Vikarabad murder: మర్డర్ మిస్టరీ.. అర్ధనగ్నంగా మహిళ మృతదేహం
- అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
- కల్లుకాంపౌండ్ పక్కనే మృతదేహం
Vikarabad murder: వికారాబాద్ జిల్లా మాదారంలో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కల్లుకాంపౌండ్ పక్కనే అర్ధనగ్నంగా పడి ఉండడం కలకలం రేపుతోంది. అక్కడ ఎలాంటి సీసీ కెమెరాలు లేకపోవడం.. మహిళ ముఖంపై గాయాలు ఉండడంతో ఈ మర్డర్ మిస్టరీగా మారింది. మహిళను ఎవరు చంపారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మహిళ పేరు శివగళ్ల పద్మ. వికారాబాద్ జిల్లా పరిగి మండలం మాదారం స్వస్థలం. కొన్నాళ్ల క్రితం ఆమె భర్త చనిపోయాడు. ఉన్న ఒక్కగానొక్క కూతురుకు పెళ్లి చేసి అత్తారింటికి పంపించింది. ప్రస్తుతం మాదారంలోని సొంత ఇంటిలో ఒంటరిగా ఉంటోంది..
READ ALSO: USA: #TrumpIsDead..! స్పందించిన యూఎస్ ఉపాధ్యక్షుడు ..
Also Read
శివగళ్ల పద్మకు దాదాపు రోజు విడిచి రోజు కల్లు తాగే అలవాటు ఉంది. దీంతో ఊరిలోని కల్లు కాంపౌండ్కు వెళ్లి..తాగి ఇంటికి వెళ్తుంటుంది. శుక్రవారం రాత్రి కూడా కల్లు తాగి ఇంటికి వెళ్లింది. కానీ అనూహ్యంగా శనివారం ఉదయం అదే కల్లు కాంపౌండ్ పక్కనే ఉన్న సందులో అచేతనంగా పడి ఉంది. అంతే కాదు ఆమె ఒంటిపై బట్టలు తీసేసి ఉన్నాయి. ముఖంపై గాయాలు కూడా ఉన్నాయి. దీంతో అనుమానాస్పదస్థితిలో మృతి చెందడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు…
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఎలాంటి సీసీ కెమెరాలు లేకపోవడం వల్ల మర్డర్ ఎవరు చేసి ఉంటారనే దానిపై స్పష్టత రావడం లేదు. మరోవైపు కల్లు కాంపౌండ్ నిర్వహిస్తున్న నర్సింహులు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. త్వరలోనే కేసును ఛేదిస్తామని చెబుతున్నారు పోలీసులు. పద్మ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు…
READ ALSO: USA: #TrumpIsDead..! స్పందించిన యూఎస్ ఉపాధ్యక్షుడు ..
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఐఏఎస్ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ
-
House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
-
Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
-
Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
-
Angkrish Raghuvanshi: రేర్ డిస్మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!