Jammu Kashmir: కాశ్మీర్పై ఇస్లామిక్ దేశాల ప్రేలాపన.. సొంతింటిని చక్కదిద్దుకోండని భారత్ ఘాటు సమాధానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India’s strong response to Islamic countries comments On jammu kashmir: భారత్ ఎన్నిసార్లు చెప్పినా.. ఇస్లామిక్ దేశాల సమూహం ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (ఓఐసీ) తన వక్రబుద్ధిని మానుకోవడం లేదు. పదేపదే భారత అంతర్గత విషయం అయిన జమ్మూ కాశ్మీర్ అంశంపై వ్యాఖ్యలు చేస్తూనే ఉంది. తాజాగా ఐక్యరాజ్యసమితిలో ఓఐసీ చేసిన వ్యాఖ్యలకు భారత్ ఘాటుగానే సమాధానం ఇచ్చింది. ఇస్లామిక్ దేశాలు చేస్తున్న ఆరోపణలు వాస్తవానికి దూరంగా ఉన్నాయని.. అనవసరమైన సూచనలని కొట్టి పారిసేంది ఇండియా. పాకిస్తాన్ ద్వేషపూరిత ప్రచారానికి పాల్పడుతోందని యూఎన్ లో భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
పాకిస్తాన్ ముందుగా సొంతింటిని చక్కదిద్దుకుంటే మంచిదని భారత్ హితవు పలికింది. పాకిస్తాన్ తో పాటు ఓఐసీలో 57 ముస్లిం దేశాలు సభ్యులుగా ఉన్నాయి. యూఎన్ఓలో ఓఐసీ అనవరస వ్యాఖ్యలు చేసింది. కాశ్మీర్ స్థితిని మార్చేందుకు భారత్ ఏకపక్ష చర్యలు తీసుకుంటుందని.. భారత్ కాశ్మీర్ లో జనాభాను మార్చేందుకు ప్రయత్నిస్తోందని వ్యాఖ్యానించింది. భారత వ్యతిరేక ప్రచారాన్ని ప్రారంభించేందుకు ఓఐసీని పాకిస్తాన్ వేదికగా ఉపయోగించుకుంటుందని భారత్ ఆరోపించింది.
Also Read
- Germany: జర్మనీలో దుండగుడు కాల్పులు.. ఐదుగురు మృతి
- Trump-Iran: ఇరాన్ చర్చలు కోరింది.. రేపు దోహాలో కీలక భేటీ అంటూ ట్రంప్ ప్రకటన
- France Heatwave: ఫ్రాన్స్ను హడలెత్తిస్తోన్న ఎండలు.. వెయ్యికి చేరిన మృతులు
- China: జిన్పింగ్కు సొంత సైన్యంపైనే నమ్మకం లేదా? చైనా పార్లమెంట్ నుంచి ఆరుగురు టాప్ మిలిటరీ కమాండర్ల అవుట్!
Read Also: Bhutan King: ప్రధాని మోదీతో భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్గేల్ వాంగ్చుక్ భేటీ
పాకిస్తాన్.. ప్రజల మానవహక్కులను కాపాడటంతో అధ్వాన్నమైన రికార్డ్ కలిగి ఉందని భారత్ ఘాటుగా స్పందించింది. బంగ్లాదేశ్ విభజనకు ముందు తూర్పు పాకిస్తాన్ (ఇప్పటి బంగ్లాదేశ్)లో పాకిస్తాన్ మారణహోమం సిగ్గుమాలిన చర్య అని గతాన్ని గుర్తు చేసింది. పాకిస్తాన్ మైనారిటీలను అణచి వేస్తుందని.. బలూచిస్తాన్ లో ప్రజల్ని దారుణంగా అణచివేస్తోందని భారత్ విమర్శించింది.
జమ్మూ కాశ్మీర్ ప్రాంతానికి ఉన్న ప్రత్యేక ప్రతిపత్తిని భారత్ రద్దు చేసినప్పటి నుంచి ఓఐసీ ఇలాగే భారత్ వైఖరిని విమర్శిస్తోంది. పాకిస్తాన్ చెప్పినట్లు ఇస్లామిక్ దేశాలు ఆడుతున్నాయి. గతంలో కూడా ఓఐసీ ఆర్టికల్ 370, 35 ఏ రద్దు సమయంలో ఇలాంటి వ్యాఖ్యలనే ఓఐసీ చేసింది. ఇది భారత అంతర్గత విషయం అని చాలా సార్లు ఓఐసీకి భారత్ చెప్పింది. అయినా కూడా పదేపదే కాశ్మీర్ అంశంపై ఏదో ఒక వ్యాఖ్యలు చేస్తూనే ఉంటుంది ఓఐసీ. గతంలో కాశ్మీర్ అంశంపై ఓఐసీ ‘‘ చట్టవిరుద్ధమైన ఏకపక్ష చర్య’’ అని ఆరోపించింది. యూఎన్ తీర్మాణాలకు అనుగుణంగా ఈ సమస్యను పరిష్కరించాలని అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చింది. దీన్ని ఆ సమయంలో భారత్ తీవ్రంగా ఖండించింది. ఒక దేశానికి అనుగుణంగా మతపరమైన ఎజెండాను ప్రచారం చేయడాన్ని ఓఐసీ మానుకోవాలని భారత్ హితవు పలికింది.
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!