Pakistan: పాకిస్తాన్లో చైనా వ్యాపారాలు క్లోజ్.. భద్రతే ప్రధాన కారణం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్ ఆల్ వెదర్ ఫ్రెండ్ చైనా నెమ్మదిగా ఆ దేశంలో తమ వ్యాపారాలను మూసేస్తోంది. పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభం, రాజకీయ అనిశ్చితి, ఉగ్రవాదం వంటి అంశాలు ఇందుకు దోహదం చేస్తున్నాయి. ఇటీవల కాలంలో చైనా-పాక్ ఎకనామిక్ కారిడార్(సీపెక్)లో భాగంగా జరుగుతున్న అభివృద్ధి పనులపై తరుచుగా బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్, పాక్ తాలిబాన్లు దాడులకు తెగబడుతున్నారు. ఈ ప్రాజెక్టుల్లో పనిచేసే చైనీయులు భయంతో పనులు చేస్తున్నారు. చివరకు చైనా తమ పౌరులు సొంత సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోవాలని సూచించిదంటే అక్కడ భద్రత ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
కరాచీ పోలీసులు నగరంలో చైనీయులు నిర్వహించే వ్యాపారాలను తాత్కాలికంగా మూసేస్తున్నారు. భద్రతా కారణాల రీత్యా ఇలా చేస్తున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా ఇటీవల చైనా ఇస్లామాబాద్ లోని తమ రాయబార కార్యాలయం కాన్సులర్ విభాగాన్ని తాత్కాలికంగా మూసేసింది. చైనా హెచ్చరికలు చేస్తున్నప్పటికీ చైనీయులు నివసిస్తున్న ప్రాంతాల్లో రక్షణ కల్పించడంలో పాక్ విఫలం అవుతోంది. ఇదిలా ఉంటే పాక్, చైనా నుంచి తీసుకున్న రుణాలను మాఫీ చేయాలని, రాబోయే డిఫాల్ట్ ను నివారించడానికి గడువు పొడగించాలని పరోక్షంగా బీజింగ్ పై ఒత్తిడి తీసుకువస్తోంది.
Also Read
- Giorgia Meloni: మెలోని పెళ్లెందుకు చేసుకోలేదు.. మెలోడీ వీడియో వైరల్ తర్వాత నెట్టింట తీవ్ర చర్చ
- International Tea Day: మీరు ప్రతిరోజూ తాగే చాయ్ నిజంగా ఆరోగ్యకరమేనా..?
- Trump - Netanyahu: ఇరాన్ విషయంలో అమెరికా - ఇజ్రాయెల్ మధ్య ఓపెన్ వార్.. ట్రంప్ ఫోన్ కాల్తో నెతన్యాహు ఫైర్!
- Trump vs Netanyahu: ట్రంప్ నిర్ణయంపై నెతన్యాహు తీవ్ర ఆగ్రహం.. అమెరికా 'లెటర్ ఆఫ్ ఇంటెంట్' పై ఇజ్రాయెల్ అనుమానాలు!
Read Also: Debit cards: తగ్గిపోతున్న డెబిట్ కార్డ్స్ వినియోగం.. అంతా యూపీఐ లావాదేవీలకే మొగ్గు..
ఇదిలా ఉంటే వ్యాపారాలు, అభివృద్ధి ప్రాజెక్టుల పేరుతో చైనీయులు తమ భూములను ఆక్రమిస్తున్నారనే అనుమానం పాకిస్తాన్ ప్రజల్లో పెరుగుతోంది. చైనా పట్ల వ్యతిరేకత పెరుగుతోంది. పాక్ ఉన్న పరిస్థితుల్లో చైనీయులను రక్షించడానికి ప్రత్యేక భద్రతా విభాగానికి ఆర్థిక సాయం చేయలేకపోతోంది. ఫలితంగా చైనా వ్యాపారాలు ప్రభావితం అవుతున్నాయి. చైనా విదేశాంగ మంత్రి క్విన్ గ్యాంగ్ ఇటీవల పాక్ మంత్రి బిలావల్ భుట్టోతో సమావేశమై భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. వేర్పాటువాదం ఎక్కువగా ఉన్న సింధ్, బలూచిస్తాన్ ప్రావిన్సుల్లో చైనా వ్యాపారాలే టార్గెట్ గా దాడులు జరుగుతున్నాయి. దీంతో అక్కడి పోలీసులు చైనా వ్యాపారాలను తాత్కాలికంగా మూసేస్తున్నారు.
గతంలో కరాచీ విశ్వవిద్యాలయంలోని కన్ఫ్యూషియస్ ఇనిస్టిట్యూట్ సమీపంలో జరిగిన ఆత్మాహుతి బాంబు దాడితో, ముగ్గురు చైనీస్ ఉపాధ్యాయులు ప్రాణాలు కోల్పోయారు. జూన్ 2020లో స్టాక్ ఎక్స్ఛేంజ్ ఉన్న భవనంపై దాడి జరిగింది, పాక్షికంగా చైనా కన్సార్టియం యాజమాన్యంలో ఉంది, అలాగే 2018లో కరాచీలోని చైనీస్ కాన్సులేట్పై దాడి జరిగింది. జూలై 2021లో, ఖైబర్ పఖ్తున్ఖ్వాలోని కోహిస్తాన్ ప్రాంతంలోని డ్యామ్ సమీపంలో నిర్మాణ ప్రదేశానికి ఇంజనీర్లను రవాణా చేస్తున్న బస్సుపై TTP నేతృత్వంలోని ఆత్మాహుతి బాంబు దాడి చేసింది, తొమ్మిది మంది చైనీస్ కార్మికులతో సహా 13 మంది వ్యక్తులు మరణించారు. దీనికి తోడు చైనీయులు అక్కడ దైవదూషణ కేసుల్ని ఎదుర్కొంటున్నారు.
తాజావార్తలు
-
Giorgia Meloni: మెలోని పెళ్లెందుకు చేసుకోలేదు.. మెలోడీ వీడియో వైరల్ తర్వాత నెట్టింట తీవ్ర చర్చ
-
Pulwama Attack: అజ్ఞాత వ్యక్తుల సంచలనం.. పాక్లో పుల్వామా సూత్రధారి హతం..
-
Peddi Twist: ఢిల్లీ ఎపిసోడ్ ట్విస్ట్.. ‘ఉప్పెన’ క్లైమాక్స్ కంటే 100 రెట్లు ఎక్కువ!
-
Cockroach Janata Party: కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్ షాక్.. “ఎక్స్” అకౌంట్ నిలిపివేత..
-
Hardik Pandya-MI: ఒక కిచెన్లో చాలా మంది చెఫ్స్.. హార్దిక్ పాండ్యాకు బయటికి వెళ్లే సమయం వచ్చేసింది!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!