Pakistan: 80 విమానాలతో భారత్ దాడి, రైలు హైజాక్లో ప్రమేయం.. పాక్ ప్రధాని అబద్ధాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడిన పాకిస్తాన్గా భారత్ తగిన గుణపాఠం చెప్పింది. ‘‘ఆపరేషన్ సిందూర్’’తో ఉగ్రవాదుల్ని, దాని మద్దతుదారుల్ని భారత సైన్యం హడలెత్తించింది. పీఓకే, పాక్ పంజాబ్ ప్రావిన్సుల్లో 09 ఉగ్ర స్థావరాలపై భారీ దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో 100 మంది వరకు ఉగ్రవాదులు హతమయ్యారు. ఒక్కసారిగా భారత్ విరుచుకుపడటంతో పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టింది.
ఇదిలా ఉంటే, ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పాక్ ప్రజల్ని ఉద్దేశించి జాతీయ అసెంబ్లీలో బుధవారం మాట్లాడారు. భారత దాడిని పిరికి చర్యగా అభివర్ణించారు. భారత సైన్యం దాడికి పాక్ సైన్యం తగిన జవాబు ఇచ్చిందని యథావిధిగా మరోసారి పాకిస్తాన్ అబద్ధాలను ప్రచారం చేసింది. భారత్ పూర్తి సన్నద్ధతతో 80 విమనాలతో దాడి చేసిందని పాక్ ప్రధాని ఆరోపించారు. భారత్ విమానాలు పాకిస్తాన్పై దాడి చేస్తాయని మాకు ముందు నుంచి సమాచారం అందుతోందని, భారత్ ఇటీవల ఫ్రాన్స్ నుంచి 26 రాఫెల్ విమానాలు కొనుగోలు ఒప్పందాన్ని కూడా షహబాజ్ షరీఫ్ ప్రస్తావించారు.
Also Read
Read Also: Indo-Pak: బార్డర్లో పాక్ ఆర్మీ విచక్షణారహిత కాల్పులు.. 15 మంది భారతీయ పౌరులు మృతి!
భారత్ ఎలాంటి ఆధారాలు లేకుండా పహల్గామ్ ఉగ్రదాడికి పాకిస్తాన్ని నిందించారని, దేవుడిని తప్పా ఈ సంఘటనలో పాక్ ప్రమేయం ఉందని ప్రపంచాన్ని నమ్మించేందుకు భారత్ ప్రయత్నించిందని అన్నారు. భారత దాడికి ప్రతీకారం తీర్చుకునే హక్కు పాకిస్తాన్కి ఉందని అన్నారు. రెండు నెలల క్రితం బలూచిస్తాన్లో జరిగిన జాఫర్ ఎక్స్ప్రెస్ హైజాక్లో భారత ప్రమేయం ఉందని ఆరోపించారు. దీనికి సంబంధించిన ఆధారాలు మా వద్ద ఉన్నయని పాక్ ప్రధాని చెప్పారు.
భారత క్షిపణి దాడుల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయారని పాక్ ప్రధాని మరోసారి అబద్ధాలను ప్రచారం చేశారు. దీనికి ప్రతిస్పందనగా పాక్ వైమానిక దళం భారత10 విమానాలను కూల్చివేసిందని అన్నారు. పాకిస్తాన్ సాయుధ దళాలు భారతదేశానికి తగిన జవాబు ఇచ్చాయని, చీకటి రాత్రిని మెరుపు రాత్రిగా మార్చాయని షెహబాజ్ షరీఫ్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Pawan Kalyan : ఓవర్ స్పీడ్లో దూసుకెళ్తున్న OG 2
-
Team India: పసికూన ఎంత పనిచేసే.. 1050 రోజుల తర్వాత టీమిండియాకు షాక్.. అజేయ పరంపరకు బ్రేక్!
-
NBK 111 : బాలయ్య సినిమా డిసెంబర్ లేదా సంక్రాంతి రిలీజ్ ఫిక్స్
-
WhatsApp New Feature: వాట్సాప్ వినియోగదారులకు గుడ్న్యూస్.. మరో స్మార్ట్ ఫీచర్.. మరింత భద్రత..
-
Kalki 2898 AD: నాగ్ అశ్విన్ కు ‘నో’ చెప్పిన కీర్తి సురేశ్.. ‘బుజ్జి’ వెనుక ఇంత పెద్ద కథ ఉందా?
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!