Soaps price: బాత్రూమ్ని తాకిన ద్రవ్యోల్బణం.. సబ్బులు, షాంపూల ధరలు పెంపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ద్రవ్యోల్బణం ఇప్పుడు బాత్రూమ్ని తాకింది.. ఇప్పటికే తినడం, తాగడంపై దాని ఎఫెక్ట్ పడగా.. ఇప్పుడు స్నానం చేయడం మరియు కడగడం కూడా ఖరీదైన వ్యవహారంగా మారిపోతోంది. అదే, సబ్బులు మరియు షాంపూల ధరలు పెరిగాయి.. హెచ్సీఎల్ తన ఉత్పత్తుల ధరలను 15 శాతం వరకు పెంచింది. ఈ పెరుగుదల తర్వాత, మీ బాత్రూమ్ బడ్జెట్ ఖచ్చితంగా పెరుగుతుంది. ఇది మాత్రమే కాదు, టూత్పేస్ట్, కెచప్ వంటి ఇతర వస్తువుల ధరలను కూడా హెచ్సీఎల్ పెంచింది.. వాటి ధరలు 4 మరియు 13 శాతం మధ్య పెరిగాయి.
Read Also: New Judges: సుప్రీంకోర్టుకు కొత్తగా ఇద్దరు న్యాయమూర్తులు
Also Read
- Jio IPO: మీకు జియోలో వాటా కావాలా..? ఐపీఓకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన సెబీ..
- Gold and Silver Prices Today: రక్షాబంధన్ వేళ పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
- PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
- Sugar Prices: పండగ వేళ షాక్.. ఒకరికి 2 కేజీలు మాత్రమే.. చక్కెర కొనుగోళ్లపై పరిమితి!
క్రమంగా పెరుగుతూ ఆల్టైం హై రికార్డు సృష్టించిన చమురు ధరలతో ఇప్పటికే ఎంఎంసీజీ ఉత్పత్తుల ధరలు పెరిగాయి. ఆ తర్వాత కంపెనీ ఉత్పత్తుల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించగా.. ప్రస్తుతం క్లినిక్ ప్లస్ షాంపూ 100 మిల్లీమీటర్ల ప్యాక్ ధర 15శాతం పెరగ్గా.. ఇతర షాంపూల ధరలు పెరిగాయని డిస్ట్రిబ్యూటర్ వర్గాలు పేర్కొన్నట్లు సంబంధిత నివేదికలు చెబుతున్నాయి.. 125 గ్రాముల పియర్స్ సోప్ ప్రస్తుతం 2.38 శాతం పెరిగి రూ.86 చేరగా.. మల్టీప్యాక్పై 3.7శాతం వరకు పెరిగిందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.. లక్స్ సోప్ మల్టీప్యాక్ ధరలను కంపెనీ నేరుగా తొమ్మిది శాతం వరకు వడ్డించింది. హిందూస్థాన్ యూనిలీవర్ సబ్బులు, షాంపూల ధరలను మాత్రమే కాకుండా కంపెనీ తయారు చేసే పలు ఉత్పత్తుల ధరలను సైతం పెంచేసింది.. వీటిలో హార్లిక్స్, బ్రూ కాఫీ, కిసాన్ కెచప్ తదితర ఉత్పత్తుల ధరలను 4 నుంచి 13శాతం వరకు పెంచినట్లు స్పష్టం చేస్తున్నాయి నివేదికలు.
కాగా, దేశంలో ద్రవ్యోల్బణం సాధారణ ప్రజల పరిస్థితి దయనీయంగా మారింది. ఆర్బీఐ బుధవారం రెపో రేట్లను పెంచగానే.. దేశంలోని బ్యాంకులు కూడా వడ్డీ రేట్లను పెంచాయి. ఆర్బీఐ నిర్ణయం తర్వాత ద్రవ్యోల్బణం మరింత పెరుగుతుందని అంచనా వేయగా నేడు దాని ప్రభావం కనిపించింది. స్నానం చేయడం, కడుక్కోవడం కూడా ఇప్పుడు ఖరీదైంది, అవును, వంటగది నుండి మొదలైన ద్రవ్యోల్బణం ఇప్పుడు బాత్రూమ్ వరకు వచ్చిందన్నమాట..
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!