Home
Inflation
Inflation News
-
PAKISTAN: పెట్రోల్ ధరల మంట.. పాకిస్థాన్లో రోడ్డెక్కిన వేలాది మంది
PAKISTAN: అమెరికా, ఇరాన్ మధ్య మధ్యవర్తిత్వం చేసి అంతర్జాతీయంగా తనను తాను సూపర్ పవర్గా భావించుకుంటోంది పాకిస్తాన్. కానీ దేశంలో మాత్రం ఆర్థిక సంక్షోభం తీవ్ర స్థాయికి చేరుకుంది. ఇదే కాకుండా బలూచిస్తాన్, ఖైబర్ ఫక్తుంఖ్వా, పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)ల్లో తిరుగుబాటు ఎదుర్కొంటోంది. ఇదిలా ఉంటే, ఇప్పుడు పెరుగుతున్న పెట్రోల్, నిత్యావసర వస్తువుల ధరలపై ప్రజాగ్రహం తీవ్ర స్థాయికి చేరుతోంది. పెట్రోలియం లెవీ, ద్రవ్యోల్బణాన్ని వ్యతిరేకిస్తూ జమాత్-ఇ-ఇస్లామీ ఆందోళనకు పిలుపునివ్వడంతో వేల సంఖ్యలో ప్రజలు రోడ్ల పైకి… -
PM Modi: పొదుపు వేళ మోడీకి సినీ వర్కర్స్ అసోసియేషన్ లేఖ.. ఏముందంటే..!
ప్రస్తుతం భారతదేశంలో పొదుపు మంత్రం అమలవుతోంది. ప్రపంచ సంక్షోభం వేళ పౌరులు జాగ్రత్తగా ఉండాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. దీంతో ప్రధాని దగ్గర నుంచి కేంద్రమంత్రులు, రాష్ట్ర నాయకులు పొదుపు మంత్రం పాటిస్తున్నారు. -
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ఇరాన్ యుద్ధం.. రూపాయి విలువని మహాపతనం దిశగా నడిపిస్తోంది. చారిత్రక కనిష్ఠాల్లోనూ ఎప్పటికప్పుడు కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. ఆసియాలోనే అత్యంత పేలవ కరెన్సీగా నిలిచిన రూపాయి.. త్వరలో సెంచరీ మార్కు దాటే అవకాశం ఉంది. స్వతంత్ర భారతంలో రూపాయి ఇప్పటిదాకా ఏకంగా 29 రెట్లు పతనమైంది. రూపాయి విలువ తగ్గడంతో.. దిగుమతులు భారమై.. దేశంలో ద్రవ్యోల్బణం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలున్నట్టే.. రూపాయి పతనానికి కూడా పలు అంశాలు దోహదపడుతున్నాయి. ఇరాన్ యుద్ధానికి… -
Russian Ruble: డాలర్కు బిగ్ షాక్.. ప్రపంచంలోనే బెస్ట్ కరెన్సీగా రూబుల్.. వరుసగా రెండో ఏడాది రికార్డ్..
Russian Ruble: రష్యా కరెన్సీ 'రూబుల్' (Ruble) అంతర్జాతీయ మార్కెట్లో రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది. మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల వల్ల చమురు విక్రయాల ద్వారా రష్యాకు విదేశీ కరెన్సీ రాక ఒక్కసారిగా పెరిగింది. ఫలితంగా, ఈ త్రైమాసికంలో అమెరికన్ డాలర్తో పోలిస్తే ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన కరెన్సీగా రూబుల్ నిలిచింది. ఈ ఏడాది ఏప్రిల్ ప్రారంభం నుంచి రూబుల్ విలువ డాలర్తో పోలిస్తే దాదాపు 12% బలపడి 72.6 వద్దకు చేరుకుంది. 2023 ఫిబ్రవరి… -
Prices Hike: పాలు, ఫుడ్డు, సబ్బులు.. ఏదీ కొనేటట్టు లేదు బాబోయ్..పరిస్థితి ఇలాగే కొనసాగితే బతుకు బస్టాండే..!
