Komatireddy Rajgopal Reddy: ధర్మరాజుగా ఉండాల్సిన జానారెడ్డి ధృతరాష్ట్రుడిగా మారారు.. రాజగోపాల్ రెడ్డి సంచలనం
- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి సంచలన వ్యాఖ్యలు
- పదవి అడుక్కునే పరిస్థితిలో నేను లేను
- ధర్మరాజుగా ఉండాల్సిన జానారెడ్డి ధృతరాష్ట్రుడిగా మారారు
- నాకు చాలా బాధగా ఉంది. -రాజగోపాల్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Komatireddy Rajgopal Reddy: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం శనివారం జరగింది. ఈ కార్యక్రమానికి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను భువనగిరి పార్లమెంటు స్థానం విజయంలో కీలక పాత్ర వహించానని, తాను ప్రచార బాధ్యతలు చేపట్టినద్వారా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందని చెప్పారు. “భువనగిరి సీట్ బీజేపీకి వచ్చేదని సర్వేలు స్పష్టంగా సూచించాయి. కానీ నేను ప్రచారంలో మళ్లీ ఫలితాన్ని తారుమారు చేయగలిగాను,” అని ఆయన అన్నారు.
Also Read
- Denmark: డెన్మార్క్లో అజాన్పై బ్యాన్.. ఇస్లామీకీకరణపై ఆందోళన..
- Ketan Agarwal Case: కేతన్ను లోయలోకి తోసేముందు చేతన్ ఏమన్నాడో తెలుసా.. వెలుగులోకి కొత్త విషయాలు
- Ketan Agarwal Case: కేతన్-సియా కేసులో కొత్త ట్విస్ట్.. బ్లాక్మెయిల్ కోణంలో దర్యాప్తు..
- IAS Krishna Teja: పంచాయతీ నిధుల గోల్మాల్.. వైరల్గా మారిన కమిషనర్ కృష్ణతేజ వార్నింగ్..
రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ సాధన కోసం తన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రి పదవిని త్యాగం చేసిన చరిత్రను గుర్తు చేశారు. “ఆదిశ్టానం నాకు మంత్రి పదవి ఇస్తే దాన్ని బాధ్యతగా స్వీకరిస్తాను. యాదాద్రి జిల్లా అభివృద్ధికి నా వంతు కృషి చేస్తాను,” అని తెలిపారు.
అలాగే, తాను ఎప్పుడూ మంత్రి పదవిని కోరలేదని, అడగలేదని స్పష్టం చేశారు. “భారత క్రికెట్ జట్టులో ఇద్దరు అన్నదమ్ములు ఆడిన సందర్భాలు ఉన్నాయే గానీ, ఒకే కుటుంబం నుంచి ఇద్దరు నేతలు ఉంటే తప్పేంటి?” అని ప్రశ్నించారు.
తనపై ఉన్న నమ్మకంతోనే మంత్రి పదవి లేని తనకే భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్కి ప్రచార బాధ్యతలు అప్పగించారని పేర్కొన్నారు. “గత ఎన్నికల్లో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఓ మంత్రిని ఇన్ఛార్జీగా పెట్టారు. నేను మంత్రి పదవిలో లేకపోయినా, భువనగిరి బాధ్యత నాకు ఇవ్వడం వింత కాదా? ఇదే నా సామర్థ్యానికి నిదర్శనం,” అని అన్నారు. రాజకీయాల్లో సామర్థ్యం కీలకమని, అలాగే నాయకుల కృషి పట్ల గుర్తింపు కూడా ఉండాలని సూచించారు. “సమర్థత ఉన్నవారికి పదవులు ఇవ్వాలి,” అని తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
Viral : అమ్మకు నానమ్మ, తాతయ్య నచ్చరంట.. క్శశ్చన్ పేపర్లో విద్యార్థినీ సమాధానం వైరల్
తాజావార్తలు
-
Denmark: డెన్మార్క్లో అజాన్పై బ్యాన్.. ఇస్లామీకీకరణపై ఆందోళన..
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
YouTube vs Instagram: డబ్బు సంపాదించాలంటే ఇన్స్టా బెస్ట్ ఆ? యూట్యూబ్ బెస్ట్ ఆ? ఈ లెక్కలు చూస్తే షాకవుతారు!
-
Ketan Agarwal Case: కేతన్ను లోయలోకి తోసేముందు చేతన్ ఏమన్నాడో తెలుసా.. వెలుగులోకి కొత్త విషయాలు
-
Ketan Agarwal Case: కేతన్-సియా కేసులో కొత్త ట్విస్ట్.. బ్లాక్మెయిల్ కోణంలో దర్యాప్తు..
ట్రెండింగ్
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!