Man invests Rs 49 on online gaming app, wins Rs 1.5 crore: ఆవగింజంత అదృష్టం ఉంటే చాలు నూటోడు కూడా కోటోడు కావచ్చు. అందుకు మధ్యప్రదేశ్ యువకుడే ఉదాహరణ. రాత్రికి రాత్రే కోట్లు గెలుచుకున్నాడు. దీంతో తన కొత్త ఇంటి కలను నెరవేర్చుకోబోతున్నాడు ఆ యువకుడు. ఓ ఆన్ లైన్ గేమింగ్ యాప్ లో రూ. 49 పెట్టుబడి పెట్టాడు. ఓవర నైట్ లో రూ. 1.5 కోట్లను గెలుచుకున్నాడు షహబుద్దీన్ అనే యువకుడు.
Twitter Logo Changed: ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్విట్టర్ తన లోగోను మార్చింది. ఇది చాలా మంది నెటిజన్లను ఆశ్చర్యపరిచింది. ట్విట్టర్ ప్రారంభం నుంచి ఉన్న ‘‘బ్లూ బర్డ్’’ కనిపించడం లేదు. కొత్తగా బ్లూబర్డ్ స్థానంలో ‘‘డాగ్కోయిన్’’ లోగోను తీసుకువచ్చారు. జపాన్ మూలాలు కలిగిన కుక్క జాతి షిబా ఇనుగాను పోలిన డాగీ కోయిన్ ప్రస్తుతం ట్విట్టర్ లోగోగా దర్శనం ఇస్తోంది.
Puffer Fish: మలేషియాకు చెందిన 83 ఏళ్ల మహిళ, ఆమె భర్త అత్యంత విషపూరితమైన ‘‘పఫర్ ఫిష్’’ ను తిని ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నారు. ఈ చేపను తిన్న తర్వాత భార్య చనిపోగా, భర్త ఐసీయూలో కోమాలో ఉన్నాడు. ప్రస్తుతం అతడికి చికిత్స చేస్తున్నారు వైద్యులు. వీరి కుమార్తె చెప్పిన దాని ప్రకారం సమీపంలో ఉన్న మార్కెట్ నుంచి ఈ డెడ్లీ చేపను తన తండ్రి కొనుగోలు చేసినట్లు బాధితుల కుమార్తె వెల్లడించారు.
Iran: ఇరాన్ దేశంలో ఇస్లామిక్ ఎంత కఠినంగా ఉంటాయో అందరికి తెలిసిందే. గతేడాది హిజాబ్ సరిగ్గా ధరించలేదని చెబుతూ ఆ దేశ మోరాలిటీ పోలీసులు మహ్సాఅమిని అనే యువతిని అరెస్ట్ చేశారు. ఆ తరువాత ఆమె చనిపోవడంతో ఇరాన్ వ్యాప్తంగా పెద్ద ఉద్యమమే జరిగింది. ఇరాన్ మహిళలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా జట్టు కత్తిరించుకుని, హిజాబ్ విసిరేస్తూ నిరసన తెలిపారు. దాదాపుగా గతేడాది చివరి వరకు ఈ అల్లర్లు అలాగే కొనసాగాయి. ప్రభుత్వం ఈ ఉద్యమంలో పాల్గొన్నవారిని గుర్తించి ఉరిశిక్షలతో పాటు తీవ్రమైన శిక్షలను విధించింది.
Donald Trump: పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్ ఆరోపణలు, లైంగిక వేధింపులు ఇలా పలు అభియోగాల్లో ఇరుక్కున్నారు మాజీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అక్కడి న్యాయమూర్తులు ట్రంపును విచారించేందుకు సిద్ధం అవుతున్నారు. ఆయన అరెస్టు జరుగుతుందనే వార్తలు కూడా వస్తున్నాయి. 2016 ఎన్నికల ముందు తనతో సెక్స్ చేసిన విషయాన్ని దాచేందుకు 1,30,000 డాలర్లను ఇచ్చినట్లు స్టార్మీ డేనియల్స్ ఆరోపిస్తోంది. మాన్ హటన్ అటార్నీ, గ్రాండ్ జ్యూరీ విచారణకు అనుమతించిన 24 గంటల్లోనే ట్రంప్ పై ఆయన అభిమానుల్లో సానుభూతి పెరిగింది.
