Zelensky: వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో ఉక్రెయిన్ అధ్యక్షుడి శాంతి సందేశం.. “నో” చెప్పిన ఫిఫా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
FIFA Rejects Ukrainian President Zelensky’s Peace Message: ఖతార్ వేదికగా ఫిఫా వరల్డ్ కప్ 2022 మ్యాచులు జరగుతున్నాయి. ఆదివారం అర్జెంటీనా, ఫ్రాన్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అయితే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచును తన శాంతి సందేశం కోసం వేదిక చేసుకోవాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలన్స్కీ భావించాడు. అయితే ఇందుకు ఫిఫా నిర్వాహకుల నో చెప్పినట్లు తెలిసింది. ఫైనల్ మ్యాచుకు ముందు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తన సందేశాన్ని వినిపించాలని జెలన్స్కీ భావించాడు. ఫిఫా వరల్డ్ కప్ వేదికగా ఎక్కువ ప్రయోజనం పొందాలని రష్యా దురాక్రమణను ఎండగట్టాలని జెలన్ స్కీ భావిస్తున్నాడు. అయితే ఫిఫా నిర్వాహకులు, ఉక్రెయిన్ మధ్య చర్చలు జరుగుతున్నట్లు తెలిసింది. రేపు జరగబోయే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచును ప్రపంచంలో కొన్ని కోట్ల మంది వీక్షిస్తారు. దీని ద్వారా రష్యా, ఉక్రెయిన్ పై చేస్తున్న దాడులను ప్రపంచం దృష్టికి తీసుకెళ్లేందుకు జెలన్ స్కీ భావిస్తున్నారు. అయితే ఫిఫా మాత్రం రాజకీయ సందేశాలకు దూరంగా ఉండాలనే నియమాలను కలిగి ఉంది.
Read Also: Yogi Adityanath: రాహుల్ గాంధీ నీ వ్యాఖ్యలకు సిగ్గుపడు..
Also Read
- Donald Trump: ట్రంప్ గోల్ఫ్ కోర్స్ సమీపంలో లోడెడ్ గన్తో వ్యక్తి అరెస్ట్.. మరో హత్యాయత్నం కుట్రపై అనుమానాలు?
- India Flagged Cargo Ship Attack: యెమెన్ తీరంలో భారత కార్గో నౌకపై దాడి.. ఘటన సమయంలో 14 మంది సిబ్బంది..!
- Country Name Changed: తమ దేశం పేరు మార్చుకున్న ‘నౌరు’.. కొత్త పేరు ఇదే..
- US-Iran: హార్ముజ్ తెరుచుకుంటుందా? అమెరికా కీలక ప్రకటన
ఈ ఏడాది ఫిబ్రవరిలో రష్యా, ఉక్రెయిన్ పై యుద్దం చేస్తోంది. ఇప్పటికే ఉక్రెయిన్ దాదాపుగా సర్వనాశనం అయింది. అక్కడి ప్రజలు బిక్కబిక్కుమంటూ బతుకుతున్నారు. పాశ్చాత్య దేశాలు ఇచ్చే ఆర్థిక, సైనిక వ్యూహాలతో ఉక్రెయిన్ బలమైన రష్యాను అడ్దుకుంటూ వస్తోంది. ముఖ్యంగా అమెరికా నేతృత్వంలోని నాటో ఉక్రెయిన్ కు అండగా నిలుస్తోంది. ఇప్పటికే రష్యా దాడుల్లో రాజధాని కీవ్ తో పాటు ఖార్కీవ్, సుమీ, మరియోపోల్, ఎల్వీవ్ వంటి నగరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇదిలా ఉంటే చర్చలకు సిద్ధంగా ఉన్నామని రష్యా ప్రకటిస్తున్నా.. ఉక్రెయిన్ మాత్రం పుతిన్ అధ్యక్షుడిగా ఉన్నంత కాలం చర్యలు జరిపేది లేదంటోంది.
తాజాగా శుక్రవారం రష్యా, ఉక్రెయిన్ పై క్షిపణులతో విరుచుకుపడింది. 70 కన్నా ఎక్కువ క్షిపణులను రష్యా ప్రయోగించింది. కీవ్ తో పాటు పలు నగరాలు దెబ్బతిన్నాయి. కీవ్ లో విద్యుత్ వ్యవస్థలు, నీటి సరఫరా వ్యవస్థ దెబ్బతింది. చలికాలాన్ని టార్గెట్ చేసుకుని ఉక్రెయిన్ విద్యుత్ వ్యవస్థలను నాశనం చేస్తోంది రష్యా. ఇదిలా ఉంటే శనివారం రాజధాని కీవ్ లో విద్యుత్ వ్యవస్థను పునరుద్ధరించింది ఉక్రెయిన్.
తాజావార్తలు
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
Abdullah Shafique: 49 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. విండీస్ గడ్డపై పాకిస్థాన్ ప్లేయర్ చారిత్రాత్మక రికార్డు..
-
SpaceX Rocket Moon Crash: గంటకు 8,690 కి.మీ వేగంతో.. చంద్రుడిని ఢీకొట్టనున్న SpaceX రాకెట్..!
-
Tragedy News: స్నేహం, పెళ్లి, కోపం.. చివరికి నదిలోకి తోసి ప్రాణాలు తీసిన యువకుడు!
-
Aqua Farmers: ఆక్వా రైతులకు ఊరట.. రూ.1.50కే విద్యుత్ సరఫరా!
ట్రెండింగ్
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?