం విధించారు. ఈ కారణంతో రెండు దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి.
ఇది కూడా చదవండి: Modi-Rabuka: ఎవరో మీతో సంతోషంగా లేరు.. మోడీతో ఫిజీ ప్రధాని వ్యాఖ్య
Also Read
- Bangladesh: బంగ్లాదేశ్కు భారత్ ‘‘కరెంట్ షాక్’’..
- PM Modi: ‘‘సరిహద్దుల్లో శాంతి తప్పనిసరి’’.. జిన్పింగ్కు తేల్చి చెప్పిన మోడీ..
- Suvendu Adhikari: చిన్మోయ్ కృష్ణదాస్ కన్నీరు.. హిందువుల పరిస్థితిపై బెంగాల్ సీఎం కామెంట్స్..
- PM Modi-Xi Jinping: ఒకరి నుంచి మరొకరం నేర్చుకోవచ్చు: మోడీతో భేటీలో జిన్పింగ్..
ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ప్రధాని మోడీకి ఫోన్ చేశారు. దాదాపు నాలుగు సార్లు ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. ఏ ఫోన్ కాల్ను మోడీ లిఫ్ట్ చేయలేనట్లుగా సమాచారం. కొత్త సుంకం అమల్లోకి రాకముందు వారంలో దాదాపు ట్రంప్ నాలుగు సార్లు ఫోన్ చేశారు. ఆ ఫోన్ కాల్స్ ఎత్తకుండా మోడీ తప్పించుకున్నారని అంతర్జాతీయ కథనాలు పేర్కొన్నాయి. భారీగా సుంకం విధించడంతో మోడీ కోపంగా ఉన్నారని.. ఆ కారణం చేతనే ట్రంప్ ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయలేదని జర్మన్ వార్తాపత్రిక ఫ్రాంక్ఫర్టర్ అల్గెమైన్ జైటంగ్ వర్గాలు ఉటంకిస్తూ కథనం పేర్కొంది.
ఇది కూడా చదవండి: UP: సీఎం యోగి సరికొత్త నిర్ణయం.. 7 నగరాల్లో ట్రాఫిక్ కంట్రోల్ కోసం ఏం చేశారంటే..!
జపాన్ వార్తాపత్రిక నిక్కీ ఆసియా కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. టారిఫ్ ఉద్రిక్తతల వేళ ట్రంప్ ఫోన్ కాల్స్ను మోడీ పట్టించుకోలేదని.. ట్రంప్కు నిరసనగా మోడీ ఇలా చేశారని రాసుకొచ్చింది. సుంకాల విషయంలో మోడీ చాలా చిరాకుగా ఉన్నారని కూడా పేర్కొంది. అంతేకాకుండా ఉగ్రవాదాన్ని ఉసిగొల్పే పాకిస్థాన్తో ట్రంప్ సంబంధాలు పెంచుకోవడంపై కూడా మోడీ కోపంగా ఉన్నారని తెలిపింది. భారత్పై మక్కువ తగ్గి.. పాకిస్థాన్తో సంబంధాలు పెంచుకోవడం కూడా ఒక కారణం అని వార్తా పత్రిక వెల్లడించింది.
ఇదిలా ఉంటే ఇటీవల ప్రధాని మోడీ అహ్మదాబాద్లో పర్యటించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. ట్రంప్ సుంకాలను భరించడానికి భారత్ సిద్ధంగా ఉందని తెలిపారు. అన్నదాతల కోసం ఎంతైనా భరిస్తామని.. రైతుల ప్రయోజనాల విషయంలో ఎప్పటికీ రాజీపడబోమని మోడీ తేల్చి చెప్పారు. వాషింగ్టన్ ఒత్తిడికి తలొగ్గే ప్రసక్తే లేదన్నారు.
ఇదిలా ఉంటే ప్రముఖ విశ్లేషకుడు మార్క్ ఫ్రేజియర్ స్పందిస్తూ.. చైనాను అదుపు చేసేందుకు గతంలో భారత్తో ట్రంప్ మంచి సంబంధాలు పెట్టుకున్నారని.. రెండు దశాబ్దాలుగా మంచి సంబంధాలు కొనసాగాయన్నారు. ఇప్పుడు సుంకాలు కారణంగా భారత్-చైనా సంబంధాలు బలపడుతున్నాయని చెప్పుకొచ్చారు. చైనాతో సంబంధాలు కారణంగా తిరిగి భారత్ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని అభిప్రాయపడ్డారు.
తాజావార్తలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
-
Secret Soldiers: ‘చైనా’ పేరుతో సెన్సార్ బోర్డ్లో ప్రకంపనలు.. రంగంలోకి విదేశీ వ్యవహారాల శాఖ!
-
OTR: సిగ్గా.. భయమా.. మొహమాటమా? అంజిరెడ్డి తీరుపై బీజేపీలో హాట్ టాపిక్
-
OTR: సిక్కోలులో వైసీపీకి గ్రూపుల గోల! స్థానిక ఎన్నికల వేళ అసలు రచ్చ ఇదేనా?
-
OTR: తెలంగాణ కేబినెట్లో విజయశాంతికి ఛాన్స్? ఢిల్లీలో గట్టిగా లాబీయింగ్!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!