West Bengal: హుగ్లీలో హింస.. బీజేపీ శోభాయాత్రపై రాళ్ల దాడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
West Bengal: రామ నవమి నుంచి పశ్చిమ బెంగాల్ అట్టుడుకుతోంది. రామ నవమి రోజున ప్రారంభం అయిన మతఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి. గత రెండు రోజుల నుంచి హౌరాలోని శిబ్ పూర్, కాజీపరా ప్రాంతాల్లో హింస చెలరేగుతోంది. రామ నవమి రోజున శోభాయాత్రపై ఓ వర్గం వారు రాళ్లదాడికి పాల్పడటంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఇరు వర్గాల మధ్య తీవ్రమైన పరిస్థితులు ఏర్పడిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే ఆదివారం హుగ్లీలోని రిస్రా ప్రాంతంలో బీజేపీ ఆధ్వర్యంలో రామ నవమి శోభాయాత్రపై మరోసారి రాళ్లదాడి జరిగింది. శోభాయాత్రఅలో బీజేపీ ఉపాధ్యక్షుడు దిలీప్ ఘోష్ ఉన్న సమయంలోనే దుండగులు వీరంగం సృష్టించారు. బీజేపీతో కలిసి విశ్వహిందూ పరిషత్, ఇతర హిందూ సంస్థలు ఈ ర్యాలీని నిర్వహించాయి. తాజాగా జరిగిన దాడిలో ఎమ్మెల్యే బిమన్ ఘోష్ గాయపడినట్లు బీజేపీ పేర్కొంది. సమాచారం అందుకున్న వెంటనే చందన్ నగర్ పోలీస్ కమిషనర్ అమిత్ జబల్ గీర్ అదనపు పోలీస్ బలగాలతో సంఘటన స్థలానికి చేరుకున్నారు.
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
Read Also: S Jaishankar: “బ్యాడ్ హ్యాబిట్”.. రాహుల్ విషయంలో వెస్ట్రన్ దేశాలకు క్లాస్..
ఇదిలా ఉంటే ఈ ఘర్షణలు అధికార త్రుణమూల్ కాంగ్రెస్(టీఎంసీ), బీజేపీల మధ్య మాటల యుద్ధాన్ని పెంచుతున్నాయి. సీఎం మమతా బెనర్జీ హిందూ వ్యతిరేకి అని బీజేపీ నేతలు ఆరోపిస్తుంటే, కావాలనే బీజేపీ అల్లర్లను ప్రేరేపిస్తోందని టీఎంసీ ఆరోపిస్తోంది. హుగ్లీలో జరిగిన విధంగానే హౌరాలో జరిగిందని, ముందస్తు ప్రణాళిక ప్రకారమే బీజేపీ అల్లర్లను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తోందని టీఎంసీ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ అన్నారు.
హౌరాలో హింస చెలరేగిన కొద్ది రోజులకే హుగ్లీలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ ఘర్షనలకు సంబంధించి మొత్తం 38 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే పుర్బా బర్ధమాన్లోని శక్తిగ్రాహ్లో శనివారం సాయంత్రం బీజేపీ నాయకుడు రాజు ఝా అనే వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. ఇలా ఒకదాని తర్వాత ఒకటి సంఘటనలు జరుగుతుండటం పశ్చిమ బెంగాల్ లో ఉద్రిక్త పరిస్థితులు రేకెత్తిస్తున్నాయి.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!