Bhutan King: ప్రధాని మోదీతో భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్గేల్ వాంగ్చుక్ భేటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi Meets Bhutan King Jigme Khesar Namgyel Wangchuck: భారత్, భూటాన్ దేశాల మధ్య మరింతగా బంధం బలపడనుంది. భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్గేల్ వాంగ్ భారతదేశంలో పర్యటిస్తున్నారు. బుధవారం భూటాన్ రాజు వాంగ్ చుక్ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. అంతకుముందు వాంగ్ చుక్, విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రాతో భేటీ అయ్యారు. బుధవారం జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ తో కూడా భేటీ కానున్నారు వాంగ్ చుక్. మంగళవారం రోజు భూటాన్ అంతర్జాతీయ సోలార్ అలయెన్స్ ఫ్రేమ్ వర్క్ ఒప్పందాన్ని ఆమోదించింది. ఈ విషయాన్ని విదేశాంగమంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ ట్వీట్ ద్వారా తెలియజేశారు.
భారత్- భూటాన్ దేశాల మధ్య దశాబ్ధాల కాలం నుంచి సన్నిహిత, స్నేహ సంబంధాలు ఉన్నాయి. భారత్ రక్షణకు భూటాన్ కూడా కీలకంగా ఉంది. 1968 భూటాన్ రాజధాని థింపులో భారత దౌత్య కార్యాలయాన్ని ఏర్పాటు చేయడంతో ఇరు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలు మరింతగా విస్తరించాయమి. రెండు దేశాల మధ్య శాంతి నెలకొనాలని.. ఒకరి అంతర్గత వ్యవహారాల్లో ఒకరు జోక్యం చేసుకోవద్దని గతంలోొ ఒప్పందం ఉండేది.. అయితే దీన్ని 2007లో సవరించారు. భూటాన్ విదేశాంగ విధానానికి మార్గదర్శకం చేయడానికి భారతదేశాన్ని భూటాన్ అనుమతించింది. రెండు దేశాలు విదేశీ, రక్షణ వ్యవహారాల్లో సన్నిహితంగా సంప్రదించుకుంటాయి.
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
- UP: ‘నాకు విడాకులు ఇచ్చేయండి’.. ఓ వింతైన కారణంతో కోర్టుకెళ్లిన నూతన వధువు
- INIDIA alliance: ఇండియా కూటమి సమావేశానికి విజయ్ పార్టీకి నో ఎంట్రీ.. కాంగ్రెస్ చెప్పిన కారణం ఇదే!
Read Also: Brahmastra: బ్రహ్మాస్త్ర ప్రమోషన్స్.. రూ.10 కోట్లు తీసుకున్న రాజమౌళి..?
భద్రత, సరిహద్దు, వాణిజ్యం, రవాణా, ఆర్థిక, జలశక్తి, నీటి వనరుల మొదలైన వారిపై భారత్, భూటాన్ మధ్య ఒప్పందాలు ఉన్నాయి. భూటాన్, భారత్ లోని నాలుగు రాష్ట్రాలతో సరిహద్దులు పంచుకుంటుంది. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ , సిక్కిం రాష్ట్రాలతో సరిహద్దు పంచుకుంటుంది. పశ్చిమ బెంగాల్ లోని సిలిగురి కారిడార్, చికెన్ నెక్ రక్షణకు భూటాన్, భారత దేశానికి అత్యంత కీలకమైనది. 22 కిలోమీటర్ల వెడల్ప ఉండే ఈ చికెన్ నెక్ ప్రాంతం ఈశాన్య రాష్ట్రాలను ఇతర భారతదేశంతో కలుపుతోంది. బంగ్లాదేశ్, నేపాల్ దేశాలు కూడా ఈ చికెన్ నెక్ కు సరిహద్దుల్లోనే ఉన్నాయి.
గతంలో డోక్లామ్ సరిహద్దు వివాదంలో చైనాకు భారత బలగాలు ఎదురొడ్డి నిలుచున్నాయి. కొన్ని రోజులు పాటు చైనా- ఇండియా బలగాలు ఎదురెదురుగా మోహరించాయి. 1972 నుంచి భూటన్ కు భారత్ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. ఇప్పటికే భారత్, భూటాన్ దేశానికి మూడు జలవిద్యుత్ ప్రాజెక్టులను నిర్మించి ఇచ్చింది. వ్యాక్సిన్ మైత్రిలో భాగంగా భారత్ నుంచి కోవిడ్ వ్యాక్సిన్ స్వీకరించిన మొదటి దేశం భూటానే. తాజాగా భూటాన్ రాజు భారత పర్యటన చాలా కీలకంగా మారింది. ఇరు దేశాల మధ్య మరిన్ని దైపాక్షిక ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: అందరి చూపు వైభవ్ సూర్యవంశీపైనే.. మరో విధ్వంసానికి సిద్ధమైన వండర్ కిడ్!
-
Peddi Collections : 300 కోట్లకు చేరువలో… వర్కింగ్ డేలో ‘పెద్ది’ కలెక్షన్ల ఊచకోత
-
NANI : ప్యారడైజ్ ఆగస్టు రిలీజ్ పోస్ట్ పోన్.. న్యూ రిలీజ్ డేట్ ఎప్పుడంటే
-
BCCI Selection Controversy: హర్షిత్ రాణాను ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారు.. బీసీసీఐ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిందా?
-
Magudam : డైరెక్టర్ గా విశాల్… 30 ఏళ్ల తరువాత తీరనున్న కల
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!