Infosys: పన్ను ఎగవేసిన ఇన్ఫోసిస్..!రూ. 32 వేల కోట్ల జీఎస్టీ నోటీసు
- ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ పై ఆరోపణలు
- రూ. 32 వేల కోట్ల మేర పన్ను ఎగవేత
- ఇన్ఫోసిస్కు జీఎస్టీ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్ నోటీసు
- ఈ నోటీసును ప్రీ-షో కాజ్ నోటీసుగా పేర్కొన్న కంపెనీ
- ఎస్టీ బకాయిలన్నీ చెల్లించామని కంపెనీ వివరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ రూ. 32 వేల కోట్ల మేర పన్ను ఎగవేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై స్పందించాలని ఇన్ఫోసిస్కు జీఎస్టీ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్ నోటీసు జారీ చేశారు. నివేదిక ప్రకారం.. ఇన్ఫోసిస్ పై పన్ను ఎగవేత కేసు నమోదైనట్లు సమాచారం. జులై 2017 నుంచి 2021-2022 వరకు పన్ను ఎగవేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇన్ఫోసిస్ తన విదేశీ శాఖల నుంచి సేవలను పొందిందని, అయితే వాటిపై రూ.32,403 కోట్ల పన్ను చెల్లించలేదని ఆరోపణలున్నాయి. ఇన్ఫోసిస్ సేవల దిగుమతిపై IGSTని చెల్లించనందుకు విచారణలో ఉందని పన్ను పత్రం పేర్కొంది.
READ MORE: Telangana Assembly 2024: ఇవాళ అసెంబ్లీలో మూడు బిల్లులపై చర్చ.. మధ్యాహ్నం కేబినెట్ సమావేశం..
Also Read
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం కీలక నిర్ణయం.. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు..
- Rahul Gandhi: యూపీఐ ఛార్జీలపై రాహుల్గాంధీ విమర్శలు
- Oracle layoffs: ఉదయం 6 గంటలకే ఈమెయిల్.. ఒరాకిల్లో మళ్లీ భారీగా ఉద్యోగాల కోతలు
- Gold and Silver Price: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. వరుసగా రెండో రోజు భారీగా తగ్గిన బంగారం ధర..
కాగా.. కంపెనీ ఈ నోటీసును ప్రీ-షో కాజ్ నోటీసుగా పేర్కొంది. అటువంటి ఖర్చులపై జీఎస్టీ వర్తించదని వివరణ ఇచ్చింది. జీఎస్టీ కౌన్సిల్ సిఫారసులపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ పరోక్ష పన్నులు, కస్టమ్స్ ఇటీవల జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం.. భారతీయ సంస్థకు విదేశీ శాఖలు అందించే సేవలు జీఎస్టీకి లోబడి ఉండవని ఇన్ఫోసిస్ తెలిపింది. జీఎస్టీ చెల్లింపు అనేది ఐటీ సేవల ఎగుమతికి వ్యతిరేకంగా క్రెడిట్ లేదా వాపసు కోసమని చెప్పింది. జీఎస్టీ బకాయిలన్నీ చెల్లించామని, ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర నిబంధనలను పూర్తిగా పాటిస్తున్నామని కంపెనీ తెలిపింది.
READ MORE:Puri Jagannath: ఎటూ తెగని డబుల్ ఇస్మార్ట్ పంచాయతీ..రంగంలోకి పూరి, ఛార్మి..
జీఎస్టీ అధికారులు ఇన్ఫోసిస్కు పంపిన పన్ను పత్రంలో కంపెనీ విదేశీ శాఖల నుంచి పొందిన సేవలపై పన్ను చెల్లించలేదని పేర్కొంది. అందువల్ల భారతదేశం వెలుపల ఉన్న శాఖల నుంచి స్వీకరించబడిన సరఫరాలపై ఇన్ఫోసిస్ రివర్స్ ఛార్జీని ఎదుర్కొంటోంది. యంత్రాంగం కింద రూ.32,403 కోట్లు చెల్లించాల్సి ఉంది.
తాజావార్తలు
-
UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం కీలక నిర్ణయం.. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు..
-
Bats: గబ్బిలాల శరీరంలో దాగిన భయంకర రహస్యం..!
-
LV Prasad Hospital: అమరావతిలో ఎల్.వి.ప్రసాద్ కంటి ఆసుపత్రి.. 12 ఎకరాల స్థలంలో నిర్మాణం..
-
Trump: ట్రంప్ దౌత్యం విఫలం.. మరోసారి ఇంధన వసతులపై రష్యా-ఉక్రెయిన్ పరస్పర దాడులు
-
TGTET ఇన్సర్వీస్ కీ విడుదల.. అభ్యంతరాలకు ఇదే చివరి ఛాన్స్.!
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?