Vikarabad murder: వికారాబాద్ జిల్లా మాదారంలో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కల్లుకాంపౌండ్ పక్కనే అర్ధనగ్నంగా పడి ఉండడం కలకలం రేపుతోంది. అక్కడ ఎలాంటి సీసీ కెమెరాలు లేకపోవడం.. మహిళ ముఖంపై గాయాలు ఉండడంతో ఈ మర్డర్ మిస్టరీగా మారింది. మహిళను ఎవరు చంపారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మహిళ పేరు శివగళ్ల పద్మ. వికారాబాద్ జిల్లా పరిగి మండలం మాదారం స్వస్థలం. కొన్నాళ్ల క్రితం ఆమె భర్త చనిపోయాడు. ఉన్న…
ఆంధ్రప్రదేశ్లో ఓ యూట్యూబర్ అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడు.. అనంతపురం జిల్లాలో ఈ ఘటన జరిగింది.. గుంతకల్ మండలం బుగ్గ సంఘాల గ్రామ సమీపంలో గత రెండు రోజుల క్రితం అదృశ్యమైన యూట్యూబర్ తిరుమలరెడ్డి.. మంగళవారం కసాపురం గ్రామ సమీపంలోని హంద్రీనీవా కాలువ వద్ద శవమై తేలాడు..
ఖమ్మంలో గత రెండు రోజుల క్రితం అదృశ్యం అయి కాలువ లో మృత దేహంగా లభ్యం అయిన సంజీవ్ కుమార్ అనే యువకుడి ఘటన విషాదాంతం అయ్యింది. పండుగ రోజున తన సోదరుని బైక్ పై తీసుకురావడానికి ఇంటి నుంచి వెళ్లి మృత్యు వాత పడ్డారు. తన సోదరుడికి వాయిస్ మెయిల్ పంపించాడు. ఒక మహిళను కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్తున్నారని నన్ను ఆటోతో కొట్టి చంపేస్తున్నారని వాయిస్ మెయిల్ లో సోదరుడికి పెట్టారు.
పని ఒత్తిడి కారణంగా ఉద్యోగులు మరణించడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే ఈవై ఉద్యోగిని అధిక పని కారణంగా తనువు చాలించింది. ఈ ఘటన యావత్తు భారతీయల హృదయాలను కలిచి వేసింది. కనీసం ఆమె అంత్యక్రియలకు ఒక్క ఎంప్లాయి కూడా హాజరు కాలేదు. ఈ అంశం మరింత దిగ్భ్రాంతి కలిగించింది.