Volodymyr Zelenskyy: ఆ విషయంలో భారత్ భాగస్వామ్యం ఆశిస్తున్నా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Narendra Modi Held Talks With Ukraine President Volodymyr Zelenskyy: కొన్ని రోజుల క్రితమే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో మాట్లాడిన భారత ప్రధాని నరేంద్ర మోడీ.. తాజాగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ఫోన్లో ముచ్చటించారు. ఈ సందర్భంగా.. తాము శాంతి ప్రయత్నాల్లో ఎలాంటి సహాయం కావాలన్నా అందిస్తామని భరోసా కల్పించారు. బాధిత ప్రజలకు మానవతాసాయం ఇచ్చేందుకూ కట్టుబడి ఉన్నామన్నారు. వెంటనే యుద్ధాన్ని విరమించేందుకు ఇరు దేశాలు (రష్యా, ఉక్రెయిన్) చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఇరువర్గాలు చర్చలు ప్రారంభించి.. విభేదాల్ని పరిష్కరించుకొని.. దీర్ఘకాలిక పరిష్కారాలకు బాటలు వేయాలని సూచించారు. అలాగే.. ఉక్రెయిన్లో చదువుకుంటూ భారత్కి తిరిగొచ్చిన విద్యార్థుల విద్యాభ్యాసం కొనసాగేలా చర్యలు తీసుకోవాల్సిందిగా జెలెన్స్కీని మోడీ కోరారు. ఈమేరకు అధికార ప్రకటన విడుదలైంది.
President Schedule Today: తెలంగాణాలో రాష్ట్రపతి పర్యటన.. నేటి షెడ్యూల్ ఇదే..
Also Read
- Trump 200% Tariff: ట్రంప్ సంచలన నిర్ణయం.. జెనరిక్ మందులపై 200% టారిఫ్.. భారత ఫార్మా పరిశ్రమపై భారీ ప్రభావం?
- China: కొత్త గేమ్కి రెడీ అవుతున్న చైనా.. ప్రపంచానికి షాక్ తప్పదా?
- Israel-Iran: పర్వతం కింద అణు పదార్థం.. ఇరాన్పై ఇజ్రాయిల్ సంచలన రిపోర్ట్..
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై భారత్ కీలక నిర్ణయం.. పాక్కు స్పష్టమైన సందేశం..
అటు.. మోడీతో జరిగిన సంభాషణ గురించి ట్విటర్ మాధ్యమంగా జెలెన్స్కీ వెల్లడించారు. తాను మోడీతో ఫోన్లో మాట్లాడానని, జీ20 ప్రెసిడెన్సీ విజయవంతంగా సాగాలని తాను ఆకాంక్షిస్తున్నానని అన్నారు. గతంలో తాను ఇదే ప్లాట్ఫామ్ (జీ20 వేదికగా)లో శాంతి సూత్రాన్ని ప్రతిపాదించానని, దాని అమలుకు భారత్ మద్దతు ఇస్తుందని తాను ఆశిస్తున్నానన్నారు. ఈ విషయంలో తనకు భారత్ భాగస్వామ్యంపై నమ్మకం ఉందన్నారు. ఐక్యరాజ్య సమితిలో భారత్ తమకు మద్దతు తెలిపినందుకు, సంక్షోభ సమయంలో మానవతా సాయం అందించినందుకు మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. యుద్ధనేరాలకు బాధ్యులైనవారిని శిక్షించడం, ఉక్రెయిన్ నుంచి రష్యా బలగాలన్ని ఉపసంహరించడం, తమ ప్రాదేశిక సమగ్రతను పునరుద్ధరించడం వంటి 10 అంశాల శాంతి ప్రణాళికను తాను వివరించినట్లు పేర్కొన్నారు. అలాగే.. ఆహార, ఇంధన, అణు భద్రతకు భరోసాను కోరుతున్నట్లు కోరారు.
Anuraj Thakur: ఇంకా 1962లోనే ఉన్నారంటూ.. రాహుల్పై అనురాగ్ కౌంటర్
కాగా.. ఉక్రెయిన్పై ఫిబ్రవరి 24వ తేదీ నుంచి రష్యా దురాక్రమణను ప్రారంభించినప్పటి నుంచి ఆ రెండు దేశాల అధ్యక్షులతో ప్రధాని మోడీ పలుమార్లు ఫోన్లో సంభాషించారు. చర్చల ద్వారానే సమస్యలను పరిష్కరించుకొని, యుద్ధానికి స్వస్తి పలకాలని ఇరుదేశాల అధినేతల్ని సూచిస్తూ వస్తున్నారు. ఓవైపు జెలెన్స్కీ చర్చల ద్వారా ఈ యుద్ధానికి ముగింపు పలికేందుకు మొగ్గు చూపుతుంటే.. రష్యా మాత్రం ఉక్రెయిన్పై విజయం సాధించాలనే పట్టు వీడట్లేదు. ఆ దేశంపై విజయం సాధించాకే ఈ యుద్ధం ఆగుతుందని, లేదంటే ప్రపంచమే వినాశనమవుతుందని హెచ్చరికలు కూడా జారీ చేస్తోంది.
Tsrtc Discount: టీఎస్ ఆర్టీసీ బంపరాఫర్.. ఇలా చేస్తే టికెట్లపై భారీ డిస్కౌంట్..
తాజావార్తలు
-
SPIRIT Karnataka Rights : ‘స్పిరిట్’ కన్నడ రైట్స్ కొనుగోలు చేసిన బడా నిర్మాణ సంస్థ
-
‘The Hundred’లో రోహిత్ శర్మ.! MI లండన్ ఘన విజయం.!
-
Trump 200% Tariff: ట్రంప్ సంచలన నిర్ణయం.. జెనరిక్ మందులపై 200% టారిఫ్.. భారత ఫార్మా పరిశ్రమపై భారీ ప్రభావం?
-
AP Coronavirus Cases: ఏపీలో భయపెడుతోన్న కరోనా..! పర్యాటకులపై ఆంక్షలు
-
NBK : ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్కు బాలయ్య.. షూటింగ్ కు బ్రేక్
ట్రెండింగ్
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
OLED డిస్ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్టాప్లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!
-
Best Camera Phones: DSLRకు పోటీగా ఫొటోగ్రఫీ అనుభవం..! బెస్ట్ కెమెరా ఫోన్ల లిస్ట్ ఇదిగో..!
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!