Israel-Hamas War: ఇజ్రాయిల్ ఆర్మీని ‘ఉగ్ర సంస్థ’గా గుర్తించాలి.. ముస్లిం దేశాలకు ఇరాన్ పిలుపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel-Hamas War: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో ఈ రోజు సౌదీ అరేబియా వేదికగా ఇస్లామిక్ దేశాలు సమావేశమయ్యాయి. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేటివ్(ఓఐసీ) రియాద్ శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయిల్, పాలస్తీనాపై జరుపుతున్న దాడిపై ఈ దేశాలు చర్చించాయి. గాజా స్ట్రిప్ లో ప్రస్తుత యుద్ధం గురించి మాట్లాడుతూ.. ఇజ్రాయిల్ ఆర్మీని ‘‘ఉగ్రవాద సంస్థ’’గా ప్రకటించాలని ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ శనివారం ఇతర ఇస్లామిక్ దేవఆలకు పిలుపునిచ్చారు.
Read Also: Israel-Hamas War: అంధకారంలో గాజాలోని అతిపెద్ద ఆస్పత్రి.. మరణం అంచున శిశువులు..
Also Read
- Asim Munir: అసిమ్ మునీర్ టెహ్రాన్ పర్యటన ఆకస్మిక రద్దు.. కారణమిదే!
- Unknown Gunmen: పాకిస్తాన్లో ‘‘ధురంధరులు’’.. 5 ఏళ్లలో 26 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు హతం..
- Giorgia Meloni: మెలోని పెళ్లెందుకు చేసుకోలేదు.. మెలోడీ వీడియో వైరల్ తర్వాత నెట్టింట తీవ్ర చర్చ
- International Tea Day: మీరు ప్రతిరోజూ తాగే చాయ్ నిజంగా ఆరోగ్యకరమేనా..?
హమాస్ ఉగ్రసంస్థపై ఇజ్రాయిల్ పోరు సాగిస్తున్న నేపథ్యంలో గాజాలో వేల సంఖ్యలో ప్రజలు చనిపోతుండటంపై ముస్లిం దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కాల్పుల విరమణకు పిలుపునిస్తున్నాయి. ముఖ్యంగా ఇజ్రాయిల్ తీరును ఇరాన్ తీవ్రంగా ఖండిస్తోంది. అయితే ఉప్పు నిప్పులా ఉంటే ఇరాన్, సౌదీ దేశాలు ఈ యుద్ధం నేపథ్యంలో చర్చల్లో పాల్గొన్నాయి. మార్చి నెలలో ఇరు దేశాలు కూడా సంబంధాల్ని పునరుద్ధరించుకోవాలని అంగీకరించిన తర్వాత తొలిసారిగా ఇరాన్ అధ్యక్షుడు రైసీ, సౌదీకి వెళ్లారు. ఇజ్రాయిల్ తో సంబంధాలు ఉన్న దేశాలు వాటిని తెంచుకోవాలని ఇరాన్ సూచించింది. ఇస్లామిక్ దేశాలు జియోనిస్ట్ పాలన(ఇజ్రాయిల్)తో ఎలాంటి రాజకీయ, ఆర్థిక సంబంధాలను తెంచుకోవాలని పిలుపునిచ్చింది. ఇంధన రంగంలో వాణిజ్య బహిష్కరణ అమలు చేయాలని రైసీ సూచించారు. ఇజ్రాయిల్కి మద్దతుగా వ్యవహరిస్తున్న అమెరికాపై ఇరాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇదిలా ఉంటే ఇజ్రాయిల్ మాత్రం హమాస్, లెబనాన్ లోని హిజ్బుల్లా మిలిటెంట్లకు ఇరాన్ మద్దతు ఇస్తుందని, ఇరాన్ ప్రాక్సీలుగా ఇవి వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. అక్టోబర్7న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్ పై దాడి చేయడంతో ఈ యుద్ధం ప్రారంభమైంది. హమాస్ దాడిలో 1400 మంది ఇజ్రాయిలీలు మరణించారు. అప్పటి నుంచి ఇజ్రాయిల్ గాజా స్ట్రిప్పై దాడి చేస్తోంది. ఈ దాడుల్లో హమాస్ ఉగ్రవాదులతో సహా సాధారణ పాలస్తీనియన్లు మరణిస్తున్నారు. 11000 మంది చనిపోయారు.
తాజావార్తలు
-
RG Kar Case: ఆర్జీకర్ కేసులో ట్విస్ట్.. మళ్లీ దర్యాప్తుకు హైకోర్టు ఆదేశం
-
GT vs CSK: టాస్ గెలిచిన రుతురాజ్ గైక్వాడ్.. గిల్ సేనకు మొదట బ్యాటింగ్ సవాల్..
-
Twisha Sharma: తెలుగు నటి ట్విషా శర్మ మృతి కేసులో అత్త గారికి ప్రభుత్వం షాక్.. కీలక పదవి నుంచి తొలగింపు
-
Summer Tips: ఎండ నుంచి వచ్చాక వెంటనే ఐస్ వాటర్ తాగుతున్నారా? ప్రమాదం ఇదే
-
Sai Sudharsan: చిన్నప్పుడు రోడ్డుపై ఆ జట్టును చూసేవాడిని.. ఇప్పుడు అదే జట్టుపై రికార్డులు: సాయి సుదర్శన్
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!