Israel-Hamas War: అంధకారంలో గాజాలోని అతిపెద్ద ఆస్పత్రి.. మరణం అంచున శిశువులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel-Hamas War: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం గాజాను అంధకారంలో పడేసింది. హమాస్ మిలిటెంట్లపై ఇజ్రాయిల్ దాడులు అక్కడి సాధారణ ప్రజానీకాన్ని కష్టాలపాలు చేస్తోంది. ఇదిలా ఉంటే ఇజ్రాయిల్ వరసగా దాడులను తీవ్రతరం చేయడంతో గాజాలోని అతిపెద్ద ఆస్పత్రిలో సేవలు స్తంభించాయి. గాజాలోని అతిపెద్ద ఆస్పత్రైన అల్ షిఫా మెడికల్ కాంప్లెక్స్పై ఇజ్రాయిల్ దాడి చేసిందని హమాస్ ఆధ్వర్యంలోని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇంధనం లేక చివరి జనరేటర్ కూడా నిలిచిపోయిందని ఓ పసికందు సహా ఐదుగురు రోగులు ప్రాణాలు కోల్పోయినట్లు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
అల్ షిఫా ఆస్పత్రి కింద హమాస్ ఉగ్రవాదులు కమాండ్ సెంటర్ ఉన్నట్లు ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆ ఆస్పత్రిని ఇజ్రాయిల్ టార్గెట్ చేస్తోంది. హమాస్ని ఎదుర్కోవాలంటే ఆస్పత్రులను ఖాళీ చేయాల్సిందే అని, ఆస్పత్రులను పటిష్ట స్థానాలుగా చేసుకుని హమాస్ దాడులకు పాల్పడుతోందని ఇజ్రాయిల్ సైన్యం వెల్లడించింది. ఐడీఎఫ్ ఏదో సమయంలో గాజాలోని ఆస్పత్రుల్లోకి ప్రవేశించే అవకాశం ఉందని తెలుస్తోంది.
Also Read
- Kohinoor: ఈ వజ్రం కోసం యుద్ధాలు ఎందుకు జరిగాయి? శతాబ్దాలుగా వీడని మిస్టరీ!
- PoK Protests: "మాకు పాకిస్థాన్ వద్దు.. భారత్ను సహాయం కోరుతాం!".. PoK నిరసనకారులు తీవ్ర వ్యాఖ్యలు!
- Pakistan-Afghanistan: పాక్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం.. పాకిస్థాన్పై ఆఫ్ఘనిస్థాన్ డ్రోన్ దాడులు!
- Europe Heatwave: బాబోయ్ ఎండలు.. కరిగిపోతున్న రహదారులు
Read Also: Sunil : మలయాళ నక్క తోక తొక్కిన సునీల్..
ఇదిలా ఉంటే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులు ఈ దాడుల వల్ల తీవ్రంగా ప్రభావితం అవుతున్నారు. ఇంధన అయిపోవడంతో ఆస్పత్రి కార్యకలాపాలు నిలిచిపోయాయని, ఇంక్యుబేటర్ లో ఉన్న ఒక శిశువుతో మరణించిందని, మరో 45 మంది పిల్లలు ఉన్నట్లు హమాస్ నేతృత్వంలోని ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయితే పాలస్తీనా వెస్ట్ బ్యాంక్ లోని పాలస్తీనా హెల్త్ మినిస్ట్రీ ప్రకారం.. ఆస్పత్రిలో 39 మంది శిశువుల ప్రాణాలు రిస్కులో ఉన్నట్లు తెలిపింది. ఆక్సిజన్, మందులు అందకపోవడం, కరెంట్ లేకపోవడంతో వారు చనిపోయే అవకాశం ఉందని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడిగా ఓ ప్రకటనలో తెలిపింది.
అక్టోబర్ 7న గాజాలోని హమాస్ టెర్రరిస్టులు ఇజ్రాయిల్ పై దాడి చేసి 1400 మందిని చంపేశారు. మరో 200 మందిని బందీలుగా గాజాలోకి పట్టుకెళ్లారు. అప్పటి నుంచి ఇజ్రాయిల్ గాజాస్ట్రిప్ పై భీకర దాడులు చేస్తోంది. మొదట వైమానిక దాడులకే పరిమితమైనప్పటికీ.. ప్రస్తుతం గాజాలోకి చొచ్చుకెళ్లి భూతల దాడులు చేస్తోంది. ప్రస్తుతం ఇజ్రాయిల్ ప్రపంచంలో ఏ దేశం చెప్పినా వినే పరిస్థితిలో లేదు. హమాస్ పూర్తిగా అంతమైన తర్వాతే యుద్ధం ముగుస్తుందని ఇజ్రాయిల్ స్పష్టంగా తెలిపింది.
తాజావార్తలు
-
Samantha vs Naga Chaitanya : సామ్ vs చై.. ఇప్పుడెందుకీ రచ్చ?
-
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
-
APEAPCET: ఏపీఈఏపీసెట్ ఫలితాలు విడుదల
-
RC18: గురువు తర్వాత శిష్యుడే.. రామ్ చరణ్ మాటతో భారీ అడ్వాన్స్ ఇచ్చిన టాప్ ప్రొడ్యూసర్!
-
Kejriwal: సనాతనం అంటే అధికారం.. డబ్బేనా? అయోధ్య స్కామ్లో బీజేపీపై కేజ్రీవాల్ విమర్శలు
ట్రెండింగ్
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..