Covid 19: పెరుగుతున్న కరోనా కేసులు.. ఈ మూడు రాష్ట్రాల్లో మాస్కులు తప్పనిసరి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Covid 19: దేశవ్యాప్తంగా మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రం అప్రమత్తం అయింది. పెరుగుతున్న కేసుల నేపథ్యంలో ఇటీవల కేంద్ర ఆరోగ్యమంత్రి అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల మంత్రులతో సమావేశం నిర్వహించారు. ఐసీయూలు, ఆక్సిజన్ సదుపాయాలపై సూచనలు చేశారు. ఓ నెల క్రితం వరకు కేవలం వెయ్యి లోపలే ఉన్న రోజూవారీ కేసుల సంఖ్య ప్రస్తుతం వేలల్లో నమోదు అవుతోంది. నిన్న ఒక్క రోజే 6150 కేసులు నమోదు అయ్యాయి. యాక్టివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
కోవిడ్ ఫోర్త్ వేవ్ పై అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హెచ్చరిస్తోంది. కోవిడ్ మ్యూటేషన్ ఓమిక్రాన్ యొక్క BF.7 సబ్-వేరియంట్, ప్రస్తుతం XBB1.16 సబ్-వేరియంట్ కారణంగా కేసుల సంఖ్యలో పెరుగుదల కనిపిస్తోంది. ఈ సబ్ వేరియంట్లు పెద్దగా ప్రమాదకరం కాకున్న వేగంగా కేసులు పెరిగేందుకు దోహదపడుతున్నాయి.
Also Read
- Mohali Office Murder: ఆ కారణంతోనే చంపాడు.. మొహాలి ఘటన చెప్పిన చేదు నిజం!
- NEET UG 2026: నీట్ రీ-ఎగ్జామ్ కు ముందు.. పేపర్ లీక్ వదంతులపై విద్యార్థులకు ఎన్టీఏ విజ్ఞప్తి..
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
Read Also: PM Narendra Modi: “ప్రాజెక్ట్ టైగర్”కి 50 ఏళ్లు.. నేడు పులుల డేటా విడుదల చేయనున్న ప్రధాని
ఇదిలా ఉంటే కేసుల సంఖ్య పెరగడంతో కొన్ని రాష్ట్రాలు మాస్కులను తప్పనిసరి చేశాయి.
హర్యానా:
హర్యానా ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యగా బహిరంగ ప్రదేశాల్లో ముఖానికి మాస్క్లు ధరించడం తప్పనిసరి చేసింది. కోవిడ్ ప్రోటోకాల్ అవలంభించాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రజలను కోరింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో నిబంధనలు అమలయ్యేలా చూడాలని అధికారులను, పంచాయతీలను ఆదేశించింది.
కేరళ:
గర్భిణీ స్త్రీలు, వృద్ధులు మరియు జీవనశైలి వ్యాధులతో బాధపడుతున్న వారికి కూడా కేరళ మాస్క్లను తప్పనిసరి చేసింది. కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితిని అంచనా వేయడానికి ఒక ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. కోవిడ్ సంబంధిత మరణాలు ఎక్కువగా 60 ఏళ్లు పైబడిన వారిలో, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారిలో ఎక్కువగా నమోదవుతున్నాయని చెప్పారు.
పుదుచ్చేరి:
పుదుచ్చేరి ప్రభుత్వం బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించడం తప్పనిసరి చేసింది. ఆసుపత్రులు, హోటళ్లు, రెస్టారెంట్లు, మద్యం దుకాణాలు, హాస్పిటాలిటీ, వినోద రంగాలు, ప్రభుత్వ కార్యాలయాలు, వాణిజ్య సంస్థల్లో పనిచేసే సిబ్బంది తప్పనిసరిగా మాస్క్లు ధరించాలని ఆదేశించింది.
ఇక ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం అన్ని విమానాశ్రయాల్లో అంతర్జాతీయ ప్రయాణికులకు పరీక్షలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కోవిడ్ పాజిటివ్ గా తేలితే అన్ని నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపాలని ప్రభుత్వం ఆదేశించింది. ఢిల్లీలోని కూడా కోవిడ్ కేసుల నేపథ్యంలో అప్రమత్తం అయింది. XBB.1.16 వేరియంట్ దేశరాజధానిలో కేసుల పెరుగుదలకు కారణం అవుతుందని నిపుణులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Rajat Patidar: రెండు ఐపీఎల్ టైటిల్స్, 500 రన్స్.. పాటిదార్ ఎంపిక కాకపోవడంపై అగార్కర్ కీలక వ్యాఖ్యలు!
-
Peddi Controversy : హీరోయిన్లను బ్లేమ్ చేయకండి… చేసేదంతా దర్శకులే… ‘పెద్ది’ వివాదంపై నాగ్ హీరోయిన్ రియాక్షన్
-
NTRNEEL : ఎన్టీఆర్ ‘డ్రాగన్’ షూటింగ్.. ఈసారి లంకని తగలబెట్టబోతున్న నీల్
-
Polavaram Tiger: పోలవరం ఊపిరి పీల్చుకో.. డ్రోన్ కెమెరాలకు చిక్కిన పెద్దపులి!
-
7 Seater Cars: మారుతి ఎర్టిగా నుంచి మహీంద్రా బొలెరో వరకు.. రూ.5.65 లక్షల నుంచి లభించే చౌకైన 7-సీటర్ కార్లు ఇవే
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!