PM Narendra Modi: “ప్రాజెక్ట్ టైగర్”కి 50 ఏళ్లు.. నేడు పులుల డేటా విడుదల చేయనున్న ప్రధాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
50 years of Project Tiger: ‘ప్రాజెక్ట్ టైగర్’ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ రోజు ప్రధాని నరేంద్రమోదీ పులుల గణన డేటాను విడుదల చేయనున్నారు. కర్ణాటకలోని చామనగర జిల్లా బందీపూర్ టైగర్ రిజర్వ్ లో పర్యటించనున్నారు ప్రధాని. హైదరాబాద్, చెన్నై పర్యటన తర్వాత ఆయన మైసూర్ వెళ్లారు. ‘అమృత్ కాల్’ సందర్భంగా పులుల సంరక్షణ కోసం ప్రభుత్వ విధానాలను కూడా ప్రధాని మోదీ విడుదల చేయనున్నారు.
ప్రధాని పర్యటన నేపథ్యంలో మైసూర్ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఏప్రిల్ 6 నుంచి ఏప్రిల్ 9 వరకు పర్యాటకులను టైగర్ రిజర్వ్ లోకి అధికారులు అనుమతించడం లేదు. జాతీయ రహదారి 181పై వాహనాల రాకపోకలను మూసేశారు. ఆదివారం ఉదయం 7.15 గంటలకు బందీపూర్ టైగర్ రిజర్వ సందర్శించిన తర్వాత 11 గంటలకు పులుల డేటాను విడుదల చేయనున్నారు. ప్రాజెక్ట్ టైగర్ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా స్మారక నాణేన్ని విడుదల చేయనున్నారు.
Also Read
- Ketan Agarwal Case: కేతన్ హత్యకు ముందు, తర్వాత చాట్స్ డిలీట్.. సియా-చేతన్ ఫోన్లలో కీలక ఆధారాలు
- Ketan Agarwal Case: మద్యం మత్తులో సియా గోయల్.. వీడియో వైరల్
- Congress: కాంగ్రెస్లో భారీ ప్రక్షాళన.. యూపీతో సహా కీలక రాష్ట్రాల ఇన్ఛార్జ్ల మార్పు! కారణం ఇదేనా
- Monsoon: శాటిలైట్ చిత్రాల్లో షాకింగ్ దృశ్యాలు.. దేశంలో కనిపించని వర్ష మేఘాలు
ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్ (ఐబిసిఎ) ద్వారా ప్రపంచంలోని పులి, సింహం, చిరుత, మంచు చిరుత, ప్యూమా, జాగ్వార్ వంటి పులుల సంరక్షణపై దృష్టి సారించారు. బందీపూర్ టైగర్ రిజర్వ్ లో పులుల సంరక్షణ చర్యల్లో పాల్గొంటున్న సిబ్బందితో ప్రధాని ముచ్చటించనున్నారు. తమిళనాడు సరిహద్దుల్లో ఉన్న ముదుమలై టైగర్ రిజర్వ్ లోని తెప్పకాడు ఏనుగుల శిబిరాన్ని కూడా ప్రధాని సందర్శించనున్నారు.
ప్రాజెక్ట్ టైగర్ అంటే ఏమిటి?
ప్రాజెక్ట్ టైగర్ ను భారత్ దేశం ఏప్రిల్ 1, 1973న ప్రారంభించింది. తగ్గిపోతున్న పులుల సంఖ్య పెంచడంతో పాటు వాటిని సంరక్షించడానికి ఈ ప్రాజెక్ట్ ను ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు దేశంలో 18,278 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 9 టైగర్ రిజర్వ్లను కలిగి ఉంది. గత 50 ఏళ్లుగా ఇండియాలో పులుల సంఖ్య క్రమంగా వృద్ధి చెందుతోంది. ప్రస్తుతం 75,500 చ.కి.మీ విస్తీర్ణంలో 53 టైగర్ రిజర్వులు ఉన్నాయి. ప్రస్తుతం భారత దేశంలో 3000 పులులు ఉన్నాయి. ప్రపంచంలో పులుల జనాభాలో 70 శాతం భారత్ లోనే ఉన్నాయి. ప్రతీ ఏడాది 6 శాతం చొప్పున పులుల సంఖ్య పెరుగుతోంది. ‘ప్రాజెక్ట్ టైగర్’ స్థానిక ప్రజలకు ఏటా 45 లక్షల పనిదినాలకు పైగా ఉపాధిని కల్పిస్తుంది.
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!