Covid 19: పెరుగుతున్న కరోనా కేసులు.. ఈ మూడు రాష్ట్రాల్లో మాస్కులు తప్పనిసరి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Covid 19: దేశవ్యాప్తంగా మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రం అప్రమత్తం అయింది. పెరుగుతున్న కేసుల నేపథ్యంలో ఇటీవల కేంద్ర ఆరోగ్యమంత్రి అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల మంత్రులతో సమావేశం నిర్వహించారు. ఐసీయూలు, ఆక్సిజన్ సదుపాయాలపై సూచనలు చేశారు. ఓ నెల క్రితం వరకు కేవలం వెయ్యి లోపలే ఉన్న రోజూవారీ కేసుల సంఖ్య ప్రస్తుతం వేలల్లో నమోదు అవుతోంది. నిన్న ఒక్క రోజే 6150 కేసులు నమోదు అయ్యాయి. యాక్టివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
కోవిడ్ ఫోర్త్ వేవ్ పై అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హెచ్చరిస్తోంది. కోవిడ్ మ్యూటేషన్ ఓమిక్రాన్ యొక్క BF.7 సబ్-వేరియంట్, ప్రస్తుతం XBB1.16 సబ్-వేరియంట్ కారణంగా కేసుల సంఖ్యలో పెరుగుదల కనిపిస్తోంది. ఈ సబ్ వేరియంట్లు పెద్దగా ప్రమాదకరం కాకున్న వేగంగా కేసులు పెరిగేందుకు దోహదపడుతున్నాయి.
Also Read
- Ketan Agarwal Case: కేతన్ హత్యకు ముందు, తర్వాత చాట్స్ డిలీట్.. సియా-చేతన్ ఫోన్లలో కీలక ఆధారాలు
- Ketan Agarwal Case: మద్యం మత్తులో సియా గోయల్.. వీడియో వైరల్
- Congress: కాంగ్రెస్లో భారీ ప్రక్షాళన.. యూపీతో సహా కీలక రాష్ట్రాల ఇన్ఛార్జ్ల మార్పు! కారణం ఇదేనా
- Monsoon: శాటిలైట్ చిత్రాల్లో షాకింగ్ దృశ్యాలు.. దేశంలో కనిపించని వర్ష మేఘాలు
Read Also: PM Narendra Modi: “ప్రాజెక్ట్ టైగర్”కి 50 ఏళ్లు.. నేడు పులుల డేటా విడుదల చేయనున్న ప్రధాని
ఇదిలా ఉంటే కేసుల సంఖ్య పెరగడంతో కొన్ని రాష్ట్రాలు మాస్కులను తప్పనిసరి చేశాయి.
హర్యానా:
హర్యానా ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యగా బహిరంగ ప్రదేశాల్లో ముఖానికి మాస్క్లు ధరించడం తప్పనిసరి చేసింది. కోవిడ్ ప్రోటోకాల్ అవలంభించాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రజలను కోరింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో నిబంధనలు అమలయ్యేలా చూడాలని అధికారులను, పంచాయతీలను ఆదేశించింది.
కేరళ:
గర్భిణీ స్త్రీలు, వృద్ధులు మరియు జీవనశైలి వ్యాధులతో బాధపడుతున్న వారికి కూడా కేరళ మాస్క్లను తప్పనిసరి చేసింది. కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితిని అంచనా వేయడానికి ఒక ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. కోవిడ్ సంబంధిత మరణాలు ఎక్కువగా 60 ఏళ్లు పైబడిన వారిలో, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారిలో ఎక్కువగా నమోదవుతున్నాయని చెప్పారు.
పుదుచ్చేరి:
పుదుచ్చేరి ప్రభుత్వం బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించడం తప్పనిసరి చేసింది. ఆసుపత్రులు, హోటళ్లు, రెస్టారెంట్లు, మద్యం దుకాణాలు, హాస్పిటాలిటీ, వినోద రంగాలు, ప్రభుత్వ కార్యాలయాలు, వాణిజ్య సంస్థల్లో పనిచేసే సిబ్బంది తప్పనిసరిగా మాస్క్లు ధరించాలని ఆదేశించింది.
ఇక ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం అన్ని విమానాశ్రయాల్లో అంతర్జాతీయ ప్రయాణికులకు పరీక్షలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కోవిడ్ పాజిటివ్ గా తేలితే అన్ని నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపాలని ప్రభుత్వం ఆదేశించింది. ఢిల్లీలోని కూడా కోవిడ్ కేసుల నేపథ్యంలో అప్రమత్తం అయింది. XBB.1.16 వేరియంట్ దేశరాజధానిలో కేసుల పెరుగుదలకు కారణం అవుతుందని నిపుణులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!