జీవితం తలకిందులైంది అనే మాట అప్పుడప్పుడు వింటూ ఉంటాం…! ఒక్కరికో ఇద్దరికో కాదు… మొత్తం దేశంలో ఉన్న ప్రజల జీవితాలన్నీ తలకిందులవుతున్నాయి.. ఇంకా చెప్పాలంటే దేశం తీవ్రమైన గడ్డుపరిస్థితులను ఎదుర్కొంటోంది. కారణాలు ఏమైనా కావొచ్చు.. ద్రవ్యోల్బణం వల్ల సామాన్యులపై ధరల పిడుగు నాట్యమాడుతోంది. ఉదయం లేస్తే తాగే పాల నుంచి.. ఏసీల వరకు ప్రతి వస్తువు ధర ఆకాశాన్ని తాకుతోంది. అంతర్జాతీయంగా జరుగుతున్న యుద్ధం.. దాని కారణంగా పెరిగిన ముడిసరుకుల ధరలు.. సామాన్య మధ్యతరగతి ప్రజల బడ్జెట్… -
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
భారత్ను మహా సంక్షోభం వెంటాడుతోంది. ఆర్థిక మాంద్యం నుంచి తప్పంచుకోవాలంటే ఏకైక మార్గం పొదుపు మంత్రం. ప్రధాని మోడీ సూత్రాలను పాటిస్తే…దేశం ఆర్థిక కష్టాల నుంచి బయట పడుతుంది. అమెరికా దాడులతో ఇరాన్లో పెట్రోల్ ఉత్పత్తి భారీగా పడిపోయింది. ఆ ఎఫెక్ట్ చమురు సరఫరాపై తీవ్రంగా ప్రభావం చూపుతోంది. అది ఆర్థిక సంక్షోభంగా మారుతోంది. చమురు సరఫరా ఆగిపోతే…అనేక రంగాలపై ఎఫెక్ట్ పడుతుంది. ఇదే ఇవాళ్టీ స్టోరీ బోర్డు. మహా సంక్షోభం ముంచుకొస్తోంది. వేసే ప్రతి అడుగు…తీసుకునే… -
Petrol-Diesel prices: పెట్రోల్-డీజిల్ ధరలు పెరగొచ్చు.. ఆర్బీఐ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు..
Petrol-Diesel prices: ఇరాన్ వార్, మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతలు దేశ ఇంధన రంగాన్ని ప్రభావితం చేస్తున్నాయి. మన దేశమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఇంధన సమస్యలు ఉన్నాయి. ఇదిలా ఉంటే, ప్రధాని నరేంద్రమోడీ పొదుపు మంత్రాన్ని పాటించాలని చెప్పారు. దేశంలో పెట్రోల్-డీజిల్ ధరలు పెరుగుతాయనే ఆందోళనల నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) సంజయ్ మల్హోత్రా కీలక వ్యాఖ్యలు చేశారు. Read Also: Supreme Court: హిందూ మతం ఓ జీవన విధానం.. దీపం వెలిగిస్తే సరిపోతుందన్న… -
Repo Rate: రెపో రేట్ పై ఆర్బీఐ గవర్నర్ కీలక ప్రకటన.. ఈఎంఐ తగ్గుతుందా?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా MPC సమావేశ ఫలితాలను ప్రకటించింది. ఈ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలను ఆర్బిఐ గవర్నర్ వెల్లడించారు. ఫిబ్రవరిలో మాదిరిగానే, రెపో రేటు 5.25% వద్ద యథాతథంగా ఉంటుందని తెలిపారు. అంటే రెపో రేటులో ఎలాంటి మార్పు లేదు. దీని అర్థం మీ గృహ రుణం లేదా కారు రుణం EMI పెరగకుండా లేదా తగ్గకుండా యథాతథంగా ఉంటుంది. MPC సమావేశ ఫలితాలను ప్రకటిస్తూ, గవర్నర్ సంజయ్ మల్హోత్రా, కమిటీ తటస్థ వైఖరిని… -
Price Hike : సామాన్యుడికి షాక్.. భారీగా పెరగనున్న మందులు, పెయింట్ల ధరలు
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ మేఘాలు భారతీయ సామాన్యుడి బడ్జెట్పై పెను ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇరాన్ , ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు కేవలం అంతర్జాతీయ రాజకీయాలకే పరిమితం కాకుండా, మన దేశంలోని మందులు , పెయింట్ల ధరలను ఆకాశానికి చేర్చుతున్నాయి. ముఖ్యంగా ఔషధ రంగంపై ఈ ప్రభావం అత్యంత ఆందోళనకరంగా ఉంది. మన దేశంలో తయారయ్యే అనేక మందులకు అవసరమైన ముడి పదార్థాలు (Raw Materials) పశ్చిమాసియా , చైనా దేశాల నుండి దిగుమతి అవుతాయి. Botsa… -
Duddilla Sridhar Babu : ఆర్థిక సూచీల్లో తెలంగాణ దూసుకుపోతోంది
ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) వేదికగా తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విప్లవాత్మక విధానాలకు అంతర్జాతీయ స్థాయిలో అద్భుతమైన స్పందన లభించిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఐటీ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రాధాన్యతను గుర్తించి నిపుణుల సమక్షంలో ఆవిష్కరించిన ‘ఇన్నోవేషన్ హబ్’ , భవిష్యత్తు ఆరోగ్య రంగ అవసరాల కోసం రూపొందించిన ‘లైఫ్ సైన్సెస్ పాలసీ’లకు ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులు, నిపుణుల నుండి ప్రశంసలు వెల్లువెత్తాయని…
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!