Kapil Sibal: బెంగాల్, బీహార్ మతఘర్షణలపై మోదీ, అమిత్ షా ఎందుకు మౌనంగా ఉన్నారు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kapil Sibal: రామ నమవి రోజున, తర్వాత బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో మతఘర్షణలు చెలరేగాయి. చాలా వరకు ఇళ్లు, షాపులు, వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఇదిలా ఉంటే ఈ హింసాకాండపై ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా ఎందుకు మౌనంగా ఉంటున్నారని ఆదివారం ప్రశ్నించారు మాజీ కాంగ్రెస్ నేత, రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్. ఈ ఘర్షణలు 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రధానాంశం కాకూడని ఆయన అన్నారు.
Read Also: Immoral Relationship : కొత్త ప్రేమకు మాజీ ప్రియుడు అడ్డంకి.. షాకింగ్ డెసిషన్ తీసుకున్న ప్రియురాలు
Also Read
- IMD Alert: దేశవ్యాప్తంగా భారీ వర్షాల హెచ్చరిక.. 3 రాష్ట్రాలకు రెడ్ అలర్ట్
- Pralhad Joshi: ధర్మేంద్ర ప్రధాన్ వారసుడిగా ప్రహ్లాద్ జోషి.. కొత్త విద్యాశాఖ మంత్రిగా నియామకం
- Indai: దేశ చరిత్రలో రాజీనామాలు చేసిన కేంద్రమంత్రులు ఎవరంటే..!
- CJP Protest: అభిజిత్ హీరో.. సోనమ్ జీరోనా..? వాంగ్చుక్ను పట్టించుకోని సీజేపీ..
బెంగాల్, బీహార్ లో చెలరేగిన హింస, విద్వేష బీజాలు రాజకీయ నాయకులు, రాజకీయ సిద్ధాంతాలకు మాత్రమే మేలు చేకూర్చేవిగా ఉన్నాయని కపిల్ సిబల్ అన్నారు. వీటి వల్ల సామాన్యుడు బలవుతున్నాడని తెలిపారు. ప్రధాని, హోంమంత్రి హింసపై మాట్లాడకపోవడం దురదృష్టకరమని వారు ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. ఇలాంటి ఘర్షణలకు దూరంగా దేశం ముందుకు సాగాలని ఆయన అన్నారు.
అంతకుముందు బీహార్ అల్లర్లపై ఆ రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ తో హోంమంత్రి అమిత్ షా మాట్లాడారు. మత ఘర్షణలపై ఆందోళన వ్యక్తం చేశారు. అయితే వీటిపై ఆందోళన వ్యక్తం చేస్తే సరిపోదని కపిల్ సిబల్ అన్నారు. రామ నవమి రోజున బీహార్ లోని ససారం, బీహార్ షరీఫ్ పట్టణాల్లో మత ఘర్షణలు జరిగాయి. ఈ ఘర్షణలకు సంబంధించి 45 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. పశ్చిమ బెంగాల్ హౌరాలోని శిబ్ పూర్, కాజీపరా ప్రాంతాల్లో రామ నవమి ఊరేగింపు సందర్భంగా ఘర్షణలు జరిగాయి.
తాజావార్తలు
-
OTR : రాజ్యసభ ఎంపీ గొల్ల బాబూరావు అసంతృప్తి? వైసీపీలో ప్రాధాన్యం లేదంటూ ఫీల్!
-
IMD Alert: దేశవ్యాప్తంగా భారీ వర్షాల హెచ్చరిక.. 3 రాష్ట్రాలకు రెడ్ అలర్ట్
-
CM Revanth Reddy : జెన్-జీ గెలిచింది.. మోడీ తలవంచారన్న రేవంత్!
-
OTR: కోమటిరెడ్డి బ్రదర్స్ కు తుంగతుర్తి ఎమ్మెల్యే సీరియస్ వార్నింగ్..! అసలు ఏం జరిగింది ?
-
OTR: జనగామ కాంగ్రెస్లో వర్గపోరు.. డీసీసీ vs నియోజకవర్గ ఇంచార్జ్ వార్!
ట్రెండింగ్
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!
-
Easy Wall Cleaning Tips: గోడలపై మరకలా? ఖరీదైన క్లీనర్లు వద్దు.. ఇంట్లో ఉన్నవే చాలు.!
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
-
12.1 అంగుళాల 2.5K డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!
-
3.2 అంగుళాల టచ్స్క్రీన్, Doubao AIతో HMD Touch AI ఫీచర్ ఫోన్ లాంచ్.!