House Collapse: నిద్రలోనే తెల్లారిన బతుకులు.. 100 ఏళ్ల నాటి ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
- యూపీలో ఘోర విషాదం
- నిద్రలోనే తెల్లారిన బతుకులు
- 100 ఏళ్ల పురాతన ఇల్లు కూలి ఆరుగురు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్లోని ప్రతాప్గఢ్ జిల్లాలో గురువారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మహులీ గ్రామంలో సుమారు 100 ఏళ్ల నాటి శిథిలావస్థలో ఉన్న ఇల్లు ఒక్కసారిగా కుప్పకూలింది. ఆ సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు శిథిలాల కింద చిక్కుకుని మృతి చెందారు. 28 ఏళ్ల యువకుడు మాత్రం ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు. భారీ వర్షాల నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు స్థానిక నివేదికలు పేర్కొన్నాయి.
తెల్లవారుజామున ఒక్కసారిగా కూలిన ఇల్లు
మహులీ గ్రామానికి చెందిన ప్రమోద్ శ్రీవాస్తవకు చెందిన ఇల్లు చాలా కాలంగా పాతబడిపోయి శిథిలావస్థకు చేరుకున్నట్లు సమాచారం. గురువారం తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో కుటుంబ సభ్యులు నిద్రిస్తున్న సమయంలో ఇల్లు అకస్మాత్తుగా కూలిపోయింది. భారీ శబ్దాలు, కుటుంబ సభ్యుల కేకలు విన్న స్థానికులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. అనంతరం పోలీసులకు, అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు.
Also Read
- Jantar Mantar Protest: జంతర్ మంతర్ వద్ద మరో నిరసన.. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వేలాది మంది..
- Drugs Control Department: “UP TO 60%/70%/80% DISCOUNT” బోర్డులు.. ఫార్మసీలకు డ్రగ్స్ కంట్రోల్ సీరియస్ వార్నింగ్
- Rahul Gandhi: పెల్లెట్ గన్ ఘటనపై రాహుల్ గాంధీ ధర్నా.. ఎట్టకేలకు ఎఫ్ఐఆర్ నమోదు
- Maharashtra: కొడుకును కాపాడే ప్రయత్నం విషాదాంతం.. తల్లిదండ్రులు సహా ముగ్గురూ మృతి
శిథిలాల కింద ఆరుగురు మృతి
రక్షణ సిబ్బంది, స్థానికుల సహకారంతో శిథిలాలను తొలగించి ఇంట్లో చిక్కుకున్న వారిని బయటకు తీశారు. వారిని ఆసుపత్రికి తరలించగా, వైద్యులు ఆరుగురు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుల్లో కుటుంబ పెద్ద ప్రమోద్ శ్రీవాస్తవతో పాటు రీటా, నితిన్, మాధురి, మాధవ్, అద్విక్ ఉన్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. మృతుల్లో దంపతులతో పాటు వారి కుమారుడు, కోడలు, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ప్రమాదంలో ప్రమోద్ శ్రీవాస్తవ కుమారుడు అమన్ (28) ప్రాణాలతో బయటపడ్డాడు. శిథిలాల నుంచి అతడిని సురక్షితంగా బయటకు తీసిన అనంతరం ఆసుపత్రికి తరలించారు.
ప్రతాప్గఢ్లో వరుస విషాద ఘటనలు
ఇటీవల ప్రతాప్గఢ్ జిల్లాలో వర్షాలకు సంబంధించిన మరో ఘటన కూడా చోటుచేసుకుంది. పట్టి తహసీల్ ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా ఓ రైతుకు చెందిన మట్టి ఇల్లు కూలిపోయింది. ఈ ప్రమాదంలో రైతు గాయపడగా, అతని పిల్లలు సురక్షితంగా బయటపడ్డారు. తాజా ఘటనతో జిల్లాలో పాత ఇళ్లు, వర్షాల సమయంలో వాటి భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. వర్షాకాలంలో శిథిలావస్థలో ఉన్న ఇళ్లను గుర్తించి, అవసరమైన చోట ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు.
తాజావార్తలు
-
Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
-
CM Revanth Reddy : ఆక్స్ఫర్డ్కు రేవంత్ ఆహ్వానం.. హైదరాబాద్లో కొత్త క్యాంపస్.?
-
Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
-
YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
-
OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!