Khalkha Jetsun Dhampa Rinpoche: 8 ఏళ్ల పిల్లాడిని చూసి చైనా భయపడుతోంది. ఈ ఎనిమిదేళ్ల బాలుడు టిబెట్ ను చైనా నుంచి వేరు చేస్తాడా అనే కలవరం మొదలైంది. మార్చి 8న హిమాచల్ ప్రదేశ్ ధర్మశాలలో ప్రముఖ బౌద్ధగురువు దలైలామా, ఎనిమిదేళ్ల బాలుడికి దీక్షను ఇచ్చారు. ముఖానికి మాస్క్ ధరించి ఉన్న ఈ పిల్లవాడి ఫోటో ప్రపంచం వ్యాప్తంగా వైరల్ గా మారింది.
West Bengal: రామ నవమి నుంచి పశ్చిమ బెంగాల్ అట్టుడుకుతోంది. రామ నవమి రోజున ప్రారంభం అయిన మతఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి. గత రెండు రోజుల నుంచి హౌరాలోని శిబ్ పూర్, కాజీపరా ప్రాంతాల్లో హింస చెలరేగుతోంది. రామ నవమి రోజున శోభాయాత్రపై ఓ వర్గం వారు రాళ్లదాడికి పాల్పడటంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఇరు వర్గాల మధ్య తీవ్రమైన పరిస్థితులు ఏర్పడిన సంగతి తెలిసిందే.
S Jaishankar:పాశ్యాత్య దేశాలకు మరోసారి తలంటారు భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు విషయంలో, ఉక్రెయిన్ యుద్ధ విషయంలో వెస్ట్రన్ దేశాలు భారత వైఖరిని తప్పుబడుతున్న సమయంలో వారికి సరైన పాఠం నేర్పారు జైశంకర్. ఇదిలా ఉంటే మరోసారి పాశ్చాత్య దేశాల వైఖరిని తప్పుబట్టారు. రాహుల్ గాంధీ విషయంలో పలు విదేశాలు స్పందించడంపై ‘‘ బ్యాడ్ హ్యాబిట్’’ అంటూ ఘాటుగా స్పందించారు.
Vande Bharat Express: భారతదేశంలో సెమీ హైస్పీడ్ రైల్ గా వందేభారత్ ఎక్స్ప్రెస్ ను కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. ఇప్పటికే దేశంలో వివిధ మార్గాల్లో వందేభారత్ ట్రైన్ పరుగులు తీస్తున్నాయి. తాజాగా శనివారం రోజు భోపాల్-న్యూఢిల్లీ మధ్య మరో వందే భారత్ రైలును ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. దీంతో కలిపి దేశవ్యాప్తంగా 11 వందేభారత్ రైళ్లు పరుగులు తీస్తున్నాయి. ఈ ఏప్రిల్ నెలలో మరో 4 రూట్లలో ఈ సూపర్ ఫాస్ట్ రైళ్లను ప్రభుత్వం ప్రారంభించనుంది.
Kapil Sibal: రామ నమవి రోజున, తర్వాత బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో మతఘర్షణలు చెలరేగాయి. చాలా వరకు ఇళ్లు, షాపులు, వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఇదిలా ఉంటే ఈ హింసాకాండపై ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా ఎందుకు మౌనంగా ఉంటున్నారని ఆదివారం ప్రశ్నించారు మాజీ కాంగ్రెస్ నేత, రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్. ఈ ఘర్షణలు 2024 సార్వత్రిక ఎన్నికల్లో కారణం కాకూడని ఆయన అన్నారు.