West Bengal: హుగ్లీలో హింస.. బీజేపీ శోభాయాత్రపై రాళ్ల దాడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
West Bengal: రామ నవమి నుంచి పశ్చిమ బెంగాల్ అట్టుడుకుతోంది. రామ నవమి రోజున ప్రారంభం అయిన మతఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి. గత రెండు రోజుల నుంచి హౌరాలోని శిబ్ పూర్, కాజీపరా ప్రాంతాల్లో హింస చెలరేగుతోంది. రామ నవమి రోజున శోభాయాత్రపై ఓ వర్గం వారు రాళ్లదాడికి పాల్పడటంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఇరు వర్గాల మధ్య తీవ్రమైన పరిస్థితులు ఏర్పడిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే ఆదివారం హుగ్లీలోని రిస్రా ప్రాంతంలో బీజేపీ ఆధ్వర్యంలో రామ నవమి శోభాయాత్రపై మరోసారి రాళ్లదాడి జరిగింది. శోభాయాత్రఅలో బీజేపీ ఉపాధ్యక్షుడు దిలీప్ ఘోష్ ఉన్న సమయంలోనే దుండగులు వీరంగం సృష్టించారు. బీజేపీతో కలిసి విశ్వహిందూ పరిషత్, ఇతర హిందూ సంస్థలు ఈ ర్యాలీని నిర్వహించాయి. తాజాగా జరిగిన దాడిలో ఎమ్మెల్యే బిమన్ ఘోష్ గాయపడినట్లు బీజేపీ పేర్కొంది. సమాచారం అందుకున్న వెంటనే చందన్ నగర్ పోలీస్ కమిషనర్ అమిత్ జబల్ గీర్ అదనపు పోలీస్ బలగాలతో సంఘటన స్థలానికి చేరుకున్నారు.
Also Read
- Fake Cancer Drugs: క్యాన్సర్ బాధితుల ప్రాణాలతో చెలగాటం.. నీళ్లతో నింపిన నకిలీ ఇంజెక్షన్ల విక్రయం గుట్టురట్టు
- India-China Talks: BRICS 2026కు ముందు భారత్-చైనా కీలక భేటీ.. దోవల్, వాంగ్ యీ ఏం మాట్లాడారంటే?
- Sugar Prices Fall: సామాన్యులకు తీపి కబురు.. భారీగా తగ్గిన చక్కెర ధరలు
- Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్గాంధీ లేఖ.. ఏముందంటే..!
Read Also: S Jaishankar: “బ్యాడ్ హ్యాబిట్”.. రాహుల్ విషయంలో వెస్ట్రన్ దేశాలకు క్లాస్..
ఇదిలా ఉంటే ఈ ఘర్షణలు అధికార త్రుణమూల్ కాంగ్రెస్(టీఎంసీ), బీజేపీల మధ్య మాటల యుద్ధాన్ని పెంచుతున్నాయి. సీఎం మమతా బెనర్జీ హిందూ వ్యతిరేకి అని బీజేపీ నేతలు ఆరోపిస్తుంటే, కావాలనే బీజేపీ అల్లర్లను ప్రేరేపిస్తోందని టీఎంసీ ఆరోపిస్తోంది. హుగ్లీలో జరిగిన విధంగానే హౌరాలో జరిగిందని, ముందస్తు ప్రణాళిక ప్రకారమే బీజేపీ అల్లర్లను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తోందని టీఎంసీ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ అన్నారు.
హౌరాలో హింస చెలరేగిన కొద్ది రోజులకే హుగ్లీలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ ఘర్షనలకు సంబంధించి మొత్తం 38 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే పుర్బా బర్ధమాన్లోని శక్తిగ్రాహ్లో శనివారం సాయంత్రం బీజేపీ నాయకుడు రాజు ఝా అనే వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. ఇలా ఒకదాని తర్వాత ఒకటి సంఘటనలు జరుగుతుండటం పశ్చిమ బెంగాల్ లో ఉద్రిక్త పరిస్థితులు రేకెత్తిస్తున్నాయి.
తాజావార్తలు
-
Lurk OTT Release: ఆ అడవిలో అసలు భయం మనుషులే.. ఓటీటీలోకి మలయాళం సర్వైవల్ థ్రిల్లర్.. 8.8 ఐఎండీబీ రేటింగ్
-
Iran-US Ceasefire: గుడ్న్యూస్.. కాల్పుల విరమణకు అమెరికా-ఇరాన్ అంగీకారం?
-
Islamabad: ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం.. అగ్నికి ఆహుతైన 15 మంది నవజాత శిశువులు
-
US Visa Interview Pause: అమెరికా వీసా కోసం ఎదురుచూస్తున్నవారికి షాక్.. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్వ్యూలు వాయిదా, కారణం ఇదే!
-
Ravi Teja-Irumudi: బాక్సాఫీస్ను షేక్ చేస్తున్న ‘ఇరుముడి’.. రవితేజ @ 100 కోట్ల సినిమాల లిస్ట్ ఇదే!
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!