PM Narendra Modi: “ప్రాజెక్ట్ టైగర్”కి 50 ఏళ్లు.. నేడు పులుల డేటా విడుదల చేయనున్న ప్రధాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
50 years of Project Tiger: ‘ప్రాజెక్ట్ టైగర్’ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ రోజు ప్రధాని నరేంద్రమోదీ పులుల గణన డేటాను విడుదల చేయనున్నారు. కర్ణాటకలోని చామనగర జిల్లా బందీపూర్ టైగర్ రిజర్వ్ లో పర్యటించనున్నారు ప్రధాని. హైదరాబాద్, చెన్నై పర్యటన తర్వాత ఆయన మైసూర్ వెళ్లారు. ‘అమృత్ కాల్’ సందర్భంగా పులుల సంరక్షణ కోసం ప్రభుత్వ విధానాలను కూడా ప్రధాని మోదీ విడుదల చేయనున్నారు.
ప్రధాని పర్యటన నేపథ్యంలో మైసూర్ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఏప్రిల్ 6 నుంచి ఏప్రిల్ 9 వరకు పర్యాటకులను టైగర్ రిజర్వ్ లోకి అధికారులు అనుమతించడం లేదు. జాతీయ రహదారి 181పై వాహనాల రాకపోకలను మూసేశారు. ఆదివారం ఉదయం 7.15 గంటలకు బందీపూర్ టైగర్ రిజర్వ సందర్శించిన తర్వాత 11 గంటలకు పులుల డేటాను విడుదల చేయనున్నారు. ప్రాజెక్ట్ టైగర్ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా స్మారక నాణేన్ని విడుదల చేయనున్నారు.
Also Read
- Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్పై ఓవైసీ ఆగ్రహం..
- Success Story: వయసు 23 ఏళ్లు.. ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆమె విజయ రహస్యం ఇదే..
- PM Modi: అది ‘‘హిందూ గ్రోత్ రేట్’’ కాదు, ‘‘కాంగ్రెస్ గ్రోత్ రేట్’’
- Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్ (ఐబిసిఎ) ద్వారా ప్రపంచంలోని పులి, సింహం, చిరుత, మంచు చిరుత, ప్యూమా, జాగ్వార్ వంటి పులుల సంరక్షణపై దృష్టి సారించారు. బందీపూర్ టైగర్ రిజర్వ్ లో పులుల సంరక్షణ చర్యల్లో పాల్గొంటున్న సిబ్బందితో ప్రధాని ముచ్చటించనున్నారు. తమిళనాడు సరిహద్దుల్లో ఉన్న ముదుమలై టైగర్ రిజర్వ్ లోని తెప్పకాడు ఏనుగుల శిబిరాన్ని కూడా ప్రధాని సందర్శించనున్నారు.
ప్రాజెక్ట్ టైగర్ అంటే ఏమిటి?
ప్రాజెక్ట్ టైగర్ ను భారత్ దేశం ఏప్రిల్ 1, 1973న ప్రారంభించింది. తగ్గిపోతున్న పులుల సంఖ్య పెంచడంతో పాటు వాటిని సంరక్షించడానికి ఈ ప్రాజెక్ట్ ను ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు దేశంలో 18,278 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 9 టైగర్ రిజర్వ్లను కలిగి ఉంది. గత 50 ఏళ్లుగా ఇండియాలో పులుల సంఖ్య క్రమంగా వృద్ధి చెందుతోంది. ప్రస్తుతం 75,500 చ.కి.మీ విస్తీర్ణంలో 53 టైగర్ రిజర్వులు ఉన్నాయి. ప్రస్తుతం భారత దేశంలో 3000 పులులు ఉన్నాయి. ప్రపంచంలో పులుల జనాభాలో 70 శాతం భారత్ లోనే ఉన్నాయి. ప్రతీ ఏడాది 6 శాతం చొప్పున పులుల సంఖ్య పెరుగుతోంది. ‘ప్రాజెక్ట్ టైగర్’ స్థానిక ప్రజలకు ఏటా 45 లక్షల పనిదినాలకు పైగా ఉపాధిని కల్పిస్తుంది.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!