Puffer Fish: డెడ్లీ ఫిష్.. చేపను తిని భార్య మృతి.. కోమాలో భర్త..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Puffer Fish: మలేషియాకు చెందిన 83 ఏళ్ల మహిళ, ఆమె భర్త అత్యంత విషపూరితమైన ‘‘పఫర్ ఫిష్’’ ను తిని ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నారు. ఈ చేపను తిన్న తర్వాత భార్య చనిపోగా, భర్త ఐసీయూలో కోమాలో ఉన్నాడు. ప్రస్తుతం అతడికి చికిత్స చేస్తున్నారు వైద్యులు. వీరి కుమార్తె చెప్పిన దాని ప్రకారం సమీపంలో ఉన్న మార్కెట్ నుంచి ఈ డెడ్లీ చేపను తన తండ్రి కొనుగోలు చేసినట్లు బాధితుల కుమార్తె వెల్లడించారు. తన తండ్రి చాలా ఏళ్లుగా ఒకే చేపల వ్యాపారి నుంచి చేపలను కొనుగోలు చేస్తున్నారని, ఇలాంటి చేపను తింటే ప్రమాదంలో పడతామని వారికి తెలియదని కుమార్తె చెప్పింది.
Read Also: Iran: హిజాబ్ ధరించనందుకు మహిళలపై దాడి, ఆ తరువాత అరెస్ట్.. వీడియో వైరల్..
Also Read
- US: అమెరికాలో ఘోరం.. అగ్నిప్రమాదంలో గుజరాత్కు చెందిన కుటుంబం మృతి
- Russia: పుతిన్ దేశంలో పెట్రోల్ బంకులు ఖాళీ! రష్యాకు పెట్రోల్ అమ్ముతున్న భారత్..
- Iran - Israel: ఇరాన్ అణు స్థావరాలపై ఇజ్రాయెల్ గురి.. ట్రంప్ వార్నింగ్ను నెతన్యాహు బ్రేక్ చేస్తారా?
- Russian Couple: ప్రేమ కోసం ప్రాణాలనే పణంగా పెట్టిన జంట.. 1,454 అడుగుల ఎత్తులో ప్రపోజ్!
పఫర్ చేపను దంపతులు మధ్యాహ్న భోజనంలో తీసుకున్న తర్వాత కొద్ది సేపటికే మహిళ లిమ్ సీవ్ గ్వాన్ శరీరం వణకడంతో పాటు శ్వాసతీసుకోవడం ఇబ్బందిగా మారింది. కొన్ని గంటల తర్వాత ఆమె భర్తకు కూడా ఇలాంటి లక్షణాలే కనిపించాయి. వెంటనే వారి కుమారుడు తల్లిదండ్రులను ఆస్పత్రికి తరలించగా తల్లి మరణించింది. ప్రస్తుతం తండ్రి ఐసీయూలో కోమాలో ఉన్నాడు.
పఫర్ ఫిష్ అత్యంత విషపూరితమైన, రుచికరమైన చేప. దీన్ని వండేందుకు సుక్షితులైన వంటగాళ్లు ఉంటారు. అవగాహన లేకుండా వండితే దాదాపుగా ప్రాణాలు పోతాయి. ముఖ్యంగా జపాన్ దేశంలో ఈ పఫర్ చేపను ఇష్టంగా తింటారు. ఈ దేశంలో ఈ చేపను వండేందుకు ప్రత్యేకంగా పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ చేపలో అత్యంత విషపూరితమైన సిగ్వేటరా టాక్సిన్ లేదా టెట్రోడోటాక్సిన్, సాక్సిటాక్సిన్ అనే శక్తివంతమైన విషాలు ఉంటాయి. ఇది కార్డియాక్ డిస్రిథ్మియా, శ్వాసకోశ వైఫల్యం, న్యూరోలాజికల్ గా ప్రభావం చూపిస్తుంది. ఈ విషాలను తొలగించడం ట్రైన్డ్ చెఫ్ లకే సాధ్యం అవుతుంది.
తాజావార్తలు
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
CM Chandrababu Naidu: డేటానే కొత్త సంపద.. స్వర్ణాంధ్ర 2047 సాధనే లక్ష్యం.!
-
Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
-
Telangana Police : మాజీ డీజీపీలకు షాక్.. బుల్లెట్ప్రూఫ్ కార్లు వెనక్కి.!
-
Harish Rao : జూపల్లి మాట మార్చారు.. చర్చకు రాకుండా తప్పించుకున్నారు
ట్రెండింగ్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!