Crude Oil: ఇరాన్పై అమెరికా వార్.. చమురు ధరలు క్రాష్! భారత్లో లీటర్ పెట్రోల్ రేట్ ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crude Oil: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు (Crude Oil) ధరలు మళ్లీ మండిపోతున్నాయి. బుధవారం ఉదయం జరిగిన ట్రేడింగ్లో క్రూడ్ ఆయిల్ ధరలు ఏకంగా 3 శాతం మేర పెరిగాయి. చమురు ధరలు ఇలా వరుసగా రెండో రోజు కూడా పెరగడం గమనార్హం. ఇరాన్పై అమెరికా సైన్యం జరిపిన దాడులు, కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనకు దారితీయడమే ఇందుకు ప్రధాన కారణమని రాయిటర్స్ నివేదిక స్పష్టం చేసింది. హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న మూడు వాణిజ్య నౌకలపై ఇరాన్ డ్రోన్ దాడులకు తెగబడటంతో.. దానికి ప్రతిస్పందనగా మంగళవారం అమెరికా సెంట్రల్ కమాండ్ ఇరాన్ సైనిక స్థావరాలపై పలు దాడులు చేసినట్లు ప్రకటించింది. ఈ తాజా భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు అంతర్జాతీయ ఇంధన మార్కెట్ను ఒక్కసారిగా వేడెక్కించాయి.
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. బ్రెంట్ ముడి చమురు బ్యారెల్కు 76 డాలర్ల మార్కును అధిగమించిందని డేటా చూపిస్తోంది. బుధవారం, గల్ఫ్ ముడి చమురు ట్రేడింగ్ సెషన్లో 76.25 డాలర్ల మార్కును దాటి, దాదాపు 3 శాతం పెరిగి బ్యారెల్కు 76.09 డాలర్లకు చేరుకుంది. జూలై 6న, బ్రెంట్ ముడి చమురు ధరలు బ్యారెల్కు 72 డాలర్ల కంటే తక్కువగా ముగిశాయి. అదే సమయంలో, యూఎస్ ముడి చమురు ధరలు కూడా పెరిగాయి. జూలై 6 నుంచి WTI ధరలు బ్యారెల్కు దాదాపు 4 డాలర్లు పెరిగి, 72.50 డాలర్ల మార్కును అధిగమించాయని డేటా చూపిస్తోంది. ప్రస్తుతం, ధరలు దాదాపు 3 శాతం పెరిగి బ్యారెల్కు 72.37 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి.
Also Read
- Meta: సోషల్ మీడియా చరిత్రలోనే నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్! మెటాకు ఏకంగా రూ.120 లక్షల కోట్ల జరిమానా?
- E25 Petrol in India: భారత ఇంధన రంగంలో మరో భారీ మార్పు.. E20 తర్వాత E21, E25..
- Adani Aluminium: అదానీ నెక్ట్స్ టార్గెట్ ఆ రెండు పెద్ద కంపెనీలేనా? ఏకంగా రూ. 1.1 లక్షల కోట్లతో గౌతమ్ అదానీ సరికొత్త ప్లాన్!
- Microsoft LayOff: మైక్రోసాఫ్ట్లో భారీ ఉద్యోగాల కోత.. AI కోసం 4,800 మందికి ఉద్వాసన..
ధరలు ఎందుకు పెరిగాయంటే..
వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులు జరిపిన నేపథ్యంలో, ఆ దేశం ముడి చమురు అమ్మకాలను అనుమతించే సాధారణ లైసెన్సును అమెరికా రద్దు చేయడంతో ప్రస్తతం అంతర్జాతీయ మార్కెట్లో వాటి ధరలు పెరిగాయి. వాణిజ్య నౌకలపై దాడులకు ఇరాన్ కారణమని ఖతార్ ఆరోపించింది. ఈ దాడులకు గురైన నౌకలలో ఖతార్కు చెందిన ట్యాంకర్ ‘అల్ రెకాయత్’ కూడా ఉంది. డ్రోన్ దాడి కారణంగా ఆ నౌక ఇంజన్ రూమ్లో మంటలు చెలరేగాయి. అయితే ప్రస్తుతం సిబ్బంది సురక్షితంగా ఉన్నారని ఖతార్ తెలిపింది. సౌదీ జెండా కలిగిన ‘వెడయాన్’ అనే సూపర్ట్యాంకర్ కూడా ఒమన్ సమీపంలో దెబ్బతిన్నట్లు సమాచారం. నౌక నష్టానికి గల కారణం స్పష్టంగా తెలియరాలేదు.
భారతదేశంలో పెట్రోల్ – డీజిల్ ధరలు
అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రస్తుతానికి భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలలో ఎటువంటి మార్పు లేదని క్రేందం స్పష్టం చేసింది. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలలో చివరిసారిగా మార్పు వచ్చింది, అది ఇంధన ధరల పెరుగుదలే జరిగినప్పుడే అని వెల్లడించింది. తాజా ఐఓసీఎల్ డేటా ప్రకారం.. ఢిల్లీలో పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు వరుసగా రూ.102.12, రూ.95.20గా ఉన్నాయి. కోల్కతాలో రూ.113.51, రూ.99.82గా ఉంది. ముంబైలో రూ.111.21, రూ. 97.83గా ఉన్నాయి. చెన్నైలో రూ.107.77, రూ.99.55కు చేరింది. అయితే మే నెలలో ఇంధన ధరలు 7 నుంచి 8 శాతం మేర పెరిగాయి. రాబోయే రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గవని నిపుణులు భావిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు స్థిరపడే వరకు దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు యథాతథంగా ఉంటాయని వారు అభిప్రాయపడ్డారు.
తాజావార్తలు
-
Shreyas Iyer: మా ఆట దారుణంగా ఉంది.. మేం చెత్తగా ఆడాం.!
-
Crude Oil: ఇరాన్పై అమెరికా వార్.. చమురు ధరలు క్రాష్! భారత్లో లీటర్ పెట్రోల్ రేట్ ఎంతంటే?
-
Nothing Phone (4b): 6000mAh బ్యాటరీతో.. నథింగ్ ఫోన్ (4బి) భారత్లో విడుదల.. ధర, ఫీచర్లు ఇవే!
-
Ayodhya Ram Mandir: రామ మందిర్ ట్రస్ట్లో కలకలం.. చంపత్ రాయ్ వ్యాఖ్యలతో మళ్లీ వేడెక్కిన వివాదం
-
Pawan Kalyan Fan: పవన్ ఇంటికొచ్చి పరామర్శించిన ఆ బాలుడు ఇకలేడు.. ‘నిరంజన్’ కన్నుమూత!
ట్రెండింగ్
-
Kitchen Tips : వేడి ఆలూ తొక్క.. 10 సెకన్లలో ఊడిపోతుంది.! ఈ ట్రిక్ తెలుసా.?
-
Kitchen Tips : కుక్కర్లో అన్నం ముద్ద అవుతుందా? ఈ ట్రిక్తో మల్లెపూవులా వస్తుంది!
-
టూరిస్టులకు గుడ్ న్యూస్.. ఒక్క రోజులో 5 అద్భుత గమ్యస్థానాలు.! TSTDC అదిరిపోయే టూర్ ప్యాకేజీ.!
-
7,200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Vivo నుంచి కొత్త G5i, G5z స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
Black Jamun Jam: ప్రిజర్వేటివ్స్ అవసరం లేకుండానే.. 6 నెలలు నిల్వ ఉండే ‘నేరేడు జామ్’ ఇంట్లోనే చేయండి ఇలా.!