ఇటీవల తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు మరలా వరుసగా షాక్లు ఇస్తున్నాయి. గత 5-6 రోజలుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు.. వరుసగా మూడోరోజు పెరిగాయి. నిన్న 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.440 పెరగగా.. నేడు రూ.1,140 పెరిగింది. నేడు బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.83,400 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.90,980గా కొనసాగుతోంది. మరోవైపు వెండి ధరలు కూడా షాక్ ఇస్తున్నాయి. నిన్న స్థిరంగా ఉన్న వెండి.. నేడు రూ.3000 పెరిగింది. శుక్రవారం బులియన్ మార్కెట్లో కిలో వెండి రూ.1, 05,000గా ఉంది.
ఇది కూడా చదవండి: AIMIM : ఈద్ ప్రార్థనలపై మాటల యుద్ధం.. రోడ్డు మీద నమాజ్ చేస్తామన్న ఎంఐఎం నేత…