House Collapse: నిద్రలోనే తెల్లారిన బతుకులు.. 100 ఏళ్ల నాటి ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
- యూపీలో ఘోర విషాదం
- నిద్రలోనే తెల్లారిన బతుకులు
- 100 ఏళ్ల పురాతన ఇల్లు కూలి ఆరుగురు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్లోని ప్రతాప్గఢ్ జిల్లాలో గురువారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మహులీ గ్రామంలో సుమారు 100 ఏళ్ల నాటి శిథిలావస్థలో ఉన్న ఇల్లు ఒక్కసారిగా కుప్పకూలింది. ఆ సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు శిథిలాల కింద చిక్కుకుని మృతి చెందారు. 28 ఏళ్ల యువకుడు మాత్రం ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు. భారీ వర్షాల నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు స్థానిక నివేదికలు పేర్కొన్నాయి.
తెల్లవారుజామున ఒక్కసారిగా కూలిన ఇల్లు
మహులీ గ్రామానికి చెందిన ప్రమోద్ శ్రీవాస్తవకు చెందిన ఇల్లు చాలా కాలంగా పాతబడిపోయి శిథిలావస్థకు చేరుకున్నట్లు సమాచారం. గురువారం తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో కుటుంబ సభ్యులు నిద్రిస్తున్న సమయంలో ఇల్లు అకస్మాత్తుగా కూలిపోయింది. భారీ శబ్దాలు, కుటుంబ సభ్యుల కేకలు విన్న స్థానికులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. అనంతరం పోలీసులకు, అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు.
Also Read
- Sonam Wangchuk: అర్ధరాత్రి వేళ మాట ఇచ్చి మోసం చేశారు.. కేంద్ర మంత్రుల తీరుపై సోనమ్ వాంగ్చుక్ ఆవేదన
- Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
శిథిలాల కింద ఆరుగురు మృతి
రక్షణ సిబ్బంది, స్థానికుల సహకారంతో శిథిలాలను తొలగించి ఇంట్లో చిక్కుకున్న వారిని బయటకు తీశారు. వారిని ఆసుపత్రికి తరలించగా, వైద్యులు ఆరుగురు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుల్లో కుటుంబ పెద్ద ప్రమోద్ శ్రీవాస్తవతో పాటు రీటా, నితిన్, మాధురి, మాధవ్, అద్విక్ ఉన్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. మృతుల్లో దంపతులతో పాటు వారి కుమారుడు, కోడలు, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ప్రమాదంలో ప్రమోద్ శ్రీవాస్తవ కుమారుడు అమన్ (28) ప్రాణాలతో బయటపడ్డాడు. శిథిలాల నుంచి అతడిని సురక్షితంగా బయటకు తీసిన అనంతరం ఆసుపత్రికి తరలించారు.
ప్రతాప్గఢ్లో వరుస విషాద ఘటనలు
ఇటీవల ప్రతాప్గఢ్ జిల్లాలో వర్షాలకు సంబంధించిన మరో ఘటన కూడా చోటుచేసుకుంది. పట్టి తహసీల్ ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా ఓ రైతుకు చెందిన మట్టి ఇల్లు కూలిపోయింది. ఈ ప్రమాదంలో రైతు గాయపడగా, అతని పిల్లలు సురక్షితంగా బయటపడ్డారు. తాజా ఘటనతో జిల్లాలో పాత ఇళ్లు, వర్షాల సమయంలో వాటి భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. వర్షాకాలంలో శిథిలావస్థలో ఉన్న ఇళ్లను గుర్తించి, అవసరమైన చోట ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు.
తాజావార్తలు
-
House Collapse: నిద్రలోనే తెల్లారిన బతుకులు.. 100 ఏళ్ల నాటి ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
-
Flop Directors : ఈ దర్శకులకు ఛాన్స్ ఇచ్చే హీరోలెవరు.. నెక్ట్స్ మూవీ కన్ఫ్యూజన్లో ఫ్లాప్ డైరెక్టర్స్
-
Rishabh Pant: మైదానంలోనే కాదు.. ఆర్థికంగానూ రికార్డు బద్దలు.. నంబర్-1 ట్యాక్స్ పేయర్గా రిషభ్ పంత్..
-
Sonam Wangchuk: అర్ధరాత్రి వేళ మాట ఇచ్చి మోసం చేశారు.. కేంద్ర మంత్రుల తీరుపై సోనమ్ వాంగ్చుక్ ఆవేదన
-
Ramayana Release Date : రామాయణ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్..
ట్రెండింగ్
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్బడ్స్ లాంచ్..!
-
Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!