Tariff Hike: ఆ కారణంతో మళ్లీ పెరగనున్న మొబైల్ రీఛార్జ్ ధరలు!.. ఈసారి ఎంత శాతమంటే?
- టారిఫ్ ధరలను పెంచేందుకు సిద్ధమవుతున్న టెలికాం కంపెనీలు
- మళ్లీ పెరగనున్న మొబైల్ రీఛార్జ్ ధరలు
- టారిఫ్ హైక్ కు గల కారణాలు తెలిపిన జెఫరిస్ రిపోర్ట్
ఓ వైపు నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతుండడంతో ప్రజలు అల్లాడి పోతున్నారు. మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు ఇప్పుడు మొబైల్ రీఛార్జ్ ధరలు కూడా పెరగబోతున్నట్లు టాక్ వినిపిస్తుండడంతో షాక్ కు గురవుతున్నారు. మొబైల్ రీఛార్జ్ ధరలు మరింత భారం కానున్నట్లు సమాచారం. గతేడాది జియో, ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా వంటి టెలికాం సంస్థలు టారిఫ్ ధరలను భారీగా పెంచిన విషయం తెలిసిందే. ఏకంగా 25 శాతం వరకు పెంచి కస్టమర్లపై ఆర్థిక భారాన్ని మోపాయి. ఈ ఏడాది కూడా టెల్కోలు మళ్లీ టారిఫ్ ధరలను పెంచబోతున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
టెలికాం ఆపరేటర్స్ ఈ సంత్సరం దాదాపు 10 శాతం టారిఫ్ ధరలను పెంచే ఛాన్స్ ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే పెరిగిన రీఛార్జ్ ధరలతో సతమతమవుతుంటే మరోసారి టారిఫ్ ధరలు పెరుగుతాయనే సంకేతాలు వస్తుండడంతో మొబైల్ వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. పెరగనున్న రీఛార్జ్ ధరలు కస్టమర్లకు అదనపు భారం కానున్నాయి. అయితే మరోసారి టెలికాం కంపెనీలు రీఛార్జ్ ధరలను పెంచడానికి గల కారణం ఏంటి? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఆపరేట్స్ మార్జిన్లపై దృష్టిపెడుతున్నారని త్వరలో 5G నిర్ధిష్ట ధరలను ప్రవేశపెట్టవచ్చని జెఫరీస్ రిపోర్ట్ వెల్లడించింది.
Also Read
- Rupee vs Dollar: మళ్లీ పతనమైన రూపాయి విలువ.. అమెరికన్ డాలర్తో 95.23కి.. కారణాలు ఏమిటి?
- Stock Market: హార్ముజ్ డెడ్లాక్ ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో సూచీలు
- Rule Change: మే 1 నుండి న్యూ రూల్స్.. ఎల్పీజీ ధరల నుండి క్రెడిట్ కార్డుల వరకు ఏవేం మారనున్నాయంటే?
- Mark Zuckerberg: ఫేస్బుక్ను సృష్టించిన ‘డ్రాపౌట్’.. వేల కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించిన జుకర్బర్గ్కు డిగ్రీ లేదు తెలుసా!
ఈ ఏడాది జియో లిస్టింగ్ కు వెళ్లే ఛాన్స్ ఉండడంతో దాని వృద్ధిని పెంచడానికి టారిఫ్ ల పెంపుకు అనుకూలంగా ఉండనున్నట్లు జెఫరీస్ నివేదిక తెలిపింది. ఇదే సమయంలో ఎయిర్ టెల్ మెరుగైన రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయ్ మెంట్ కోసం టారిఫ్ లను పెంచాలని టార్గెట్ గా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం అతిపెద్ద వాటాదారుగా ఉండడంతో వొడాఫోన్ ఐడియా కూడా టారిఫ్ లను పెంచే అవకాశం ఉండవచ్చని జెఫరిస్ రిపోర్ట్ వెల్లడించింది. టారిఫ్ ధరల పెంపుతో టెలికాం రంగ ఆదాయ వృద్ధి సంవత్సరానికి 15 శాతం పెరుగుతుందని జెఫరిస్ అంచనా వేస్తోంది. ఒక వేళ రీఛార్జ్ ధరలు పెరిగితే ఏడాది కాలంలోనే రెండు సార్లు పెరిగినట్లు అవుతుంది.
తాజావార్తలు
-
AP SSC Results 2026: టెన్త్ ఫలితాల్లో సత్తా చాటిన ఎంజేపీ బీసీ గురుకులాలు.. 96.02 శాతం ఉత్తీర్ణత..
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
Trump-Putin: ట్రంప్-పుతిన్ మధ్య 90 నిమిషాలు కాల్ సంభాషణ.. ఏం చర్చించారంటే..!
-
AP SSC Supplementary Exams 2026: విద్యార్థులకు అలర్ట్.. టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల..
-
Union Bank Recruitment 2026: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 1865 పోస్టులు.. మంచి జీతం
ట్రెండింగ్
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?