CM Revanth Reddy : అసెంబ్లీ వేదికగా కీలక బిల్లులు.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై సీఎం రేవంత్ దిశానిర్దేశం.!
- డిసెంబర్ 29 నుంచి అసెంబ్లీ సమావేశాలు
- జీహెచ్ఎంసీ విస్తరణపై మంత్రుల చర్చ
- ఎంపీటీసీ–జెడ్పీటీసీ ఎన్నికలపై ఫోకస్
- ఇన్ఛార్జ్ మంత్రులదే పూర్తి బాధ్యత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy : తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రులతో జరిగిన కీలక సమావేశం ముగిసింది. సుమారు మూడున్నర గంటల పాటు సాగిన ఈ భేటీలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, స్థానిక సంస్థల ఎన్నికలు, జీహెచ్ఎంసీ (GHMC) విస్తరణ వంటి ప్రధానాంశాలపై లోతైన చర్చ జరిగింది. రాష్ట్ర శాసనసభ సమావేశాలను ఈ నెల 29వ తేదీన ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రారంభం అనంతరం కొద్దిపాటి విరామం ఇచ్చి, తిరిగి జనవరి 2వ తేదీ నుండి సమావేశాలను నిరంతరాయంగా కొనసాగించనున్నారు. ఈ సమావేశాల్లో రాష్ట్రానికి సంబంధించిన కీలక బిల్లులను ప్రవేశపెట్టడంతో పాటు, ఇరిగేషన్ ప్రాజెక్టుల పురోగతి మరియు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం చర్చించనుంది.
Bhatti Vikramakra : విద్యుత్ ఉద్యోగులకు భట్టి కానుక.. 17.651 శాతం డీఏ ఖరారు..
Also Read
- Ponnam Prabhakar: "ఆ రోజే అనుమానం వచ్చింది".. పెట్రోల్ ధర పెరుగుదలపై మంత్రి సంచలన వ్యాఖ్యలు..
- Hyderabad Petrol Price: భాగ్యనగరంలో పెట్రోల్ మంట.. దేశంలోనే హైదరాబాద్లో అత్యధిక పెట్రోల్ ధర!
- Hyderabad: పక్కా ప్లాన్తో దోపిడీలు.. హైదరాబాద్ పోలీసులకు తలనొప్పిగా మారిన నేపాలీ గ్యాంగ్లు..
- Hyderabad: శంషాబాద్ ఎయిర్పోర్ట్కు బాంబు బెదిరింపు.. ఆ విమానమే టార్గెట్ అంటూ..
నగర పాలనను మరింత పకడ్బందీగా మార్చే క్రమంలో భాగంగా, జీహెచ్ఎంసీలో చుట్టుపక్కల ఉన్న మున్సిపాలిటీల విలీనంపై మంత్రుల సమావేశంలో చర్చించారు. కొత్తగా ఏర్పడబోయే డివిజన్ల ఏర్పాటు మరియు పరిపాలనాపరమైన మార్పులపై మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు. నగరాన్ని గ్లోబల్ సిటీగా మార్చే ప్రణాళికలో ఇది కీలక అడుగు అని ప్రభుత్వం భావిస్తోంది.
ఇటీవల ముగిసిన సర్పంచ్ ఎన్నికల్లో ప్రభుత్వానికి ప్రజల నుండి పూర్తి మద్దతు లభించిందని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే, పంచాయతీ ఎన్నికల సమయంలో జరిగిన కొన్ని పొరపాట్లను ప్రస్తావిస్తూ, రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అవి పునరావృతం కాకుండా చూడాలని మంత్రులను హెచ్చరించారు. ఈ ఎన్నికల విజయానికి సంబంధించి ఆయా జిల్లాల ఇన్-ఛార్జ్ మంత్రులే పూర్తి బాధ్యత వహించాలని సీఎం స్పష్టం చేశారు. స్థానిక సంస్థల్లో క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులను సమాయత్తం చేయాలని దిశానిర్దేశం చేశారు.
Deputy CM Pawan Kalyan: టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ.. హోటళ్లు, ట్రావెల్స్పై ప్రత్యేక నిఘా..
తాజావార్తలు
-
Bhojshala case: భోజ్శాల ఒక దేవాలయం.. మందిర్-మసీదు కేసులో హైకోర్టు సంచలన తీర్పు..
-
Keralam: మాజీ సీఎం విజయన్ను కలిసిన సతీశన్.. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చ
-
Film Chamber Meeting : ‘పెద్ది’ సినిమాకు లైన్ క్లియర్: థియేటర్ల వివాదంపై తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం!
-
Alia Bhatt :కేన్స్లో అలియాను పట్టించుకోలేదా..?
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!