China: 8 ఏళ్ల బాలుడిని చూసి భయపడుతున్న చైనా.. అసలేంటి ఆ స్టోరీ..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Khalkha Jetsun Dhampa Rinpoche: 8 ఏళ్ల పిల్లాడిని చూసి చైనా భయపడుతోంది. ఈ ఎనిమిదేళ్ల బాలుడు టిబెట్ ను చైనా నుంచి వేరు చేస్తాడా అనే కలవరం మొదలైంది. మార్చి 8న హిమాచల్ ప్రదేశ్ ధర్మశాలలో ప్రముఖ బౌద్ధగురువు దలైలామా, ఎనిమిదేళ్ల బాలుడికి దీక్షను ఇచ్చారు. ముఖానికి మాస్క్ ధరించి ఉన్న ఈ పిల్లవాడి ఫోటో ప్రపంచం వ్యాప్తంగా వైరల్ గా మారింది. ఈ ఫోటో ప్రస్తుతం చైనాకు నిద్ర లేకుండా చేసింది. దలైలామా దీక్షను ఇస్తూ ఆ పిల్లవాడిని ‘‘ఖల్ఖా జెట్సన్ దంపా రింపోచే’’ అవతారంగా భావిస్తున్నారు. టిబెటన్ బౌద్ధమతంలో మూడో అత్యున్నత స్థానాన్ని ఆ పిల్లవాడికి కట్టబెట్టారు.
టిబెట్ బౌద్ధమతంలో దలైలామా మొదటి స్థానంలో, పంచెన్ లామా రెండో స్థానంలో ఉండగా.. దంపా రింపోచే మూడో అత్యున్నత స్థానాన్ని పొందారు. రాబోయే రోజుల్లో టిబెల్ లో ఆయన ధర్మ గురవు కాబోతున్నాడనే వార్తలు చైనాను కలవరపరుస్తున్నాయి. దీంతో చైనా ఆ పిల్లవాడు ఎవరు..? వారి తల్లిదండ్రలు ఎవరు..? అని వెతకడం ప్రారంభించింది. మనకు ఉన్న సమాచారం ప్రకారం ఈ 8 ఏళ్ల పిల్లవాడు మంగోలియాకు చెందిన వ్యక్తిగా భావిస్తున్నారు. మంగోలియాకు చెందిన ఈ బాలుడు అమెరికా పౌరసత్వం కూడా ఉంది.
Also Read
- PM Modi: అబుదాబిలో మోడీకి ప్రత్యేక గౌరవం.. ఎఫ్-16 యుద్ధ విమానాలతో రక్షణ
- Bermuda Triangle Mystery: బెర్ముడా రహస్యాన్ని ఛేదించిన శాస్త్రవేత్తలు.. అక్కడ ఏముందంటే..
- Pakistan: పాకిస్థాన్ సైన్యాన్ని వణికించిన ఉగ్రవాదులు.. సైనిక స్థావరంపై ఆత్మాహుతి దాడి.. 15 మంది మృతి!
- Donald Trump: “అమెరికా క్షీణించింది 100% నిజమే”.. జిన్పింగ్ వ్యాఖ్యలపై ట్రంప్ సంచలన పోస్ట్..!
Read Also: MI vs RCB: టాపార్డర్ విఫలం.. 10 ఓవర్లలో ముంబై స్కోరు ఇది
చైనా టిబెట్ ను ఆక్రమించుకుంది కానీ.. అక్కడి ప్రజల్లో మాత్రం దలైలామానే గురువుగా భావిస్తున్నారు. దలైలామా ఉన్నంత కాలం చైనా టిబెట్ పై పూర్తిగా ఆధిపత్యం ప్రదర్శించలేకపోతోంది. టిబెట్ ప్రజలు చైనాలో ఎక్కడ ఉన్నా కూడా దలైలామానే గురువుగా భావిస్తున్నారు. అయితే చైనా దలైలామా తర్వాత తనకు అనుకూలంగా ఉన్న వ్యక్తిని గురువుగా ఉంచాలని భావిస్తోంది. గతంలో దలైలామా టిబెట్ కు చెందిన ఓ పిల్లవాడిని పంచెన్ లామా 1995లో ప్రకటించారు. అయితే అతడిని చైనా ప్రభుత్వం కిడ్నాప్ చేసింది. అతడిని జైలు ఉంచారా..? చంపేశారా..? అనే సంగతి కూడా బయటి ప్రపంచానికి తెలియదు. ఆ స్థానంలో చైనా తనకు అనుకూలంగా ఉన్న వ్యక్తిని పంచెన్ లామాగా ప్రకటించింది. అయితే ఈ పంచెన్ లామాను టిబెట్ ప్రజలు ఇప్పటికీ అంగీకరించడం లేదు.
తన తర్వాత వారసుడిగా ఉండేందుకు చైనా భూభాగానికి చెందిన వ్యక్తి కాకుండా మంగోలియాకు చెందిన పిల్లవాడిని దలైలామా ఎంపిక చేశారు. రాబోయే కాలంలో దలైలామా స్థానాన్ని అధిరోహించే అవకాశం ఈ పిల్లాడికి ఏర్పడింది. టిబెటన్ బౌద్ధమతం మంగోలియాలో కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ నిర్ణయం పట్ల మంగోలియా సంతోషం వ్యక్తం చేస్తుంది. మరోవైపు చైనాతో శతృత్వం ఏర్పడొచ్చని భయపడుతోంది.
తాజావార్తలు
-
Husband Suicide: ‘‘నా చేయి పట్టుకున్న భార్యే నన్ను చంపింది’’.. సూసైడ్ వీడియోలో భర్త ఆవేదన
-
Dollar vs Rupee: రక్తకన్నీరు పెట్టుకుంటున్న రూపాయి.. తొలిసారిగా రూ.96 మార్క్ను దాటిన డాలర్ విలువ!
-
Durandhar 2 Review: ఓటీటీలోకి ‘ధురంధర్: ద రివెంజ్’.. ఎక్కడ? ఎప్పుడు? చూడాలంటే!
-
Peddi : వేట షురూ.. ‘రాంబుజ్జి’గా దివ్యేందు సంచలన ఎంట్రీ!
-
Bhojshala Case: “భోజ్శాల హిందువులదే”.. ఆలయం ఎలా మసీదుగా మారింది, చరిత్ర ఏం చెబుతోంది.?
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!