Bhutan King: ప్రధాని మోదీతో భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్గేల్ వాంగ్చుక్ భేటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi Meets Bhutan King Jigme Khesar Namgyel Wangchuck: భారత్, భూటాన్ దేశాల మధ్య మరింతగా బంధం బలపడనుంది. భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్గేల్ వాంగ్ భారతదేశంలో పర్యటిస్తున్నారు. బుధవారం భూటాన్ రాజు వాంగ్ చుక్ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. అంతకుముందు వాంగ్ చుక్, విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రాతో భేటీ అయ్యారు. బుధవారం జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ తో కూడా భేటీ కానున్నారు వాంగ్ చుక్. మంగళవారం రోజు భూటాన్ అంతర్జాతీయ సోలార్ అలయెన్స్ ఫ్రేమ్ వర్క్ ఒప్పందాన్ని ఆమోదించింది. ఈ విషయాన్ని విదేశాంగమంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ ట్వీట్ ద్వారా తెలియజేశారు.
భారత్- భూటాన్ దేశాల మధ్య దశాబ్ధాల కాలం నుంచి సన్నిహిత, స్నేహ సంబంధాలు ఉన్నాయి. భారత్ రక్షణకు భూటాన్ కూడా కీలకంగా ఉంది. 1968 భూటాన్ రాజధాని థింపులో భారత దౌత్య కార్యాలయాన్ని ఏర్పాటు చేయడంతో ఇరు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలు మరింతగా విస్తరించాయమి. రెండు దేశాల మధ్య శాంతి నెలకొనాలని.. ఒకరి అంతర్గత వ్యవహారాల్లో ఒకరు జోక్యం చేసుకోవద్దని గతంలోొ ఒప్పందం ఉండేది.. అయితే దీన్ని 2007లో సవరించారు. భూటాన్ విదేశాంగ విధానానికి మార్గదర్శకం చేయడానికి భారతదేశాన్ని భూటాన్ అనుమతించింది. రెండు దేశాలు విదేశీ, రక్షణ వ్యవహారాల్లో సన్నిహితంగా సంప్రదించుకుంటాయి.
Also Read
- PM Modi: అబుదాబిలో మోడీకి ప్రత్యేక గౌరవం.. ఎఫ్-16 యుద్ధ విమానాలతో రక్షణ
- Bhojshala case: "భోజ్శాల ఒక దేవాలయం".. మందిర్-మసీదు కేసులో హైకోర్టు సంచలన తీర్పు..
- Keralam: మాజీ సీఎం విజయన్ను కలిసిన సతీశన్.. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చ
- PM Modi: యూఏఈపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం.. భారత్-యూఏఈ మధ్య కీలక ఒప్పందాలు
Read Also: Brahmastra: బ్రహ్మాస్త్ర ప్రమోషన్స్.. రూ.10 కోట్లు తీసుకున్న రాజమౌళి..?
భద్రత, సరిహద్దు, వాణిజ్యం, రవాణా, ఆర్థిక, జలశక్తి, నీటి వనరుల మొదలైన వారిపై భారత్, భూటాన్ మధ్య ఒప్పందాలు ఉన్నాయి. భూటాన్, భారత్ లోని నాలుగు రాష్ట్రాలతో సరిహద్దులు పంచుకుంటుంది. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ , సిక్కిం రాష్ట్రాలతో సరిహద్దు పంచుకుంటుంది. పశ్చిమ బెంగాల్ లోని సిలిగురి కారిడార్, చికెన్ నెక్ రక్షణకు భూటాన్, భారత దేశానికి అత్యంత కీలకమైనది. 22 కిలోమీటర్ల వెడల్ప ఉండే ఈ చికెన్ నెక్ ప్రాంతం ఈశాన్య రాష్ట్రాలను ఇతర భారతదేశంతో కలుపుతోంది. బంగ్లాదేశ్, నేపాల్ దేశాలు కూడా ఈ చికెన్ నెక్ కు సరిహద్దుల్లోనే ఉన్నాయి.
గతంలో డోక్లామ్ సరిహద్దు వివాదంలో చైనాకు భారత బలగాలు ఎదురొడ్డి నిలుచున్నాయి. కొన్ని రోజులు పాటు చైనా- ఇండియా బలగాలు ఎదురెదురుగా మోహరించాయి. 1972 నుంచి భూటన్ కు భారత్ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. ఇప్పటికే భారత్, భూటాన్ దేశానికి మూడు జలవిద్యుత్ ప్రాజెక్టులను నిర్మించి ఇచ్చింది. వ్యాక్సిన్ మైత్రిలో భాగంగా భారత్ నుంచి కోవిడ్ వ్యాక్సిన్ స్వీకరించిన మొదటి దేశం భూటానే. తాజాగా భూటాన్ రాజు భారత పర్యటన చాలా కీలకంగా మారింది. ఇరు దేశాల మధ్య మరిన్ని దైపాక్షిక ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
PM Modi: అబుదాబిలో మోడీకి ప్రత్యేక గౌరవం.. ఎఫ్-16 యుద్ధ విమానాలతో రక్షణ
-
Bhojshala case: “భోజ్శాల ఒక దేవాలయం”.. మందిర్-మసీదు కేసులో హైకోర్టు సంచలన తీర్పు..
-
Keralam: మాజీ సీఎం విజయన్ను కలిసిన సతీశన్.. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చ
-
Film Chamber Meeting : ‘పెద్ది’ సినిమాకు లైన్ క్లియర్: థియేటర్ల వివాదంపై తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం!
-
Alia Bhatt :కేన్స్లో అలియాను పట్టించుకోలేదా..?
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!