Israel-Hamas War: అంధకారంలో గాజాలోని అతిపెద్ద ఆస్పత్రి.. మరణం అంచున శిశువులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel-Hamas War: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం గాజాను అంధకారంలో పడేసింది. హమాస్ మిలిటెంట్లపై ఇజ్రాయిల్ దాడులు అక్కడి సాధారణ ప్రజానీకాన్ని కష్టాలపాలు చేస్తోంది. ఇదిలా ఉంటే ఇజ్రాయిల్ వరసగా దాడులను తీవ్రతరం చేయడంతో గాజాలోని అతిపెద్ద ఆస్పత్రిలో సేవలు స్తంభించాయి. గాజాలోని అతిపెద్ద ఆస్పత్రైన అల్ షిఫా మెడికల్ కాంప్లెక్స్పై ఇజ్రాయిల్ దాడి చేసిందని హమాస్ ఆధ్వర్యంలోని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇంధనం లేక చివరి జనరేటర్ కూడా నిలిచిపోయిందని ఓ పసికందు సహా ఐదుగురు రోగులు ప్రాణాలు కోల్పోయినట్లు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
అల్ షిఫా ఆస్పత్రి కింద హమాస్ ఉగ్రవాదులు కమాండ్ సెంటర్ ఉన్నట్లు ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆ ఆస్పత్రిని ఇజ్రాయిల్ టార్గెట్ చేస్తోంది. హమాస్ని ఎదుర్కోవాలంటే ఆస్పత్రులను ఖాళీ చేయాల్సిందే అని, ఆస్పత్రులను పటిష్ట స్థానాలుగా చేసుకుని హమాస్ దాడులకు పాల్పడుతోందని ఇజ్రాయిల్ సైన్యం వెల్లడించింది. ఐడీఎఫ్ ఏదో సమయంలో గాజాలోని ఆస్పత్రుల్లోకి ప్రవేశించే అవకాశం ఉందని తెలుస్తోంది.
Also Read
- China: కొత్త గేమ్కి రెడీ అవుతున్న చైనా.. ప్రపంచానికి షాక్ తప్పదా?
- Israel-Iran: పర్వతం కింద అణు పదార్థం.. ఇరాన్పై ఇజ్రాయిల్ సంచలన రిపోర్ట్..
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై భారత్ కీలక నిర్ణయం.. పాక్కు స్పష్టమైన సందేశం..
- Crude Oil Prices: మరో షాక్.. హార్మూజ్ తర్వాత కొత్త సంక్షోభం.. ముడి చమురు ధరలు భారీగా పెరుగుతాయా..?
Read Also: Sunil : మలయాళ నక్క తోక తొక్కిన సునీల్..
ఇదిలా ఉంటే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులు ఈ దాడుల వల్ల తీవ్రంగా ప్రభావితం అవుతున్నారు. ఇంధన అయిపోవడంతో ఆస్పత్రి కార్యకలాపాలు నిలిచిపోయాయని, ఇంక్యుబేటర్ లో ఉన్న ఒక శిశువుతో మరణించిందని, మరో 45 మంది పిల్లలు ఉన్నట్లు హమాస్ నేతృత్వంలోని ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయితే పాలస్తీనా వెస్ట్ బ్యాంక్ లోని పాలస్తీనా హెల్త్ మినిస్ట్రీ ప్రకారం.. ఆస్పత్రిలో 39 మంది శిశువుల ప్రాణాలు రిస్కులో ఉన్నట్లు తెలిపింది. ఆక్సిజన్, మందులు అందకపోవడం, కరెంట్ లేకపోవడంతో వారు చనిపోయే అవకాశం ఉందని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడిగా ఓ ప్రకటనలో తెలిపింది.
అక్టోబర్ 7న గాజాలోని హమాస్ టెర్రరిస్టులు ఇజ్రాయిల్ పై దాడి చేసి 1400 మందిని చంపేశారు. మరో 200 మందిని బందీలుగా గాజాలోకి పట్టుకెళ్లారు. అప్పటి నుంచి ఇజ్రాయిల్ గాజాస్ట్రిప్ పై భీకర దాడులు చేస్తోంది. మొదట వైమానిక దాడులకే పరిమితమైనప్పటికీ.. ప్రస్తుతం గాజాలోకి చొచ్చుకెళ్లి భూతల దాడులు చేస్తోంది. ప్రస్తుతం ఇజ్రాయిల్ ప్రపంచంలో ఏ దేశం చెప్పినా వినే పరిస్థితిలో లేదు. హమాస్ పూర్తిగా అంతమైన తర్వాతే యుద్ధం ముగుస్తుందని ఇజ్రాయిల్ స్పష్టంగా తెలిపింది.
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!