Tariff Hike: ఆ కారణంతో మళ్లీ పెరగనున్న మొబైల్ రీఛార్జ్ ధరలు!.. ఈసారి ఎంత శాతమంటే?
- టారిఫ్ ధరలను పెంచేందుకు సిద్ధమవుతున్న టెలికాం కంపెనీలు
- మళ్లీ పెరగనున్న మొబైల్ రీఛార్జ్ ధరలు
- టారిఫ్ హైక్ కు గల కారణాలు తెలిపిన జెఫరిస్ రిపోర్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓ వైపు నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతుండడంతో ప్రజలు అల్లాడి పోతున్నారు. మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు ఇప్పుడు మొబైల్ రీఛార్జ్ ధరలు కూడా పెరగబోతున్నట్లు టాక్ వినిపిస్తుండడంతో షాక్ కు గురవుతున్నారు. మొబైల్ రీఛార్జ్ ధరలు మరింత భారం కానున్నట్లు సమాచారం. గతేడాది జియో, ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా వంటి టెలికాం సంస్థలు టారిఫ్ ధరలను భారీగా పెంచిన విషయం తెలిసిందే. ఏకంగా 25 శాతం వరకు పెంచి కస్టమర్లపై ఆర్థిక భారాన్ని మోపాయి. ఈ ఏడాది కూడా టెల్కోలు మళ్లీ టారిఫ్ ధరలను పెంచబోతున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
టెలికాం ఆపరేటర్స్ ఈ సంత్సరం దాదాపు 10 శాతం టారిఫ్ ధరలను పెంచే ఛాన్స్ ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే పెరిగిన రీఛార్జ్ ధరలతో సతమతమవుతుంటే మరోసారి టారిఫ్ ధరలు పెరుగుతాయనే సంకేతాలు వస్తుండడంతో మొబైల్ వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. పెరగనున్న రీఛార్జ్ ధరలు కస్టమర్లకు అదనపు భారం కానున్నాయి. అయితే మరోసారి టెలికాం కంపెనీలు రీఛార్జ్ ధరలను పెంచడానికి గల కారణం ఏంటి? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఆపరేట్స్ మార్జిన్లపై దృష్టిపెడుతున్నారని త్వరలో 5G నిర్ధిష్ట ధరలను ప్రవేశపెట్టవచ్చని జెఫరీస్ రిపోర్ట్ వెల్లడించింది.
Also Read
- Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
- Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
- International Credit Cards: భారతీయులకు క్రెడిట్ కార్డులు ఇచ్చేందుకు నిరాకరిస్తున్న గ్లోబల్ బ్యాంక్స్.. ఎందుకంటే?
- Ethanol in Diesel: డీజిల్లో ఇథనాల్కు బ్రేక్.. వెనక్కి తగ్గిన కేంద్రం.. అసలు కారణం ఇదే..!
ఈ ఏడాది జియో లిస్టింగ్ కు వెళ్లే ఛాన్స్ ఉండడంతో దాని వృద్ధిని పెంచడానికి టారిఫ్ ల పెంపుకు అనుకూలంగా ఉండనున్నట్లు జెఫరీస్ నివేదిక తెలిపింది. ఇదే సమయంలో ఎయిర్ టెల్ మెరుగైన రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయ్ మెంట్ కోసం టారిఫ్ లను పెంచాలని టార్గెట్ గా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం అతిపెద్ద వాటాదారుగా ఉండడంతో వొడాఫోన్ ఐడియా కూడా టారిఫ్ లను పెంచే అవకాశం ఉండవచ్చని జెఫరిస్ రిపోర్ట్ వెల్లడించింది. టారిఫ్ ధరల పెంపుతో టెలికాం రంగ ఆదాయ వృద్ధి సంవత్సరానికి 15 శాతం పెరుగుతుందని జెఫరిస్ అంచనా వేస్తోంది. ఒక వేళ రీఛార్జ్ ధరలు పెరిగితే ఏడాది కాలంలోనే రెండు సార్లు పెరిగినట్లు అవుతుంది.
తాజావార్తలు
-
Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
-
Arunachal Pradesh: ‘‘అరుణాచల్ ప్రదేశ్ మాదే’’.. చైనా అభ్యంతరాలపై భారత్ స్ట్రాంగ్ రిఫ్లై..
-
Raghunandan Rao: తెలంగాణలో రూ.200 కోట్ల సోలార్ స్కామ్.?.. రఘునందన్ రావు సంచలన ఆరోపణలు
-
Pocharam Srinivas Reddy: పోచారం సంచలన వ్యాఖ్యలు.. రేవంత్పై ఫైర్, బాన్సువాడలో మళ్లీ మనమే
-
Yashasvi Jaiswal: 29 టెస్టులు.. 29 వేదికలు.. ఇదెక్కడి వింత రికార్డు భయ్యా..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..