Sudan: సూడాన్లో తీవ్రమైన హింస.. 200 మంది మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sudan Crisis: సైన్యం, పారామిలిటరీల మధ్య రాజుకున్న వివాదం సూడాన్ లో తీవ్ర హింసకు దారి తీసింది. ఈ రెండు బలగాల మధ్య తీవ్రమైన దాడులు జరుగుతున్నాయి. పారామిలిటరీని సైన్యంలో కలిపే ప్రతిపాదనతో సైన్యాధ్యక్షుడు, పారామిలిటీరీ కమాండర్ మధ్య వివాదం ఏర్పడింది. ఈ ఘర్షణల్లో 200 మంది మరణించగా.. 1800 మంది గాయపడ్డారు. ఈ ఘర్షణల్లో సాధారణ ప్రజలు మరణిస్తున్నారు. మూడు రోజులుగా కొనసాతున్న ఈ ఘర్షణల్లో రాజధాని ఖార్టుమ్ లోని పలు ఆస్పత్రులు దెబ్బతిన్నాయి. వైద్యం, ఆహారం కొరత ఏర్పడింది.
2021లో తిరుగబాటుతో అధికారాన్ని చేపట్టిన ఇద్దరు జనరల్స్ సూడాన్ ఆర్మీ చీఫ్ అబ్దెల్ ఫట్టా అల్-బుర్హాన్, శక్తివంతమైన పారామిలిటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్స్కు నాయకత్వం వహిస్తున్న అతని డిప్యూటీ మొహమ్మద్ హమ్దాన్ డాగ్లో మధ్య వారాలపాటు సాగిన అధికార పోరాటం శనివారం ఘోరమైన హింసాత్మకంగా మారింది. రాజధానిలో పరిస్థితులు తీవ్రంగా తయారు అయ్యాయి. ఇరు వర్గాలు కూడా వారి వ్యతిరేక స్థావరాలపై దాడులు చేసుకుంటున్నాయి.
Also Read
- International Tea Day: మీరు ప్రతిరోజూ తాగే చాయ్ నిజంగా ఆరోగ్యకరమేనా..?
- Trump - Netanyahu: ఇరాన్ విషయంలో అమెరికా - ఇజ్రాయెల్ మధ్య ఓపెన్ వార్.. ట్రంప్ ఫోన్ కాల్తో నెతన్యాహు ఫైర్!
- Trump vs Netanyahu: ట్రంప్ నిర్ణయంపై నెతన్యాహు తీవ్ర ఆగ్రహం.. అమెరికా 'లెటర్ ఆఫ్ ఇంటెంట్' పై ఇజ్రాయెల్ అనుమానాలు!
- Kashmir Issue: పాకిస్థాన్పై భారత్ ఆగ్రహం.. ఉగ్రవాదాన్ని పెంచే దేశం మానవ హక్కుల గురించి మాట్లాడటం హాస్యాస్పదం..
Read Also: Pakistan: పాకిస్తాన్లో చైనా వ్యాపారాలు క్లోజ్.. భద్రతే ప్రధాన కారణం..
ప్రజలు ఆహారం, పెట్రోల్ కోసం దాడుల మధ్యే క్యూల్లో నిలబడాల్సి పరిస్థితి ఏర్పడింది. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ-జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ఇరు పక్షాలు శతృత్వాన్ని వీడాలంటూ పిలుపునిచ్చారు. రాజధాని ఖార్టూమ్ నగరంలో తొమ్మిది ఆస్పత్రుల్లో రక్తమార్పిడి, ఇంట్రావీనస్ ఫ్లూయిడ్స్ ఇతర మందులు అయిపోయాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే హెచ్చరించింది.
ఇదిలా ఉంటే ఈ ఘర్షణల మధ్య యూరోపియన్ యూనియన్ రాయబారి ఇంటిపై దాడి జరిగింది. మరోవైపు భారతీయుల భద్రతపై అక్కడి రాయబార కార్యాలయం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇళ్ల నుంచి బయటకు వెళ్లవద్దని కోరింది. సూడాన్ ఘర్షణల్లో కేరళకు చెందిన ఓ వ్యక్తి మరణించాడు. అతడి మృతదేహాన్ని ఇండియాకు తీసుకురావడానికి అధికారం యంత్రాంగం పనిచేస్తోంది.
- Tags
- Africa
- EU
- india
- Sudan
- Sudan Crisis
తాజావార్తలు
-
OPPO Find X9s: ఒప్పో ఫైండ్ X9s వచ్చేసింది.. 50MP కెమెరా, 7025mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే
-
Workers Salary Hike: తెలంగాణ కార్మికులకు భారీ శుభవార్త.. కనీస వేతనాల పెంపుపై కీలక నిర్ణయం
-
PMO Official Gifts: మెలోడీ చాక్లెట్ వివాదం.. విదేశీ పర్యటనల్లో ప్రధాని ఇచ్చిన కానుకల వివరాలు వెల్లడించిన పీఎంఓ
-
OPPO Find X9 Ultra: 200MP కెమెరా, 7050mAh బ్యాటరీతో.. ఒప్పో ఫైండ్ X9 అల్ట్రా రిలీజ్
-
YS Jagan: చంద్రబాబు చెప్పిన ప్రకారం పెట్రోల్, డీజిల్పై రూ.8 తగ్గించాలి కదా..? జగన్ డిమాండ్
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!