China: 8 ఏళ్ల బాలుడిని చూసి భయపడుతున్న చైనా.. అసలేంటి ఆ స్టోరీ..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Khalkha Jetsun Dhampa Rinpoche: 8 ఏళ్ల పిల్లాడిని చూసి చైనా భయపడుతోంది. ఈ ఎనిమిదేళ్ల బాలుడు టిబెట్ ను చైనా నుంచి వేరు చేస్తాడా అనే కలవరం మొదలైంది. మార్చి 8న హిమాచల్ ప్రదేశ్ ధర్మశాలలో ప్రముఖ బౌద్ధగురువు దలైలామా, ఎనిమిదేళ్ల బాలుడికి దీక్షను ఇచ్చారు. ముఖానికి మాస్క్ ధరించి ఉన్న ఈ పిల్లవాడి ఫోటో ప్రపంచం వ్యాప్తంగా వైరల్ గా మారింది. ఈ ఫోటో ప్రస్తుతం చైనాకు నిద్ర లేకుండా చేసింది. దలైలామా దీక్షను ఇస్తూ ఆ పిల్లవాడిని ‘‘ఖల్ఖా జెట్సన్ దంపా రింపోచే’’ అవతారంగా భావిస్తున్నారు. టిబెటన్ బౌద్ధమతంలో మూడో అత్యున్నత స్థానాన్ని ఆ పిల్లవాడికి కట్టబెట్టారు.
టిబెట్ బౌద్ధమతంలో దలైలామా మొదటి స్థానంలో, పంచెన్ లామా రెండో స్థానంలో ఉండగా.. దంపా రింపోచే మూడో అత్యున్నత స్థానాన్ని పొందారు. రాబోయే రోజుల్లో టిబెల్ లో ఆయన ధర్మ గురవు కాబోతున్నాడనే వార్తలు చైనాను కలవరపరుస్తున్నాయి. దీంతో చైనా ఆ పిల్లవాడు ఎవరు..? వారి తల్లిదండ్రలు ఎవరు..? అని వెతకడం ప్రారంభించింది. మనకు ఉన్న సమాచారం ప్రకారం ఈ 8 ఏళ్ల పిల్లవాడు మంగోలియాకు చెందిన వ్యక్తిగా భావిస్తున్నారు. మంగోలియాకు చెందిన ఈ బాలుడు అమెరికా పౌరసత్వం కూడా ఉంది.
Also Read
- Donald Trump: "ఆ గౌరవం దక్కించుకున్న ఏకైక యూఎస్ ప్రెసిడెంట్ నేనే".. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై ట్రంప్ ఫిదా!
- Venezuela Earthquake: వెనెజువెలాను మళ్లీ వణికించిన భూకంపం.. ప్రజల్లో భయాందోళనలు
- US Airstrikes on Iran: మధ్యప్రాచ్యంలో మళ్లీ యుద్ధ మేఘాలు.. ఇరాన్పై అమెరికా వైమానిక దాడులు
- Buckingham Palace: రూ. 4,600 కోట్లు ఖర్చు పెట్టినా.. బకింహామ్ ప్యాలెస్ను వీడనున్న కింగ్ చార్లెస్!
Read Also: MI vs RCB: టాపార్డర్ విఫలం.. 10 ఓవర్లలో ముంబై స్కోరు ఇది
చైనా టిబెట్ ను ఆక్రమించుకుంది కానీ.. అక్కడి ప్రజల్లో మాత్రం దలైలామానే గురువుగా భావిస్తున్నారు. దలైలామా ఉన్నంత కాలం చైనా టిబెట్ పై పూర్తిగా ఆధిపత్యం ప్రదర్శించలేకపోతోంది. టిబెట్ ప్రజలు చైనాలో ఎక్కడ ఉన్నా కూడా దలైలామానే గురువుగా భావిస్తున్నారు. అయితే చైనా దలైలామా తర్వాత తనకు అనుకూలంగా ఉన్న వ్యక్తిని గురువుగా ఉంచాలని భావిస్తోంది. గతంలో దలైలామా టిబెట్ కు చెందిన ఓ పిల్లవాడిని పంచెన్ లామా 1995లో ప్రకటించారు. అయితే అతడిని చైనా ప్రభుత్వం కిడ్నాప్ చేసింది. అతడిని జైలు ఉంచారా..? చంపేశారా..? అనే సంగతి కూడా బయటి ప్రపంచానికి తెలియదు. ఆ స్థానంలో చైనా తనకు అనుకూలంగా ఉన్న వ్యక్తిని పంచెన్ లామాగా ప్రకటించింది. అయితే ఈ పంచెన్ లామాను టిబెట్ ప్రజలు ఇప్పటికీ అంగీకరించడం లేదు.
తన తర్వాత వారసుడిగా ఉండేందుకు చైనా భూభాగానికి చెందిన వ్యక్తి కాకుండా మంగోలియాకు చెందిన పిల్లవాడిని దలైలామా ఎంపిక చేశారు. రాబోయే కాలంలో దలైలామా స్థానాన్ని అధిరోహించే అవకాశం ఈ పిల్లాడికి ఏర్పడింది. టిబెటన్ బౌద్ధమతం మంగోలియాలో కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ నిర్ణయం పట్ల మంగోలియా సంతోషం వ్యక్తం చేస్తుంది. మరోవైపు చైనాతో శతృత్వం ఏర్పడొచ్చని భయపడుతోంది.
తాజావార్తలు
-
India First Hydrogen Train: భారత్ తొలి హైడ్రోజన్ రైలు ట్రయల్ రన్ సక్సెస్.. గంటకు 120 కిమీ వేగంతో పరుగులు
-
Donald Trump: “ఆ గౌరవం దక్కించుకున్న ఏకైక యూఎస్ ప్రెసిడెంట్ నేనే”.. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై ట్రంప్ ఫిదా!
-
Venezuela Earthquake: వెనెజువెలాను మళ్లీ వణికించిన భూకంపం.. ప్రజల్లో భయాందోళనలు
-
Vivo X Fold 6: 200MP కెమెరా, 7000mAh బ్యాటరీతో వివో ఎక్స్ ఫోల్డ్ 6 విడుదల.. ఫోల్డబుల్ ఫోన్లలో కొత్త బెంచ్మార్క్
-
TTD: రామ మందిరం విరాళాల వివాదం ఎఫెక్ట్.. టీటీడీ ఖాతాలకు టెక్నాలజీ అప్గ్రేడ్.! ఖాతాలకు టెక్నాలజీ అప్గ్రేడ్..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!