Israel-Hamas War: ఇజ్రాయిల్ ఆర్మీని ‘ఉగ్ర సంస్థ’గా గుర్తించాలి.. ముస్లిం దేశాలకు ఇరాన్ పిలుపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel-Hamas War: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో ఈ రోజు సౌదీ అరేబియా వేదికగా ఇస్లామిక్ దేశాలు సమావేశమయ్యాయి. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేటివ్(ఓఐసీ) రియాద్ శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయిల్, పాలస్తీనాపై జరుపుతున్న దాడిపై ఈ దేశాలు చర్చించాయి. గాజా స్ట్రిప్ లో ప్రస్తుత యుద్ధం గురించి మాట్లాడుతూ.. ఇజ్రాయిల్ ఆర్మీని ‘‘ఉగ్రవాద సంస్థ’’గా ప్రకటించాలని ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ శనివారం ఇతర ఇస్లామిక్ దేవఆలకు పిలుపునిచ్చారు.
Read Also: Israel-Hamas War: అంధకారంలో గాజాలోని అతిపెద్ద ఆస్పత్రి.. మరణం అంచున శిశువులు..
Also Read
- Netanyahu vs Erdogan: ఇజ్రాయెల్-టర్కీ మధ్య మాటల యుద్ధం.. మధ్యప్రాచ్యంలో కొత్త టెన్షన్!
- Sri Lanka: ఈస్టర్ బాంబు దాడి వెనుక కుట్ర.. శ్రీలంక మాజీ అధ్యక్షుడు, స్పై చీఫ్పై సంచలన ఆరోపణలు
- Trump-Iran: పశ్చిమాసియా రౌడీ చనిపోయాడు.. ఇరాన్పై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు
- Pakistan: పాకిస్తాన్పై మీర్పూరీ ముస్లింల తిరుగుబాటు..
హమాస్ ఉగ్రసంస్థపై ఇజ్రాయిల్ పోరు సాగిస్తున్న నేపథ్యంలో గాజాలో వేల సంఖ్యలో ప్రజలు చనిపోతుండటంపై ముస్లిం దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కాల్పుల విరమణకు పిలుపునిస్తున్నాయి. ముఖ్యంగా ఇజ్రాయిల్ తీరును ఇరాన్ తీవ్రంగా ఖండిస్తోంది. అయితే ఉప్పు నిప్పులా ఉంటే ఇరాన్, సౌదీ దేశాలు ఈ యుద్ధం నేపథ్యంలో చర్చల్లో పాల్గొన్నాయి. మార్చి నెలలో ఇరు దేశాలు కూడా సంబంధాల్ని పునరుద్ధరించుకోవాలని అంగీకరించిన తర్వాత తొలిసారిగా ఇరాన్ అధ్యక్షుడు రైసీ, సౌదీకి వెళ్లారు. ఇజ్రాయిల్ తో సంబంధాలు ఉన్న దేశాలు వాటిని తెంచుకోవాలని ఇరాన్ సూచించింది. ఇస్లామిక్ దేశాలు జియోనిస్ట్ పాలన(ఇజ్రాయిల్)తో ఎలాంటి రాజకీయ, ఆర్థిక సంబంధాలను తెంచుకోవాలని పిలుపునిచ్చింది. ఇంధన రంగంలో వాణిజ్య బహిష్కరణ అమలు చేయాలని రైసీ సూచించారు. ఇజ్రాయిల్కి మద్దతుగా వ్యవహరిస్తున్న అమెరికాపై ఇరాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇదిలా ఉంటే ఇజ్రాయిల్ మాత్రం హమాస్, లెబనాన్ లోని హిజ్బుల్లా మిలిటెంట్లకు ఇరాన్ మద్దతు ఇస్తుందని, ఇరాన్ ప్రాక్సీలుగా ఇవి వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. అక్టోబర్7న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్ పై దాడి చేయడంతో ఈ యుద్ధం ప్రారంభమైంది. హమాస్ దాడిలో 1400 మంది ఇజ్రాయిలీలు మరణించారు. అప్పటి నుంచి ఇజ్రాయిల్ గాజా స్ట్రిప్పై దాడి చేస్తోంది. ఈ దాడుల్లో హమాస్ ఉగ్రవాదులతో సహా సాధారణ పాలస్తీనియన్లు మరణిస్తున్నారు. 11000 మంది చనిపోయారు.
తాజావార్తలు
-
APL 2026: బోణీ కొట్టిన అమరావతి రాయల్స్.. 6 వికెట్ల తేడాతో విజయం
-
Vaibhav Sooryavanshi: ‘వైభవ్ సూర్యవంశీ ఆడటం చాలా కష్టం.. నాకు నమ్మకం లేదు’.. సంచలన వ్యాఖ్యలు..
-
PM Modi: అది ‘‘హిందూ గ్రోత్ రేట్’’ కాదు, ‘‘కాంగ్రెస్ గ్రోత్ రేట్’’
-
Gurnoor Brar: 17 ఏళ్ల వయసులో క్రికెట్ ప్రారంభం.. 9 ఏళ్ల కష్టానికి టీమిండియా పిలుపు..
-
Rao Bahadur Teaser: ఈసారి సత్యదేవ్ కొట్టేలా ఉన్నాడు.. ‘రావు బహదూర్’ టీజర్ డేట్ ఫిక్స్.. రిలీజ్ డేట్ అప్పుడే!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!