Pakistan: పీఓకేలో అధిక విద్యుత్ బిల్లులు.. భారత్తో పోల్చి చూస్తున్న పాక్ ప్రజలు
Pakistan: ఆర్థిక ఇబ్బందులు, రాజకీయ సమస్యలతో పీకల్లోతు కష్టాల్లో ఉన్న దాయాది దేశం పాకిస్తాన్ లో ప్రజలు నిరసనలకు పిలుపునిచ్చారు. ఈ నిరసనలకు కారణం అధికం వస్తున్న విద్యుత్ బిల్లులే. పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే) ప్రాంతంలో మొదలైన నిరసనలు నెమ్మదిగా ఆ దేశం మొత్తం వ్యాపించాయి. ఆగస్టు 3న పీఓకేలో ప్రారంభమైన నిరసనలు పాకిస్తాన్ లోని ప్రధాన పట్టణాలు, నగరాలకు వ్యాపించాయి. ఇప్పటికే నిత్యావసరాల అధిక ధరలతో అల్లాడుతున్న ఆ దేశ ప్రజలకు ఈ కరెంట్ బిల్లులు మోయలేని భారాన్ని మోపాయి.
దీంతో పాకిస్తాన్ ప్రజలు విద్యుత్ బిల్లులు చెల్లించేది లేదని పెద్ద ఉద్యమానికి పిలుపునిచ్చారు. ప్రజలు వీధుల్లోకి వచ్చి తమ విద్యుత్ బిల్లులను తగలబెడుతున్నారు. కరెంట్ బిల్లులను చెల్లించవద్దని ప్రజలు సోషల్ మీడియాలో కోరుతున్నారు. ఇక పీఓకే ప్రాంతంలోని మసీదుల్లో లౌడ్ స్పీకర్ల ద్వారా బిల్లులు చెల్లించవద్దని పిలుపునిచ్చారు. నిరసనలు తీవ్రం కావడంతో పాకిస్తాన్ తాత్కాలిక ప్రధాని అన్వర్ ఉల్ హక్ కకర్ అత్యవసర సమావేశాన్ని నిర్వహించి 48 గంటల్లో పరిష్కార మార్గాన్ని కనుగొనాల్సిందిగా అధికారులను ఆదేశించారు.
Also Read
- Salim Dola: టర్కీలో దొరికిన దావూద్ రైట్ హ్యాండ్.. భారత్ మాస్టర్ ప్లాన్ హిట్!
- Cole Thomas Allen: సాఫ్ట్వేర్ డెవలపర్ నుంచి నాసా ఫెలో వరకు.. ట్రంప్ పార్టీలో కాల్పులకు పాల్పడిన కోల్ థామస్ అలెన్ ఎవరు?
- Terror Attack: మాలిలో భారీ ఉగ్రవాద దాడి.. రక్షణ మంత్రి హతం..
- Donald Trump: ‘‘మీకే ఎందుకు ఇలా జరుగుతోంది.?’’ కాల్పుల ఘటనపై ట్రంప్ ‘‘లింకన్’’ ఆన్సర్..
ఆర్థిక కష్టాల్లో ఉన్న 3 బిలియన్ డాలర్ల ఆర్థిక ప్యాకేజీని పొందేందుకు ఐఎంఎఫ్ విధించిన షరతులకు పాకిస్తాన్ లొంగిపోయింది. ఇందులో కరెంట్ బిల్లుల పెంపు కూడా ఉంది. దీంతో ఇప్పటికే ద్రవ్యోల్భణ సమస్యతో అక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే, పెరిగిన కరెంట్ ఛార్జీలు ప్రజలను ఆర్థికంగా దివాళా తీయిస్తున్నాయి. తమ ప్రాంతంలో 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్నప్పటికీ కోతల నుంచి ఉపశమనం లభించండం లేదని పీఓకే ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Allu Arjun: నేషనల్ క్రష్ హర్టవ్వుద్దని అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు ఇచ్చేశారా?
ఆగస్టు 3న ప్రారంభమైన ఈ నిరసనలు పాక్ వ్యాప్తంగా పీఓకే నుంచి ఖైబర్ ఫక్తుంక్వా ప్రాంతం వరకు వ్యాపించాయి. నెలసరి ఆదాయంలో 20-50 శాతం వరకు విద్యుత్ బిల్లులకే పోతుందని ప్రజలు వాపోతున్నారు. కరాచీ, గుజ్రాన్వాలా, నరోవర్, అటాక్, సర్గోదా, హరిపూర్ వంటి నగరాల్లో నిరసనలు మిన్నంటుతున్నాయి.
ఇదిలా ఉంటే పాక్ ప్రజలు సోషల్ మీడియాలో విద్యుత్ బిల్లులను షేర్ చేస్తున్నారు. భారతదేశంలో విద్యుత్ ఛార్జీలతో పోల్చి చూస్తున్నారు. ట్విట్టర్ లో వీటిని షేర్ చేస్తున్నారు. పాకిస్తాన్ లో సగటు ఒక వ్యక్తి 300 యూనిట్లకు 12,000 పాకిస్తాన్ రూపాయలను చెల్లిస్తున్నాడు. ఇదే భారత ప్రజలు కేవలం రూన. 1,300 చెల్లిస్తున్నారని సోషల్ మీడియాలో పోస్టులను వైరల్ చేస్తున్నారు. రూ. 5000 కరెంట్ బిల్లుపై పన్నులు పాకిస్తాన్ లో రూ. 1800 కాగా.. భారత్ లో ఇది రూ. 700 లే అని అక్కడి ప్రజలు పోస్టులు పెడుతున్నారు.
పాకిస్థాన్ వార్షిక ద్రవ్యోల్బణం మేలో ఆల్ టైమ్ గరిష్ట స్థాయి 37.97 శాతానికి చేరుకుంది. ఇక ఆ దేశంలోని లక్షలాది మంది స్కిల్ పుల్ యువత దేశాన్ని వదిలి వెళ్తోంది. డాక్టర్లు, ఇంజనీర్లు, ఐటీ నిపుణులు దేశాన్ని వదిలి వెళ్తున్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఐఏఎస్ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ
-
House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
-
Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
-
Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
-
Angkrish Raghuvanshi: రేర్ డిస్మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!