Soaps price: బాత్రూమ్ని తాకిన ద్రవ్యోల్బణం.. సబ్బులు, షాంపూల ధరలు పెంపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ద్రవ్యోల్బణం ఇప్పుడు బాత్రూమ్ని తాకింది.. ఇప్పటికే తినడం, తాగడంపై దాని ఎఫెక్ట్ పడగా.. ఇప్పుడు స్నానం చేయడం మరియు కడగడం కూడా ఖరీదైన వ్యవహారంగా మారిపోతోంది. అదే, సబ్బులు మరియు షాంపూల ధరలు పెరిగాయి.. హెచ్సీఎల్ తన ఉత్పత్తుల ధరలను 15 శాతం వరకు పెంచింది. ఈ పెరుగుదల తర్వాత, మీ బాత్రూమ్ బడ్జెట్ ఖచ్చితంగా పెరుగుతుంది. ఇది మాత్రమే కాదు, టూత్పేస్ట్, కెచప్ వంటి ఇతర వస్తువుల ధరలను కూడా హెచ్సీఎల్ పెంచింది.. వాటి ధరలు 4 మరియు 13 శాతం మధ్య పెరిగాయి.
Read Also: New Judges: సుప్రీంకోర్టుకు కొత్తగా ఇద్దరు న్యాయమూర్తులు
Also Read
- Aluminium Foil: చైనాకు భారత్ గట్టి దెబ్బ! ఈ లోహంపై యాంటీ-డంపింగ్ సుంకం పొడిగింపు..'మేక్ ఇన్ ఇండియా'కు బలం
- EDLI Scheme: పీఎఫ్ ఖాతా ఉందా? ఉచితంగా రూ.7 లక్షల జీవిత బీమా.. EPF అందించే ఈ ప్రయోజనం గురించి తెలుసా?
- Gold ETF Outflows 2026: గోల్డ్ ఈటీఎఫ్లకు గుడ్బై చెబుతున్న ఇన్వెస్టర్లు.. కారణాలివే
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
క్రమంగా పెరుగుతూ ఆల్టైం హై రికార్డు సృష్టించిన చమురు ధరలతో ఇప్పటికే ఎంఎంసీజీ ఉత్పత్తుల ధరలు పెరిగాయి. ఆ తర్వాత కంపెనీ ఉత్పత్తుల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించగా.. ప్రస్తుతం క్లినిక్ ప్లస్ షాంపూ 100 మిల్లీమీటర్ల ప్యాక్ ధర 15శాతం పెరగ్గా.. ఇతర షాంపూల ధరలు పెరిగాయని డిస్ట్రిబ్యూటర్ వర్గాలు పేర్కొన్నట్లు సంబంధిత నివేదికలు చెబుతున్నాయి.. 125 గ్రాముల పియర్స్ సోప్ ప్రస్తుతం 2.38 శాతం పెరిగి రూ.86 చేరగా.. మల్టీప్యాక్పై 3.7శాతం వరకు పెరిగిందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.. లక్స్ సోప్ మల్టీప్యాక్ ధరలను కంపెనీ నేరుగా తొమ్మిది శాతం వరకు వడ్డించింది. హిందూస్థాన్ యూనిలీవర్ సబ్బులు, షాంపూల ధరలను మాత్రమే కాకుండా కంపెనీ తయారు చేసే పలు ఉత్పత్తుల ధరలను సైతం పెంచేసింది.. వీటిలో హార్లిక్స్, బ్రూ కాఫీ, కిసాన్ కెచప్ తదితర ఉత్పత్తుల ధరలను 4 నుంచి 13శాతం వరకు పెంచినట్లు స్పష్టం చేస్తున్నాయి నివేదికలు.
కాగా, దేశంలో ద్రవ్యోల్బణం సాధారణ ప్రజల పరిస్థితి దయనీయంగా మారింది. ఆర్బీఐ బుధవారం రెపో రేట్లను పెంచగానే.. దేశంలోని బ్యాంకులు కూడా వడ్డీ రేట్లను పెంచాయి. ఆర్బీఐ నిర్ణయం తర్వాత ద్రవ్యోల్బణం మరింత పెరుగుతుందని అంచనా వేయగా నేడు దాని ప్రభావం కనిపించింది. స్నానం చేయడం, కడుక్కోవడం కూడా ఇప్పుడు ఖరీదైంది, అవును, వంటగది నుండి మొదలైన ద్రవ్యోల్బణం ఇప్పుడు బాత్రూమ్ వరకు వచ్చిందన్నమాట..
తాజావార్తలు
-
Aluminium Foil: చైనాకు భారత్ గట్టి దెబ్బ! ఈ లోహంపై యాంటీ-డంపింగ్ సుంకం పొడిగింపు..’మేక్ ఇన్ ఇండియా’కు బలం
-
Jagapathi Babu : ‘పెద్ది’ని దించాలని కొందరు ఇడియట్స్ ప్రయత్నించారు.. ట్రోలర్స్ కి జగ్గూ భాయ్ స్ట్రాంగ్ కౌంటర్
-
Airbus C295: భారత రక్షణ రంగంలో చారిత్రాత్మక ఘట్టం.. గగనతలంలోకి తొలి ‘మేడ్ ఇన్ ఇండియా’ మిలిటరీ విమానం..
-
EDLI Scheme: పీఎఫ్ ఖాతా ఉందా? ఉచితంగా రూ.7 లక్షల జీవిత బీమా.. EPF అందించే ఈ ప్రయోజనం గురించి తెలుసా?
-
Women’s T20 World Cup 2026 టైటిల్ గెలిచే సత్తా ఉందా.? హర్మన్ప్రీత్ సేన బలాలు, బలహీనతలు ఇవే.!
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!